Nindu Noorella Saavasam Serial Today Episode: భాగీ, రాథోడ్లు ఇద్దరూ నర్సులో కలిసి వార్డెన్ ఉన్న రూంలోకి వెళ్తారు. వాళ్ల వెనకాలే మనోహరి కూడా వెళ్తుంది. అక్కడ స్పృహ లేకుండా ఉన్న సరస్వతిని చూసి మనోహరి షాక్ అవుతుంది.
మను: (మనసులో) నేను అంతా వెతుకుతుంటే ఇక్కడ చచ్చిందా ఇది
డాక్టర్: ఈవిడను ఇలా వదిలేయడం ఏంటండి
భాగీ: ఈవిడ నాతో చెప్పాలనుకుంటున్న విషయాన్ని ఎవరో చెప్పకుండా అడ్డుకుంటున్నారు. డాక్టర్ ఈవిడకు స్పృహ ఎప్పుడు వస్తుంది.
డాక్టర్: ఒక్క ఇంజక్షన్ చేసి స్పృహలోకి తీసుకొస్తాను. కానీ కొంచెం టైం పడుతుంది.
భాగీ: వెంటనే ఆవిడకు ఆ ఇంజక్షన్ ఇవ్వండి. అలాగే ట్రీట్మెంట్ కూడా స్టార్ట్ చేయండి. ఒక స్పెషల్ రూం ఇవ్వండి. తను చాలా డేంజర్లో ఉన్నారు.
డాక్టర్: ఓకే మేడం
భాగీ: రాథోడ్ అలాగే నువ్వు స్పెషల్ రూం ఎదుట స్పెషల్ సెక్యూరిటీ పెట్టించు
రాథోడ్: ఓకే మిస్సమ్మ
భాగీ: మనకు తెలియకుండా ఆ రూంలోకి ఎవ్వరూ వెళ్లకూడదు. ఆవిడను కలవకూడదు. ఆవిడ స్పృహలోకి రాగానే తను చెప్పాలనుకున్న విషయం తెలుసుకుంటాను. ఎవరు అడ్డుకుంటారో నేను చూస్తాను.
అని భాగీ చెప్పగానే.. సెక్యూరిటీ ఇప్పుడే ఏర్పాటు చేస్తానని రాథోడ్ వెళ్తాడు. తర్వాత కొద్ది సేపటికి ఐసీయూ దగ్గరకు తిరిగి వస్తాడు.
రాథోడ్: మిస్సమ్మ నువ్వు చెప్పినట్టే వార్డెన్ గారిని స్పెషల్ రూంలోకి షిప్ట్ చేశాను. బయట ఇద్దరు సెక్యూరిటీని పెట్టాను. వాళ్లను కాదని చిన్న చీమ కూడా లోపలికి వెళ్లదు. ఆవిడకు స్పృహ లేకుండా చేసింది కచ్చితంగా మనోహరే అయ్యుంటుంది మిస్సమ్మ. ఇందులో డౌటే లేదు
భాగీ: కానీ ఆధారాలు లేకుండా మనం ఏం చేయలేం కదా రాథోడ్
రాథోడ్: కానీ వార్డెన్ మేడం నీతో చెప్పాలనుకుంటున్న విషయాలను నీతో చెప్పకుండా మనోహరి అడ్డుకుంటుంది మిస్సమ్మ
భాగీ: ఆ విషయం నాకు తెలుసు రాథోడ్ కానీ ఆవిడ నోరు తెరచి చెప్పే వరకు మనం వెయిట్ చేయాల్సిందే..
డాక్టర్: ఏమ్మా బ్లడ్ దొరికిందా
భాగీ: ఇంకా దొరకలేదు డాక్టర్ ట్రై చేస్తున్నాము
డాక్టర్: ఇంకా ట్రై చేయడం ఏంటి..? టైం లేదు త్వరగా సర్జరీ చేయాలి.
భాగీ: ఒక అరగంటలో బ్లడ్ దొరుకుతుంది డాక్టర్ మీరు సర్జరీకి ఏర్పాట్లు చేయండి.
డాక్టర్: ఓకే అమ్మా
డాక్టర్ వెళ్లిపోతాడు.
రామ్మూర్తి: అరగంటలో ఎలా అవుతుందమ్మా.. అల్లుడు గారేమో పిల్లలను తీసుకుని రావానికి నిమజ్జనం దగ్గరకు వెళ్లాడు. మనం అంతా ఇక్కడే ఉన్నాం. మరి బ్లడ్ ఎవరు తీసుకొస్తారు.
భాగీ: బ్లడ్ కోసం మనం ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు నాన్న.. ఇక్కడే దొరుకుతుంది.
రాథోడ్: మిస్సమ్మ ఇక్కడ ఆ బ్లడ్ గ్రూప్ ఎవరికి ఉంటుంది
భాగీ: మనోహరికి ఉంటుంది.
రామ్మూర్తి: మనోహరిది అంజలి బ్లడ్ గ్రూప్ ఎలా అవుతుందమ్మా..
భాగీ: ఎలా అంటే మనోహరి, అంజలి కన్నతల్లి కాబట్టి
ఆరు: కరెక్టు భాగీ అదే కరెక్టు.. అదే కన్నతల్లి
రాథోడ్: అది ఇంకా కన్ఫం కాలేదు కదా మిస్సమ్మ
భాగీ: ఇప్పుడు కన్ఫం అవుతుంది. నాన్నా మీరు ఏం చేస్తారు అంటే
అంటూ రామ్మూర్తికి చెవిలో తన ప్లాన్ గురించి చెప్తుంది. అదేంటో వినడానికి ఆరు దగ్గరకు వెల్లబోతుంటే గుప్త ఆపేస్తాడు. ప్లాన్ మొత్తం విన్న రామ్మూర్తి సరే నవ్వు చెప్పినట్టే చేస్తాను అంటాడు. దీంతో భాగీ, రాథోడ్ పక్కకు వెళ్లి చాటు నుంచి చూస్తుంటారు. ఇంతలో అక్కడకు మనోహరి రాగానే రామ్మూర్తి నాటకం మొదలు పెడతాడు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!