Nindu Noorella Saavasam Serial Today Episode:  తన తోడబుట్టిన అక్క గురించి రామ్మూర్తిని నిజం చెప్పమని భాగీ అడగడంతో రామ్మూర్తి సైలెంట్‌గా ఉండిపోతాడు. అక్కడే గోడకు రామ్మూర్తి, ఆరు, భాగీ ముగ్గురు ఉన్న ఫోటో చూస్తుంది భాగీ. ఆ ఫోటో చూసి ఎమోషనల్ అవుతుంది.

Continues below advertisement

భాగీ: నాన్నా అక్కా…? అక్కేనా..? చెప్పండి నాన్న ఆరు అక్కే నా అక్కనా..? నా తొడబుట్టిన అక్కనా..?

రామ్మూర్తి: అవునమ్మా.. ఆ అరుంధతియే నీ తోడబుట్టిన అక్క తల్లి.. నా కడుపున పుట్టిన నా పెద్ద బిడ్డ తల్లి..

Continues below advertisement

భాగీ ఎమోషనల్ అవుతూ ఫోటో తీసుకుని గుండెలకు హత్తుకుని ఏడుస్తుంది. ఇంతలో అక్కడికి అమర్‌ వచ్చి డోర్‌ దగ్గరే నిలబడి అంతా గమనిస్తుంటాడు. మరోవైపు అమర్‌ ఇంట్లో గార్డెన్‌లో ఉన్న ఆరుకు గుండెల్లో ఏదో అలజడి అవుతుంది.

గుప్త: ఏమిటి బాలిక ఒళ్లు జలదరించినట్టు ఉన్నదా..?

ఆరు: అవును గుప్త గారు ఎందుకు అలా

గుప్త: ఎందులకు అనగా.. నీ సహోదరికి నిజం తెలిసింది.

ఆరు:  ఏ నిజం తెలసింది గుప్త గారు

గుప్త: నీవే తన సహోదరివి అన్న నిజం తెలిసింది.

ఆరు షాక్‌.. కట్‌ చేస్తే.. అమర్‌  రామ్మూర్తి ఇంట్లోకి వెళ్తాడు. వెళ్లగానే.. అమర్‌ను చూసిన భాగీ ఆరు ఫోటో చూపిస్తుంది.

భాగీ: ఏవండి.. మా అక్కండి.. నా తోడబుట్టిన సొంత అక్క

రామ్మూర్తి:  అల్లుడి గారికి ముందే తెలుసమ్మా

మరోవైపు

ఆరు: అయితే నా చెల్లికి నిజం తెలిసిందా..? గుప్తగారు

గుప్త: అవును బాలిక నీవు మా లోకమునకు వచ్చు సమయం ఆసన్నం అయినది కదా బాలిక ఆ లోపుగా అన్ని నిజములు తెలియవలెను కదా..?

ఇంకోవైపు

భాగీ: అంటే మీకు నిజం తెలిసినా ఇన్నాళ్లు నా దగ్గర దాచారా..?

రామ్మూర్తి: నిజం తెలిస్తే నువ్వు బాధపడతావని అల్లుడుగారు నీకు నిజం చెప్పొద్దని నా దగ్గర మాట తీసుకున్నారమ్మా

ఇంకోవైపు

ఆరు: ఇప్పుడు నా చెల్లెలు పరిస్థితి ఏంటి గుప్తగారు.. ఇప్పుడు తను ఎంత బాధపడుతుందో..

గుప్త: మరి శోకము తప్పదు కదా బాలిక

ఇంకోవైపు

అమర్‌: వార్డెన్‌ గారి దగ్గరకు వెళ్లి ఎంక్వైరీ చేశావని తెలియగానే.. ఇక్కడికి వచ్చుంటావని ఊహించాను

భాగీ: నాతో మా అక్క గురించి ఎందుకు చెప్పలేదండి

అమర్‌: ఇంటికి వెళ్లి మాట్లాడుకుందాం పద

అంటూ అమర్‌ చెప్పగానే.. నేను కాసేపు ఉండి వస్తానని భాగీ చెప్తుంది. అమర్‌ సరే అంటూ వెళ్లిపోతాడు. రాత్రి అయినా డాడీ మిస్సమ్మ ఇంకా ఇంటికి రాలేదేంటి అని హాల్లో ఆలోచిస్తూ ఉంటుంది అంజు. ఇంతలో మనోహరి వస్తుంది.

అంజు: ఆంటీకి తెలుసేమో కనుక్కుంటాను (మను దగ్గరకు వెళ్లి) ఆంటీ డాడీ మిస్సమ్మ ఎక్కడికి వెళ్లారు..? ఎప్పుడు వస్తారు..?

మను: నాకు తెలియదు అంజు

అంజు: అదేంటి ఆంటీ మీకు తెలియకుండా వెళ్తారా..?

మను: వాళ్లేమైనా నాకు చెప్పి వెళ్తారా..? అయినా అన్ని సార్లు నన్ను ఆంటీ.. ఆంటీ అని పిలవకు నాకు వయసైపోయింది అన్న ఫీలింగ్ వస్తుంది

అంజు: పోనీ అమ్మా అని పిలవనా..?

మను: అమ్మనా..?

అంజు: అవును మీరు నాకు బ్లడ్‌ ఇచ్చి కాపాడారు కదా నాకు రీ బర్తు ఇచ్చారు అంటే మీరు నాకు అమ్మే కదా

మను: ( మనసులో) నేను నీకు పునర్జన్మను ఇచ్చాను అంతకు ముందు ఒక బిడ్డకు జన్మనిచ్చాను. అది ఇప్పుడు ఎక్కడుందో ఎలా తెలియదు..

అనుకుంటూ గతం గుర్తు చేసుకుంటుంది.

అంజు: ఆంటీ.. ఆంటీ…

మను: ఏంటి..? ఆంటీ అని పిలవొద్దని ఎన్ని సార్లు చెప్పాలి నీకు

అంజు: అంటీ అంటే ఫీలవుతున్నారు అమ్మా అని పిలుస్తానంటే ఆలోచిస్తున్నారు మను అని పిలవనా..?

మను: మనునా..?

అంజు: అవును మా అమ్మ మిమ్మల్ని అలాగే పిలిచేది అంట కదా

మను: వద్దు

అంజు: ఎందుకు నేను అలా పిలిస్తే మీకు మా అమ్మ గుర్తుకు వస్తుందా..?

అంటూ విసిగిస్తుంటే.. మనోహరి కోపంగా అంజును తిడుతుంది. ఇక్కడి నుంచి వెళ్లిపో అంటూ వార్నింగ్‌ ఇస్తుంది. దీంతో అంజు వెళ్లిపోతుంది. మరోవైపు రామ్మూర్తి ఇంట్లో ఉన్న భాగీ, ఆరుతో మాట్లాడుతుంటే రామ్మూర్తి చూస్తాడు. అక్కడకు వెళ్లి అక్క వచ్చిందా అన్నట్టు సైగ చేస్తాడు. అవునన్నట్టు భాగీ తలూపుతుంది. దీంతో రామ్మూర్తి ఎమోషనల్ అవుతుంటాడు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!