Nindu Noorella Saavasam Serial Today Episode:  పిల్లలు నలుగురు హోం వర్క్‌ చేస్తుంటారు. ఇంతలో అంజు హోం వర్క్‌ ఆపేసి ఏదో ఆలోచిస్తుంది. అమ్ము చూసి తిడుతుంది.

Continues below advertisement


అమ్ము:  ఏయ్‌ అంజు హోం వర్క్‌ చేయవా…? ఇవాళ స్కూల్‌ కు వెళ్లాలని లేదా హోం వర్క్‌ చేయకుండా తెగా ఆలోచిస్తున్నావు


అంజు: నేను ఆలోచిస్తుంది హోం వర్క్‌ గురించి కాదు. మన హోంలో జరుగుతున్న మిస్టరీ గురించి


ఆనంద్‌: నువ్వు ఇకా దాని గురించే ఆలోచిస్తున్నావా..? వదిలేయ్‌ అంజు


అంజు: నో ఆ మిస్టరీని సాల్వ్‌ చేసే వరకు వదిలిపెట్టను


ఆకాష్‌: అవును మరి నువ్వు పెద్ద డిటెక్టివ్‌వి ఎక్కువగా ఆలోచించకు అంజు ముందు హోం వర్క్‌ చేయ్‌


అంజు:  కోపంగా అబ్బా నేను చెప్పేది అసలు వినరేంటి..? నైట్‌ మిస్సమ్మ మాట్లాడింది కచ్చితంగా ఆత్మతోనే.. ఆ విషయం మనకు చెప్పకుండా మిస్సమ్మ దాస్తుంది


అమ్ము:  అంజు నీకు పిచ్చి పట్టిందే. ముందు నువ్వు టీవీలో ఆ ఘోస్ట్‌ మూవీస్‌ చూడటం మానేయ్‌


ఆనంద్‌: అవును అంజు నువ్వు ఘోస్ట్‌ మూవీస్‌ చూడట వల్లే ఇలా మాట్లాడుతున్నావు..


ఆకాష్‌: వెంటనే నువ్వు ఆ మూవీస్‌ చూడటం ఆపేయ్‌ లేదంటే డాడీకి చెప్తాను.


అంజు: అబ్బా నాకేం పిచ్చి పట్టలేదు.. దయ్యాల సినిమాలు చూసి చెప్పడం లేదు. ఆత్మలు ఉన్నాయని అమ్మ ఆత్మ ఉందని స్వామిజీ చెప్పారు కదా..? మిస్సమ్మ మాట్లాడుతుంది ఆత్మతోనే అది మన అమ్మ ఆత్మతోనే..


అమ్ము:  సరే సరే నువ్వు చెప్పిందే నిజం అనుకుందాం. అమ్మ కనిపిస్తే మన అందరికీ కనిపించాలి కానీ మిస్సమ్మకే కనిపించడం ఏంటి..?


ఆనంద్‌: అంజు అమ్మ డాడీకి కనిపించకపోతే మనకు కనిపించాలి కానీ మిస్సమ్మకే ఎందుకు కనిపిస్తుంది


ఆకాష్‌: అమ్మకు డాడీ కన్నా మనకన్నా మిస్సమ్మ ఎక్కువ కాదు కదా అంజు ఆ లాజిక్‌ ఎలా మిస్‌ అవుతావు నువ్వు


అంజు: నేను లాజిక్‌ మిస్‌ అవ్వలేదు.. ఆ పాయింట్‌ గురించే  ఆలోచిస్తున్నాను.. డాడీకి మనకు కనిపించని అమ్మ, మిస్సమ్మ ఒక్కదానికే ఎందుకు కనిపిస్తుంది..?


అమ్ము: ఎందుకంటే నీ బుర్రలో పురుగు తిరుగుతుంది కాబట్టి అమ్మ ఎవ్వరికీ కనిపించలేదు అది నీ భ్రమ..


ఆనంద్‌: అనవసరంగా పిచ్చి పిచ్చి ఊహలు ఊహించుకోకు అంజు నీ ఏజ్‌కు అది సూట్‌ కాదు..


ఆకాష్‌: నా మాట విను నువ్వు అలా ఆలోచిస్తున్నావు అని తెలిస్తే డాడీ తిడతాడు. ఆ విషయం వదిలేయ్‌..


అంజు: నో నేను ఒకటి అనుకుంటే అసలు వదిలిపెట్టను.. డాడీ ఏమీ అనరు.. మిస్సమ్మ అమ్మ ఆత్మతోనే మాట్లాడుతుందని నేను ప్రూవ్‌ చేస్తాను


అమ్ము, ఆకాష్‌, ఆనంద్ నవ్వుకుంటారు. అంజు కోపంగా చూస్తుంది. తర్వాత తన సొంత అక్క గురించి తన తండ్రి రామ్మూర్తికి నిజం తెలిసే ఉంటుందనుకుని అక్కడికే వెళ్లి నాన్ననే అడగుదాం అనుకుని భాగీ రామ్మూర్తి ఇంటికి వెళ్తుంది.


రామ్మూర్తి: ఏమ్మా భాగీ… ఎప్పుడొచ్చావు.. పిల్లలు వచ్చారా..? అల్లుడు గారు వచ్చారా..?


భాగీ: లేదు నాన్న నేను ఒక్కదాన్నే వచ్చాను..


రామ్మూర్తి: ఒక్కదానివే వచ్చావా..? ఎందుకమ్మా..


భాగీ: ఏం లేదు నాన్న ఒక నిజం తెలుసుకుందామని వచ్చాను.. అక్క గురించి మీకు నిజం తెలుసు కదా నాన్నా..? చెప్పండి నాన్న అక్క ఎక్కడ ఉంది…? అసలు ఉందా అక్క చెప్పండి నాన్న


అంటూ ఏడుస్తూ.. అక్కడే గోడకు ఉన్న ఆరు ఫోటో చూస్తుంది భాగీ. ఆ ఫోటో చూసిన భాగీ షాకింగ్‌ గా నాన్న ఏంటి ఇది.. అని అడుగుతుంది. రామ్మూర్తి షాకింగ్‌ మౌనంగా ఉండిపోతాడు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.


ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!