Nindu Noorella Saavasam Serial Today Episode: ఆరుకు అస్థికలు అమర్‌ గంగలో నిమజ్జనం చేయగానే ఆరు కనిపించకుండా పోతుంది. దీంతో భాగీ ఆ చుట్టు పక్కల వెతుకుతుంది ఎక్కడా ఆరు కనిపించకపోవడంతో ఏడుస్తూ భాగీ స్పృహ కోల్పోతుంది. వెంటనే అమర్‌, భాగీని తీసుకుని హాస్పిటల్‌కు వెళ్తాడు. డాక్టర్‌ వచ్చి భాగీని చెక్‌ చేస్తుంది.

Continues below advertisement

డాక్టర్‌: అమరేంద్ర గారు మీకో గుడ్‌ న్యూస్‌..

అమర్‌: ఏంటి మేడం అది..? తను స్పృహ కోల్పోతే మీరు గుడ్‌ న్యూస్‌ అంటున్నారు

Continues below advertisement

డాక్టర్‌: మరేం కంగారు పడాల్సిన అవసరం లేదండి. తను ప్రెగ్నెంట్‌.. అందుకే అలా పడిపోయింది.

అంటూ డాక్టర్‌ చెప్పగానే అందరూ హ్యాపీగా ఫీలవుతారు. మనోహరి మాత్రం ఇరిటేటింగ్‌గా ఫీలవుతుంది.

మను: అయ్యో ఒక కష్టం తప్పింది అనుకునే లోపు మరో కష్టం వస్తుంది. ఇన్ని రోజులు దీన్ని చంపేయకుండా వదిలేయడమే నేను చేసిన తప్పు

మంగళ: ( మనసులో) మనోహరి నెత్తిన పిడుగుపడినట్టు ఉంది.

రామ్మూర్తి: దేవుడా నా పెద్ద బిడ్డ మళ్లీ నా చిన్న బిడ్డ కడుపులో పుట్టాలి..?

అని ఎవరికి వాళ్లు మనసులో అనుకుంటుంటారు. ఇంతలో డాక్టర్ జాగ్రత్తలు చెప్పి మెడిసిన్స్ రాసి ఇచ్చి ఇవి టైం ప్రకారం వాడండి అని చెప్పి వెళ్లిపోతుంది. అమర్‌ వాళ్లు ఇంటికి వస్తారు. మనోహరి కోపంగా రూంలోకి వెళ్తుంది.

మను: ఇన్ని రోజులు నుంచి నేను ఏదైతే కాకూడదని భయపడ్డానో అదే జరిగింది. ఆ ఆరు పీడ విరగడి అయిందని అనుకునేలోపే ఇప్పుడు ఈ న్యూస్‌ వినాల్సి వచ్చింది. ఈ విషయం వెంటనే రణవీర్‌కు చెప్పాలి.

అనుకుంటూ రణవీర్ కాల్‌ చేస్తుంది మను. బెడ్‌ మీద మూలుగుతూ ఉన్న రణవీర్‌ కాల్‌ లిప్ట్‌ చేసి బాధగా ఏంటి మనోహరి ఫోన్‌ చేశావు అని అడుగుతాడు.

మను: ఏంటి రణవీర్‌ అలా మాట్లాడుతున్నావు.. ఏమైంది.

రణవీర్‌: కొత్తగా ఏమీ కాలేదు మనోహరి… మొన్న అమరేంద్ర చేతిలో తిన్న దెబ్బలే ఇంకా తగ్గలేదు.. చెప్పు మనోహరి ఎందుకు ఫోన్‌ చేశావు

మను: ఎందుకేంటి రణవీర్‌.. ఆ భాగీ నెల తప్పింది. ఇప్పుడది బిడ్డను కనబోతుంది. మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ భాగీని కానీ పిల్లలను కానీ ఏమీ చేయలేకపోతున్నాము. అయినా ఆ చంభా ఏం చేస్తుంది. అసలు ఉందా..? పారిపోయిందా..?

రణవీర్‌:  ఏమో కనుక్కుని చెప్తాను మనోహరి.

అని రణవీర్‌ విసుగ్గా చెప్పగానే మనోహరి కోపంగా కాల్‌ కట్‌ చేస్తుంది. మరోవైపు తన కడుపులో ఉన్న బిడ్డ తనకు వద్దని భాగీ ఆలోచిస్తుంది. అదే విషయం రాథోడ్‌కు చెప్తుంది. రాథోడ్‌ కోపంగా భాగీని తిడతాడు.

రాథోడ్‌: ఎందుకు నీ కడుపులో బిడ్డను నువ్వే చంపుకోవాలనుకుంటున్నావు కారణం చెప్పు

భాగీ: నా వల్ల మా అక్కకు కానీ తన పిల్లలు కానీ బాధపడకూడదు. ఎప్పుడైతే నేను ఆయన భార్యను అయ్యానో అప్పుడే అక్క పిల్లలు నాకు సొంత పిల్లలు అయ్యారు. ఇక అందుకే నాకు పిల్లలు అవసరం లేదు అనుకుంటున్నాను రాథోడ్‌. అందుకే అబార్షన్‌ చేయించుకోవాలి అనుకుంటున్నాను.

రాథోడ్‌: మిస్సమ్మ  నిజంగా నీ ఆలోచన గొప్ప  త్యాగం లాంటిది.. ఎవ్వరూ చేయలేని త్యాగం నువ్వు చేయాలనుకుంటున్నావు.. కానీ సార్‌కు తెలిస్తే ఏమంటారో ఆలోచించు మిస్సమ్మ..

భాగీ: లేదు రాథోడ్‌ ఎలాగైనా ఆయన్ని ఒప్పించాలి.

రాథోడ్‌: సరే మిస్సమ్మ.. కానీ మరోసారి ఆలోచించి నిర్ణయం తీసుకో

అని రాథోడ్‌ చెప్తుంటాడు. అయితే పైన యమలోకంలో ఉన్న ఆరు, యముడు, గుప్త కింద రాథోడ్‌, భాగీ మాట్లాడుకోవడం మాయాపీఠికలో చూస్తుంటారు. భాగీ మాటలు విన్న ఆరు ఎమోషనల్‌ అవుతుంది.

ఆరు: ఆడదానికి అమ్మతనం అనేది చాలా గొప్పవరం. ఆ అదృష్టాన్ని ఆనందాన్ని పోగొట్టుకోకు భాగీ

కింద

భాగీ: నాకు ఇప్పటికే  నలుగురు పిల్లలు ఉన్నారు. ఇక నాకు కొత్తగా ఇప్పుడు పిల్లలు వద్దు రాథోడ్‌.. రేపే వెళ్లి అబార్షన్‌ చేయించుకుంటాను

అని చెప్తుంది. దీంతో రాథోడ్‌ షాక్‌ అవుతాడు. ఆరు బాధపడుతుంది. పక్కనే నిలబడ్డ యముడు, గుప్త మాత్రం మౌనంగా చూస్తుంటారు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!