Nindu Noorella Saavasam Serial Today Episode: మనోహరి ప్లాన్‌ ప్రకారం భాగీ కడుపులో బిడ్డను తాంత్రిక పూజలు చేసి చంపాలని చంభా రణవీర్‌ ఇంట్లో పూజలు చేస్తుంది. పూజలు మొదలు పెట్టినప్పుడు భాగీ బాధపడుతుంది. భాగీ బాధను చూసి ఇదంతా చంభా చేస్తున్న పూజల వల్లే అనుకుని సంబరపడుతుంది. అయితే పూజలు ఎంత సేపు చేసినా ఫలితం రాదు. దీంతో చంభా అంజనం వేసి నిజం తెలుసుకుంటుంది. భాగీ కడుపులో పిండం ఎన్ని మంత్రాలు, పూజలు చేసినా చనిపోదని తెలిసి షాక్‌ అవుతుంది. వెంటనే పూజలు ఆపేసి మనోమరి దగ్గరకు వెళ్తుంది. రణవీర్‌ వచ్చి ఏమైందని అడుగుతాడు.

Continues below advertisement

చంభా: ఆ భాగీ కడుపులో పిండాన్ని చంపడం అంత తేలిక కాదు రణవీర్‌. ఆ పిండం వల్ల మనోహరి ప్రాణగండం రానుంది.  

రణవీర్‌: నేను ముందే చెప్పాను.. అయినా ఆ మనోహరే వినడం లేదు.. అన్ని వదిలేసి కోల్‌కతా రమ్మన్నాను అయినా మొండిగా ఇక్కడే ఉంటానంటుంది. తన కర్మ తాను అనుభవిస్తే తప్పా మనోహరికి బుద్ది రాదులే చంభా.. అయినా నువ్వేంటి మళ్లీ గెటప్‌ చేంజ్‌ చేశావు ఎక్కడికి వెళ్తున్నావు..  

Continues below advertisement

చంభా: అమరేంద్ర ఇంటికే వెళ్తున్నాను.. మనోహరి నిజం చెప్పి జాగ్రత్తగా ఉండమని చెప్పడానికి

రణవీర్‌: నువ్వు వెళ్లి చెప్పడం దేనికి చంభా.. ఆ మనోహరికి ఫోన్‌లో చెప్పొచ్చు కదా..? నువ్వు ఇక్కడే ఉండు

అంటూ రణవీర్‌ చెప్పినా చంభా వినకుండా అమర్‌ ఇంటికి బయలుదేరుతుంది. మరోవైపు రూంలో కూర్చుని ఆలోచిస్తుంది మను..

మను: చంభా ఈ పాటికే పూజ పూర్తి చేసి ఉంటుంది. భాగీకి ఏ క్షణంలోనైనా అబార్షన్‌ అవ్వొచ్చు..? భాగీకి అబార్షన్‌ అయ్యాక దాన్ని ఎలాగైనా అమర్‌ దగ్గర ఇరికించేసి అమర్‌ దృష్టిలో భాగీని పిచ్చి దాన్ని చేయాలి తర్వాత ఎలాగైనా భాగీని చంపేసి ఎంచక్కా అమర్‌ను పెళ్లి చేసుకోవచ్చు

అని హ్యాపీగా నవ్వుకుంటుంది. ఇంతలో అక్కడికి చంభా వస్తుంది. మనోహరి నవ్వుకోవడం చూసి ఏంటి మనోహరి నన్ను చూసి నవ్వుతున్నావా..? అని అడుగతుంది.

మను: లేదు చంభా.. నేను నీ ఫోన్‌ కాల్‌ కోసమే వెయిట్‌ చేస్తున్నాను. కానీ నువ్వే వచ్చేశావు..? చెప్పు చంభా పూజ పూర్తి చేశావా..? ఎప్పుడు భాగీకి అబార్షన్‌ అవుతుంది. చెప్పు చంభా ఏంటి మౌనంగా ఉన్నావు.. చెప్పు చంభా

చంభా: భాగీకి అబార్షన్‌ అయ్యేలా చేయడం అంత సులువు కాదు మనోహరి.. నేను ఎంత నిష్టగా పూజ చేసినా కూడా భాగీ కడుపులో పిండాన్ని ఏమీ చేయలేకపోయాను.. నా శక్తులన్నీ ఉపయోగించాను కానీ ఆ పిండాన్ని నా శక్తులు టచ్‌ కూడా చేయలేకపోయాయి. భాగీ కడుపులో ఉన్నది చాలా గట్టి పిండం మనోహరి. ఇక నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి మనోహరి

మను: ఏంటి చంభా నువ్వు చెప్పేది

చంభా: అవును మనోహరి నేను చెప్పేది నిజం.. భయంకరమైన నిజం.. కంసుడి పాలిట కృష్ణుడు మృత్యువు అయినట్టు.. నీ పాలిట భాగీకి పుట్టబోయే బిడ్డ మృత్యువు కాబోతుంది. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి మనోహరి.. ఎప్పుడైతే భాగీ కడుపులో ఆ బిడ్డ పడిందో అప్పుడే నీ పతనం కూడా మొదలైంది మనోహరి..

మను షాక్ అవుతుంది.

మను:  అసలు భాగీకి పుట్టే బిడ్డ నాకెందుకు మృత్యువు అవుతుంది..?

అప్పుడే భాగీ పై నుంచి కిందకు వచ్చి మనోహరి రూం డోర్ దగ్గర నిలబడి ఇద్దరూ మాట్లాడుకోవడం వింటుంది.

మను: చంభా నువ్వు చెప్పింది విన్నాక నాకొకటి అర్తం అయింది. భాగీ కడుపులో పిండం పెరిగే కొద్దీ నాకు ఆయుష్సు తగ్గిపోతుంది అన్నమాట

చంభా: సరిగ్గా చెప్పావు ఆ పిండాన్ని అవతల వేస్తేనే నువ్వు బతుకుతావు.. కానీ ఆ పిండాన్ని చంపడం అంత తేలిక కాదు.

మను: అరుందతినే చంపిన దాన్ని నాకు ఆ పిండం ఒక లెక్క కాదు..

చంభా: ఈ లోపు ఆ బ్లాక్‌ మ్యాన్‌ నిన్ను చంపేస్తాడేమో..?

మను: ఆ బ్లాక్‌ మ్యాన్‌ను అడ్డం పెట్టుకుని ఆ భాగీని చంపేస్తాను

అని మను చెప్తుంది. దీంతో డోర్‌ దగ్గర వింటున్న భాగీ షాక్ అవుతుంది. ఇంతలో మనోహరి, చంభా, భాగీని చూస్తారు. ఇద్దరూ షాక్‌ అవుతారు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!