Nindu Noorella Saavasam Serial Today Episode:  నిండు నూరేళ్ల సావాసం సీరియల్  అనుకోని మలుపులు తిరుగుతుంది. ఇప్పటికే అమర్ ను చంపేయాలని చూసిన మనోహరి ప్లాన్‌ రివర్స్‌ అవుతుంది. అమర్‌ను భాగీ ఇంటికి తీసుకొస్తుంది. దీంతో మనోహరి భయపడుతుంది. ఎలాగైనా మరోసారి అమర్‌ను చంపాలని ప్లాన్‌ చేస్తుంది మనోహరి.

Continues below advertisement

ఇంట్లో పిల్లలు యాదమ్మ దగ్గరకు వెళ్లి రాథోడ్‌, మిస్సమ్మ కనిపించడం లేదేంటని అడుగుతారు. జరిగిందంతా యాదమ్మ పిల్లలకు చెప్తుంది. పిల్లలు భయపడుతూ కొడైకెనాల్ వెళ్తామని అంటుంటే.. వాళ్లే అక్కడి నుంచి వస్తున్నారట అని యాదమ్మ చెప్తుండగానే.. అమర్‌ ను తీసుకుని భాగీ, రాథోడ్‌ వస్తారు. వాళ్లకు ఎదురుగా వెళ్తారు పిల్లలు.

ఆనంద్‌: మిస్సమ్మ డాడ్ కు ఏమైంది..? కళ్లు తెరవడం లేదు.

Continues below advertisement

బుజ్జమ్మ: సార్‌ కళ్లు తెరవండి సార్‌.. మీకెలా యాక్సిడెంట్‌ అయింది సార్‌

భాగీ: పిల్లలు మీ డాడ్‌కు ఏమీ కాలేదు. మన అదృష్టం బాగుండి తలకు చిన్న గాయం మాత్రమే తగిలింది.

అంజు: మరి డాడీ ఎందుకు కళ్లు తెరవడం లేదు. ఎందుకు మాతో మాట్లాడటం లేదు

రాథోడ్: నొప్పి తగ్గడానికి డాడీకి మత్తు ఇంజక్షన్‌ ఇచ్చారు అమ్మా 

ఆనంద్‌: నిజంగా డాడీకి ఏమీ కాలేదు కదా మీరు అబద్దం చెప్పడం లేదు కదా

ఆకాష్‌: మీకు చాలాసార్లు ఫోన్‌ చేశాం.. రాథోడ్‌ ఫోన్‌ మీ ఫోన్‌ ఎవ్వరూ లిఫ్ట్‌ చేయలేదు. మేము చాలా టెన్షన్‌ పడ్డాం..

భాగీ: పిల్లలు టెన్షన్‌ ఏమీ లేదు.. డాడీకి ఏమీ కాలేదు.. రెండు రోజులు రెస్ట్ తీసుకోమన్నారు అంతే.. పదండి ఫస్ట్‌ లోపలికి వెళ్దాం పదండి. (అందరూ అమర్‌ బెడ్‌ రూంలోకి వెళ్తారు.) పిల్లలు ఈ రెండు రోజులు మీరు డాడీని ఎవ్వరూ డిస్టర్బ్‌ చేయకూడదు.. మీరు ఎగ్జామ్స్‌ మీద కాంసంట్రేషన్‌ చేయాలి.

అంజు: డాడీకి ఇలా ఉంటే మేము ఎలా చదవగలం మిస్సమ్మ. మాకు కాంసంట్రేషన్‌ ఎలా వస్తుంది

రాథోడ్‌: డాడీకి ఏమీ కాలేదు అంజు పాప మత్తు ఇంజక్షన్‌ ప్రభావం తగ్గగానే కళ్లు తెరుస్తారు

భాగీ: అవును అంజు డాడీని నేను చూసుకుంటాను.. మీరు మీ ఎగ్జామ్‌ మీద దృష్టి పెట్టండి మీరు బాగా మార్కులు తెచ్చుకోవాలని మీ డాడీ ఆశ

ఆనంద్: ఓకే మిస్సమ్మ డాడ్‌ విష్‌ మాకు కూడా తెలుసు. మేము బాగా చదువుతాము..

ఆకాష్‌: ఎగ్జామ్స్‌ లో మంచి మార్కులు తెచ్చుకుంటాము.. డాడీ త్వరగా కళ్లు తెరచి మాతో మాట్లాడాలి

భాగీ: అలాగే డాడీ కళ్లు తెరవగానే.. ముందు మీకే చెప్తాను మీరు వెళ్లండి

బుజ్జమ్మ: (మనసులో) నాన్న

భాగీ: బుజ్జమ్మ నాన్నకు… సార్‌కు ఏమీ కాలేదమ్మా.. ఎందుకు ఏడుస్తున్నావు.. సార్‌ కాసేపట్లో కళ్లు తెరచి మనందరితో మాట్లాడతారు. రాథోడ్‌ నువ్వు ఇక్కడే ఉండు నేను పిల్లలకు ఏమైనా తినిపించి వస్తాను

అంటూ భాగీ పిల్లలను తీసుకుని కిందకు వెళ్తుంది. తర్వాత రూంలో ఉన్న మనోహరి ఎలాగైనా అమర్‌ను చంపేయాలని ప్లాన్‌ చేస్తుంది. లాన్‌లో రాథోడ్‌ తో ఉన్న భాగీ కూడా ఎలాగైనా మనోహరి తప్పులను సాక్ష్యాలతో బయటపెట్టాలని ఆలోచిస్తుంటుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!