Nindu Noorella Saavasam Serial Today Episode:  ఇంట్లోకి వెళ్లిన  రణవీర్‌, అమర్‌ దగ్గరకు వెళ్లి ఇవాళ రాత్రికే కోల్‌కత్తా వెళ్తున్నానని చెప్తాడు. ఇంతలో మనోహరి వచ్చి నేను కూడా కోల్‌కతా వెళ్తున్నానని చెప్పడంతో అందరూ షాక్‌ అవుతారు.

అమర్‌: నువ్వా నువ్వెందుకు

మను: నేను కూడా కొన్ని రోజులు కోల్‌కతాలో ఉన్నాను కదా..? ఫ్రెండ్స్‌ ఉన్నారు వాళ్లను కలిసి వస్తాను

భాగీ: ఏంటి రాథోడ్‌ వీళ్లేదో పెద్ద ప్లాన్‌ వేయబోతున్నారని మనం భయపడుతుంటే.. ఇద్దరూ కట్ట కట్టుకుని ఇక్కడి నుంచి వెళ్లిపోతాం అంటున్నారేంటి

రాథోడ్‌: మిస్సమ్మ శని సెండాఫ్‌ ఇచ్చి వెళ్లిపోతాను అంటుంటే.. కారణం మనకెందుకు వెళ్లిపోతున్నారు అది చాలు

భాగీ: అదీ కరెక్టే.. మనును రణవీర్‌తో ఫ్లైట్‌ ఎక్కిద్దాం.. మళ్లీ తిరిగి రాకుండా చేద్దాం

నిర్మల: అది సరే కానీ అక్కడ ఎక్కడుంటావు మనోహరి

భాగీ: అది మనోహరి గారు మేనేజ్‌ చేసుకుంటారులే అత్తయ్యా.. మనోహరి గారు చిన్నపిల్లేం కాదు.. అక్కడ చాలా రోజులు ఉన్నాను అని చెప్తున్నారు కదా..? పైగా మన రణవీర్‌ గారు ఉన్నారు కదా.. సరే మరి బ్యాగ్‌ సర్దుకోండి మనోహరి గారు. మీ టైం అయిపోయింది

మను: ఏంటి ఏం మాట్లాడుతున్నావు

భాగీ: అదే మీ ఫ్లైట్ కు టైం అవుతుంది కదా

రణవీర్‌: అమరేంద్ర గారు అంజును కూడా మాతో తీసుకెళ్దుమా..?

రణవీర్‌ మాటకు భాగీ చేతిలో కాఫీ కప్పు కింద పడిపోతుంది.

నిర్మల: ఏమైంది మిస్సమ్మ.. ఓంట్లో బాగాలేదా..?

భాగీ: ఏం లేదు అత్తయ్యా అంజలిని తీసుకెళ్తామని అనడంతో కప్పు కింద పడిపోయింది.

అమర్‌: ఆరు లేకుండా నేను ఎప్పుడూ పిల్లలను బయటకు పంపలేదు

శివరాం: అవునమ్మా మనోహరి అంజు అల్లరిపిల్ల దాన్ని కంట్రోల్‌ చేయడం అంత ఈజీ కాదు

నిర్మల: సెలవుల్లో పిల్లలను తీసుకుని అమర్‌ కూడా వస్తాడులే

రణవీర్‌:  ఈ నెలంతా మా ఇంట్లో దుర్గామాత పూజలు చేస్తాము. అంజు వస్తే బాగుంటుందని

అంటూ రణవీర్‌  ఎమోషనల్‌ బ్లాక్‌ మెయిల్‌ చేయడంతో అమర్‌ సరే తీసుకెళ్లండి అని చెప్తాడు. దీంతో శివరాం, నిర్మల, భాగీ వద్దని చెప్తారు. అమర్‌ మాత్రం అంజలిని పిలిచి తన అభిప్రాయం అడుగుదామని.. తను వెళ్తానంటే పంపిద్దామని చెప్తాడు. రాథోడ్‌ వెళ్లి అంజును తీసుకుని వస్తాడు.

అంజు: చెప్పండి డాడ్‌

అమర్‌: అంజు మనోహరి ఆంటీతో పాటు నువ్వు కూడా కోల్‌కతా వెళ్తావా..?

అంజు: మీరెవరూ రారా డాడ్‌

అమర్‌: లేదు నాన్నా మనోహరి ఆంటీ ఉంటుంది కదా..?

మనోహరి:  అంజు నేను అంకుల్‌ ఉన్నాం కదా..? నిన్ను బాగా చూసుకుంటాం

అంజు:  సరే డాడ్‌ వెళ్తాను

అని చెప్పడంతో భాగీ, బయట నుంచి చూస్తున్న ఆరు షాక్‌ అవుతారు. రణవీర్‌ హ్యాపీగా అమర్‌కు థాంక్స్‌ చెప్పి వెళ్లిపోతాడు. మను కూడా లగేజీ సర్దుకుంటానని వెళ్లిపోతుంది.   తర్వాత గార్డెన్‌లో ఉన్న భాగీ దగ్గరకు రాథోడ్‌ వస్తాడు.

రాథోడ్‌ : ఏం ఆలోచిస్తున్నావు మిస్సమ్మ..

భాగీ: ఆల్‌రెడీ అంజలి దగ్గర ఉన్న చైన్‌ను అదే పనిగా మళ్లీ చేయించి అంజలికి గిఫ్టుగా ఎందుకు ఇచ్చారు. అసలు అంజలిని ఎందుకు కోల్‌కతా తీసుకెళ్లాలి అనుకున్నారు. అంజలి, చైన్‌, కోల్‌కతా ఏదో సంబంధం ఉంది రాథోడ్‌. వీళ్ల స్వార్థం వెనక, అంజలి కోల్‌కతా వెళ్లడం వెనక ఏదో ఉంది అది మనం కనిపెట్టాలి.

రాథోడ్‌ : ఇవన్నీ మనకెందుకు మిస్సమ్మ.. అంజు పాప కోల్‌కతా వెళ్లకుండా ఎలా ఆపగలం అది ఆలోచించు

భాగీ: అయితే నువ్వు వెళ్లి అంజు కోల్‌కతా వెళ్లడం ఇష్టం లేదని ఆయనకు  చెప్పు రాథోడ్‌ .

రాథోడ్‌: నేనా అసలు సార్‌ కళ్లు ఎర్రజేయగానే నేను పరుగెత్తుకెళ్లాలి

అని భయపడుతుండగానే అమర్‌ రాథోడ్‌ అంటూ పిలుస్తాడు. రాథోడ్‌ పరుగెత్తుకుని వెళ్లిపోతాడు. ఇంతలో ఆరు వచ్చి అంజలియే తాను వెళ్లలని చెబితే సరిపోతుంది కదా అంటూ ఐడియా ఇస్తుంది. అవునని భాగీ అంజలి దగ్గరకు వెళ్తుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

 

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!