Nindu Noorella Saavasam Serial Today Episode: భాగీని పిలిచిన అమర్‌ పిల్లలను చూసుకోవడానికి ఒక కేర్‌ టేకర్‌ను పెడదాం అంటాడు. దీంతో భాగీ షాక్ అవుతుంది. ఇవాళ ఉదయం పక్కింటి అక్క కూడా ఇదే విషయం చెప్పారు అంటుంది. కేర్‌ టేకర్‌ కోసం పేపర్‌లో యాడ్‌ ఇద్దామని డిసైడ్‌ అవుతారు. మరోవైపు అనామిక జాబ్‌ కోసం పేపర్‌ లో యాడ్‌ చూస్తుంది. అర్ధరాత్రి కాళీ కత్తితో రణవీర్‌ ఇంట్లోకి దూరి పొడవాలని చూస్తాడు. రణవీర్‌ నిద్ర లేవగానే ఇద్దరి మధ్య పెనుగులాట జరుగుతుంది. కాళీ కత్తితో రణవీర్‌ను పొడిచి పారిపోతాడు. రణవీర్‌ మనుషులు వచ్చి రణవీర్‌ను హాస్పిటల్‌కు తీసుకెళ్తారు. మరోవైపు కాళీ ఫోన్‌ కోసం మనోహరి ఎదురు చూస్తుంది.


మనోహరి: ఈ కాళీ గాడు ఏంటి ఇంకా ఫోన్‌ చేయలేదు. ఆ రణవీర్‌ను చంపాడో.. రణవీర్‌ చేతిలో చచ్చాడో తెలియడం లేదే..? (ఇంతలో కాళీ ఫోన్‌ చేస్తాడు.) హలో ఎక్కడ చచ్చావు ఇంత సేపు.. ఆ రణవీర్‌ను చంపేశావా..? వాడు చనిపోయాడా..?


కాళీ: లేదు. వాడిని పొడిచాను. కానీ చావలేదు.. చచ్చేదాకా పొడవాలని చూస్తే వాడి మనుషులు వచ్చారు. ఏం చేయాలో తెలియక తప్పించుకుని వచ్చేశా..?


మనోహరి: ఒరేయ్‌ ఇడియట్‌ నువ్వు ఏం చేశావో నీకు అర్థం అవుతుందా..? రణవీర్‌ను పొడిచింది నువ్వే అని తెలిస్తే ఏమవుతుందో తెలుసా..?


కాళీ: ఎట్లా తెలుస్తుంది. నా ముఖానికి మాస్క్‌ వేసుకుని పోయిన


మనోహరి: చంపింది నువ్వే అని తెలియకపోయినా చంపడానికి ప్రయత్నించింది నేనే అని  కచ్చితంగా కనిపెట్టేస్తాడు


కాళీ: ఏం ఎందుకు అంత భయపడతావు


మనోహరి: వాడు అనుమానంతో ఇప్పుడు నాకు ఫోన్‌ చేసినా చేస్తాడు. (రణవీర్‌, మనోహరికి ఫోన్‌ చేస్తుంటాడు.) రణవీర్‌ నాకు ఫోన్‌ చేస్తున్నాడు. వాడికి అనుమానం వచ్చినట్టు ఉంది.


కాళీ: ఎట్లా ఇప్పుడు ఏం చేద్దా


మనోహరి: ప్రాణాలు కాపాడుకోవాలి అంటే ఎక్కడికైనా దూరంగా పారిపో


అని కాళీకి చెప్పిన మనోహరి రణవీర్‌ కాల్‌ లిఫ్ట్‌ చేస్తుంది.


రణవీర్‌: ఏంటి మనోహరి నా చావు కబురు కోసం ఎదురు చూసిన నువ్వు.. నేను చావలేదని నీ మనిషి ఫోన్‌ చేసి చెప్పగానే.. బాగా డిస్సపాయింట్‌ అయినట్టు ఉన్నావు కదూ


మనోహరి:  రణవీర్‌ నీకేం కాలేదు కదా..? నీ మీద ఎవరో కత్తితో అటాక్‌ చేశారంట కదా..? అతనెవరో ఇందాక ఫోన్‌ చేసి నీ మొగుడి మీద అటాక్‌ చేశాను. టైం బాగుండి తప్పించుకున్నాడు నెక్ట్స్‌ నువ్వే పైకి వెళ్లడానికి రెడీగా ఉండు అంటూ వార్నింగ్‌ ఇచ్చాడు. ఇప్పుడు ఫోన్‌ మాట్లాడింది అతనితోనే..


రణవీర్‌: నేను ఇదంతా నమ్మొచ్చా..?


మనోహరి: నేనేం మాట్లాడుతున్నాను.. నువ్వేం మాట్లాడుతున్నావు.. ముందు నువ్వు హాస్పిటల్‌కు వెళ్లు


అని చెప్పగానే సరే అంటూ రణవీర్‌ ఫోన్‌ కట్‌ చేస్తాడు. హమ్మయ్యా రణవీర్‌ నమ్మేశాడు అని ఊపిరి పీల్చుకుంటుంది మనోహరి.  మరుసటి రోజు ఉదయం ఇంటి ముందు కూర్చున్న భాగీ.. అమర్‌ మాటలు గుర్తు చేసుకుని పిచ్చిదానిలా నవ్వుతూ ఉంటుంది. నిర్మల, రాథోడ్‌, శివరాం చూసి షాక్‌ అవుతారు. రాథోడ్‌ పిచ్చిపట్టినట్టుందని పిచ్చాసుపత్రికి ఫోన్‌ చేస్తాను అంటాడు.


  దీంతో ఊహల్లోంచి బయటకు వచ్చిన భాగీ రాథోడ్‌ను తిడుతుంది. రాత్రి అమర్‌ చెప్పిన మాటలు  వాళ్లందరికీ చెప్తుంది. దీంతో నిర్మల, శివరాం హ్యాపీగా ఫీలవుతారు. తర్వాత రాథోడ్‌ పిల్లల దగ్గరకు వెళ్లి మిమ్మల్ని చూసుకోవడానికి కొత్త కేర్‌టేకర్‌ వస్తున్నాడు అని చెప్తాడు. నీకెలా తెలుసని అంజు అడిగితే ఇందాక భాగీ చెప్పిందని చెప్తాడు.  మరోవైపు కేర్‌టేకర్‌ జాబ్‌ ఇంటర్వూ కోసం అమర్‌ ఇంటికి బయలుదేరుతుంది అనామిక. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.  


 


ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!