Nindu Noorella Saavasam Serial Today Episode:   భాగీ బయటకు రావడంతో ఆరు కనిపిస్తుంది. అక్కా అని పిలిచి నేను గుడికి వెళ్తున్నాను. నువ్వు రావొచ్చు కదా..? అని అడుగుతుంది. ఆరు హ్యాపీగా వస్తానని చెప్పగానే గుప్త ఆరును తిడతాడు. నువ్వు ఆ బాలికతో పాటు గుడికి వెళితే అక్కడ ఏవేవో అనర్థాలు వస్తాయంటాడు. అయినా సరే వినకుండా ఆరు, భాగీతో కలిసి వెళ్లడానికి రెడీ అవుతుంది. ఇంతలో వెనక నుంచి వచ్చిన మనోహరి, భాగీ.. ఆరుతో మాట్లాడటం చూసి షాక్‌ అవుతుంది. ఇప్పుడు ఇద్దరూ కలిసి వెళితే పరిస్తితి ఏంటని అనుకుంటుంది. ఇంతలో ఇద్దరూ కలిసి వెళ్తారు. అది గమనించిన మనోహరి ఈ విషయం వెటనే బాబ్జీకి చెప్పాలని రూంలోకి వెళ్లి ఫోన్‌ చేస్తుంది.

బాబ్జీ: హలో మేడం ఇంకో రెండు నిమిషాల్లో మీరు గుడ్‌ న్యూస్‌ వింటారు.

మనోహరి: అది సరే బాబ్జీ ఆ భాగీతో పాటు ఆరు కూడా గుడికి వస్తుంది.

బాబ్జీ: అదేంటి మేడం ఒక్కరే వస్తుందన్నారు కదా..? వచ్చేలా చేస్తా అన్నారు కదా..? మధ్యలో ఈ ఆత్మ ఏంటి..?

మనోహరి:  ఇప్పుడేంటి నేను వెళ్లి నిన్ను చంపినట్టే నీ చెల్లెలును కూడా చంపాలని చూస్తున్నాను నువ్వు దానితో వెళ్లకు అని చెప్పాలా..?

బాబ్జి: అలా ఎందుకు చెప్తారు మేడం.. ఏదో ఒకటి చేసి రాకుండా చేయోచ్చు కదా..? 

మనోహరి: ఓరేయ్‌ లూజు ఆది మనిషి కాదు ఆత్మ. పైగా నేను దాన్ని చంపించానని తెలిసిపోయింది. నేను చెప్తే అసలు వినదు.

బాబ్జి: ఇప్పుడెలా మేడం అరుంధతి పక్కన ఉండగా మిస్సమ్మను ఎలా చంపాలి.

మనోహరి: ఆల్‌రెడీ ఒకసారి చంపేశావు. దానికి నువ్వు భయపడటం దేనికి.. నువ్వు అనుకున్నట్టుగానే ఆ మిస్సమ్మను చంపేయ్‌

అని మనోహరి చెప్పగానే సరే అంటాడు బాబ్జీ. ఇంతలో రాథోడ్‌ ఇంటికి వస్తాడు.  కొంచెం ముందు వచ్చి ఉంటే భాగీని గుడి దగ్గర డ్రాప్ చేసేవాడికి రాథోడ్‌ అంటాడు శివరాం. ఎంత సేపు అయింది సార్‌ వెళ్లి అని రాథోడ్‌ అడగ్గానే ఇప్పుడే వెళ్లింది అని చెప్తాడు శివరాం అయితే వెళ్లి డ్రాప్‌ చేసి వస్తాను అని రాథోడ్‌ వెళ్లబోతుంటే మనోహరి ఆపాలని చూస్తుంది. కానీ వినకుండా రాథోడ్‌ వెళ్లిపోతాడు. రోడ్డు మీద ఆరు, మిస్సమ్మ, గుప్త నడుస్తుంటారు. ఆరు, గుప్తతో మాట్లాడుతుంది.

భాగీ: ఎవరితో మాట్లాడుతున్నావు అక్కా..  ఏదైమైనా మీరు కొంచెం తేడా అక్కా

ఆరు: అదేంటి మిస్సమ్మ పుసుక్కున అంత మాట అనేశావు.

ఆరు: అదంతా సరే మిస్సమ్మ నువ్వు నాకు ఏదో చెప్పాలి అన్నావు కదా..? అదేంటి

భాగీ:  అదా అక్క.. ఆరు అక్క చనిపోయినప్పటి  నుంచి ఎప్పుడు ఏదో ఒక ప్రమాదం.. ఏదో ఒక కష్టం ఈ ఇంటిని వెంటాడుతూనే ఉంది. ప్రమాదం ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో తెలియక చాలా భయంగా ఉంది అక్కా

ఆరు: ఆ రౌడీల పీడ వదిలిపోయింది కదా..? ఇక ఏ సమస్య ఉండదులే మిస్సమ్మ.  

భాగీ: ఇన్ని అనుమానాల మధ్య అదొక్కటే ఊరటగా ఉంది అక్కా.. కానీ ఆ మనోహరిని చూస్తుంటేనే అప్పుడప్పుడు భయంగా ఉంటుంది. ఆ మనోహరి ఎన్ని తప్పులు చేసినా సాక్ష్యాలు దొరక్కుండా చాలా జాగ్రత్త పడుతుంది

ఆరు: ముందు ఆ మనోహరిని పిల్లలకు ఆయనకు దూరం చేయాలి. ( అని మనసులో అనుకుంటుంది ఆరు)

భాగీ: అక్కా అక్కడే నిలబడిపోయావేంటి రండి

 అని పిలుస్తూ మిస్సమ్మ నడుస్తుంది. వెనక నుంచి స్పీడుగా లారీ రావడంతో అది చూస్తూ అలాగే నిలబడిపోతుంది ఆరు. ఆరును కాపాడాలని భాగీ వెళ్లగానే ఆరు పక్కకు తప్పుకోవడంతో లారీ స్పీడుగా వెళ్లి చెట్టును ఢీకొడుతుంది. దీంతో ఆరు, భాగీ సేఫ్‌ అవుతారు. బాబ్జీకి మాత్రం గాయాలు అవుతాయి. విషయం తెలుసుకుని మనోహరి షాక్‌ అవుతుంది.   మరోపక్క లారీ అంత స్పీడుగా దూకసుకు వచ్చినా మనకు ఎందుకు తగల్లేదని భాగీ డౌటుగా ఆరును అడుగుతుంది. ఆరు ఏదేదో చెప్తుంటే అర్థం కాక భాగీ ఏంటక్కా మీరు చెప్పేది ఒక్క ముక్క అర్థం కావడం లేదు అంటుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

 

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!