Meghasandesam Serial Today Episode:  కేపీని రక్షించడానికి శరత్‌ చంద్ర దగ్గరకు వెళ్లి భూమి ఎంత చెప్పినా అపూర్వ తన మాటలతో శరత్‌ చంద్ర నమ్మకుండా చేస్తుంది. పైగా శరత్‌ చంద్ర భూమిని తిట్టి అక్కడి నుంచి పంపిచేలా చేస్తుంది. దీంతో భూమి బయటకు వచ్చేస్తుంది. మరోవైపు కేపీ మర్డర్‌ చేశాడని తెలుసుకున్న గగన్‌ కూడా కేపీకి శిక్ష పడాల్సిందేనని ఏసీపీ సూర్యకు చెప్తాడు. దీంతో పోలీసులు కేసు ఫైల్‌ చేసి కోర్టుకు తీసుకెళ్తారు. కోర్టులో వాదోపవాదాలు జరుగుతుంటాయి.

Continues below advertisement

పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌: మైలార్డ్‌ కృష్ణ ప్రసాద్‌ అనే ఈ ముద్దాయి.. ఒక్కటి కాదు రెండు హత్యలు చేశాడు. ప్రముఖ నృత్య కళాకారిణి శోభా చంద్ర గారిని అతి దారుణంగా మర్డర్‌ చేయించారు. అలాగే ఆ కేసుకు సంబంధించి కీలక ఆధారాలు సేకరించిన ఎస్సైని కూడా ఈ మధ్యనే అతి కిరాతకంగా మర్డర్‌ చేయించారు. ఆ విషయం మర్డర్‌ చేసిన నేరస్థురాలు రత్న కూడా ఒప్పుకుంది. పోలీసులు కూడా చాలా చాకచక్యంగా ప్లాన్‌ వేసి కృష్ణ ప్రసాద్‌ ను పట్టుకున్నారు. సాక్ష్యాధారలు పరిశీలించిన తర్వాత ముద్దాయికి తగిన శిక్ష విధించాలని కోరుకుంటున్నాను.

జడ్జి: కృష్ణ ప్రసాద్‌ గారు మీరు నేరం చేశానని ఒప్పుకుంటున్నారా..?

Continues below advertisement

కేపీ: జడ్జి గారు నేను ఏ తప్పు చేయలేదండి.. నన్ను నమ్మండి.. కావాలని నన్ను ఈ కేసులో ఇరికించారు. ఆ రత్న కావాలని మర్డర్‌ చేయించిన వాళ్లతో కలిసి నన్ను టార్గెట్‌ చేసింది సార్‌.

జడ్జీ: మీరు మర్డర్‌ చేయలేదని అంటున్నారు.. మరి ఆ విషయం మీరు ఫ్రూవ్‌ చేసుకోగలరా..? డిఫెన్స్‌ తరపు నుంచి ఏదైనా అబ్జెక్షన్‌ ఉందా..?

అంటూ జడ్జి అడగ్గానే.. అప్పటికే అపూర్వకు అమ్ముడు పోయిన కృష్ణ ప్రసాద్‌ లాయరు కేపీకి వ్యతిరేకంగా వాదిస్తాడు.

కేపీ లాయరు: సాక్ష్యాధారాలు ఉన్నాయంటున్నారు కాబట్టి ఇక ఈ విషయంలో మాకు ఎలాంటి అబ్జెక్షన్‌ లేదు మైలార్డ్‌.. ఇక ఈ కేసుకు సంబంధించిన నిజానిజాలు పోలీసులే నిర్దారించాలని కోరుతున్నాను. శోభా చంద్ర గారిని చంపడం మరీ దారుణం సార్‌.. ఆ నిజం తెలిసి కూడా నేను ఈయన తరపున వాదించలేను సార్‌.. అందుకే ఈ కేసులో నిజానిజాలు పరిశీలించి మీరు ఏ నిర్ణయం తీసుకున్నా సరే మేము ఆబ్జెక్షన్‌ చెప్పము సార్‌

అంటూ కేపీ తరపు లాయరు చెప్పడంతో కేపీతో సహా అందరూ షాక్‌ అవుతారు. మీరా, శాదర ఏడుస్తుంటారు. అపూర్వ మాత్రం చాలా హ్యాపీగా ఫీలవుతుంది.  ఇంతలో

భూమి: మా మామయ్య నిరపరాధి ఆయనకు ఏ పాపం తెలియదు.. ఆయనను కావాలనే కక్ష్యతో ఈ కేసులో ఇరికించారు సార్‌..

జడ్జి: మీరు ఏదైనా చెప్పాలనుకుంటే వచ్చి బోనులో చెప్పండి.

అని జడ్జి చెప్పగానే.. భూమి బోనులోకి వస్తుంది.

భూమి: సార్‌ మా మామయ్య మా అమ్మను చంపలేదు.. ఆయనకు ఈ మర్డర్‌కు ఎలాంటి సంబంధం లేదు. ఆ మర్డర్‌ చేసిన వాళ్లే రత్నతో కలిసి నాటకం ఆడుతున్నారు సార్‌.

జడ్జి: మీ మామయ్యకు మర్డర్‌తో సంబంధం లేదు అంటున్నారు. మర్డర్‌ చేసిన వాళ్లు కావాలనే నాటకం ఆడుతున్నారని చెప్తున్నారు. మరి మర్డర్‌ ఎవరు చేశారో మీకు తెలుసా..? అందుకు సంబంధించిన సాక్ష్యం ఏదైనా ఉందా మీ దగ్గర

భూమి:  ఉంది జడ్జి గారు నా దగ్గర సాక్ష్యం ఉంది.

అంటూ భూమి తన దగ్గర ఉన్న సాక్ష్యం గురించి చెప్తుంటే.. జడ్జి వింటుంటాడు.. అపూర్వ మాత్రం భయంతో వణికిపోతూ శరత్‌ చంద్ర వైపు అమాయకంగా చూస్తుంది. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.    

ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!