Lakshimi Raave Maa Intiki  Serial Today Episode: శ్రీలక్ష్మీ సబ్జెక్ట్‌లో అనుమానం వస్తే మ్యాడీ దగ్గరకు వెళ్లి అడుగుతుంది.అతను చెప్పనడంతో...నాకు తెలిసివాళ్లతోనే చెప్పించుకుంటానంటూ అతన్ని ఉడికిస్తూ విక్రమ్ వద్దకు వెళ్తుంది. సీనియర్ విక్రమ్‌ను అడిగి డౌట్‌లు అన్ని చెప్పించుకుంటుంది.ఇది చూసిన మ్యాడీ చాలా ఉడుక్కుంటాడు. అప్పుడే శ్రీలక్ష్మీ రాసినట్లు  ఓ లవ్‌లెటర్‌ రాసి త్రిష విక్రమ్ దగ్గరకు వెళ్తుంది. ఏంటి సార్‌ మీ బండి పట్టాలెక్కినట్లు ఉందని అంటుంది. ఉదయం బైక్‌పై ఎక్కించుకుని వచ్చారు.ఇప్పుడేమో ఏదే డౌట్లు క్లియర్‌ చేస్తున్నట్లు ఉన్నారని అంటుంది. ఏం లేదు తనకు సబ్జెక్ట్‌లో ఏదో చిన్న అనుమానం ఉంటే క్లియర్ చేశానని చెబుతాడు. ఫిజిక్స్‌లో గోల్డ్‌మెడల్‌ సాధించిన అమ్మాయికి ఏం డౌట్లు వస్తాయని త్రిష ప్రశ్నిస్తుంది. అలాంటిదేమీ లేదని...కావాలనే ఆ శ్రీలక్ష్మీ మిమ్మల్ని కలవడానికి ప్రయత్నిస్తోందని చెబుతుంది. ఇదంతా విని విక్రమ్ నిజమేనని అనుకుంటాడు. అప్పుడే అతనికి తెలియకుండానే టేబుల్‌పై లవ్‌లెటర్‌ పెడుతుంది. అది చూపించి ఇది శ్రీలక్ష్మీ రాసిన లెటర్‌ అనుకుంటా అని అంటుంది.              విక్రమ్ లెటర్‌ తెరిచిచూసి చదువుతాడు. అచ్చం శ్రీలక్ష్మీ రాసినట్లే త్రిష ఆ లవ్‌లెటర్‌ రాయిస్తుంది. నాకు మీతో మాట్లాడాలంటే సిగ్గు, బిడియంగా ఉందని...ఏకాంతంగా మాట్లాడుకోవాలని ఉందని అందులో రాస్తుంది. అది చూసి విక్రమ్ నమ్మకపోయినా....త్రిష, ఆమె ప్రెండ్స్‌ రెచ్చగొడతారు. మీరు చదువులో టాప్‌ అయినా లవ్‌లో మాత్రం చాలా పూర్‌ అని అంటారు. ఒకమ్మాయి అన్నీ నోరుతెరిచి ఎలా చెప్పుకుంటుందని మీరే అర్థం చేసుకోవాలని రెచ్చగొడతారు. అయితే నేను స్టడీరూమ్‌లో వెయిట్‌ చేస్తుంటానని...మీరు వెళ్లి శ్రీలక్ష్మీకి ఏదో ఒకటి నచ్చజెప్పి అక్కడికి రమ్మని చెప్పండని అంటాడు.మేము ఇద్దరం మనసు విప్పి మాట్లాడుకుంటామని అంటాడు. త్రిష వాళ్లు సరేనని అక్కడి నుంచి వెళ్లిపోతారు.                 విక్రమ్ స్టడీరూమ్‌కు వెళ్లగా....త్రిషప్రెండ్స్ శ్రీలక్ష్మీ దగ్గరకు వెళ్లి విక్రమ్ స్టీడీ రూమ్‌లో ఉన్నాడని....మీరు వస్తే స్టడీమెటీరియల్  ఇస్తానని చెప్పమన్నాడని చెబుతారు. మిమ్మల్ని అక్కడికి రమ్మన్నాడని చెప్పగా...నిజమేనని నమ్మిన శ్రీలక్ష్మీ అక్కడికి వెళ్తుంది. ఆమె రూమ్‌లోకి వెళ్లగానే బయట గడియపెట్టి త్రిష అల్లరి చేయడానికి ప్రయత్నిస్తుంది. ప్రెండ్స్‌ అందరినీ స్టూడెంట్లను పిలుచుకుని రమ్మని...తాను వెళ్లి ప్రిన్సిపల్‌, లెక్చరర్‌లను పిలుచుకుని వస్తుంది. అందరూ కలిసి తలుపులు బాధడటంతో శ్రీలక్ష్మీ  బయటకు వస్తుంది. అందరూ ఆమెను ఫొటోలు, వీడియోలు తీస్తు ఇబ్బంది పెడతారు. దీంతో లక్ష్మీ ఏడస్తుంది. లోపల ఉన్నవాళ్లు కూడా బయటకు రావాలని కేకలు వేయడంతో లోపల నుంచి మ్యాడీ రావడం చూసి త్రిష షాక్‌కు గురవుతుంది. లోపల విక్రమ్ ఉండాలి కదా మ్యాడీ ఎలా వచ్చాడని ఆశ్చర్యపోతుంది.  త్రిష పక్కకు వెళ్లగానే మ్యాడీ ఆ రూమ్‌లోకి వెళ్తాడు. విక్రమ్‌తో మాట్లాడుతున్న శ్రీలక్ష్మీని చూసి నీ డౌట్లు ఇంకా అయిపోలేదా అని ప్రశ్నిస్తాడు.ఇదంతా చూసిన విక్రమ్‌కు ఆ లెటర్‌ శ్రీలక్ష్మీ రాయలేదని అర్థమవుతుంది. వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోతాడు.                    శ్రీలక్ష్మీ వెనక బయటకు వచ్చిన మ్యాడీ....అందరిమీద గట్టిగా కోప్పడతాడు. ఒక అమ్మాయి, అబ్బాయి గదిలోఉంటే తప్పుగా అర్థం చేసుకోవడమేనా అని నిలదీస్తాడు. ఇంతలో అక్కడికి వచ్చిన విక్రమ్‌ అసలు విషయం చెప్పి...తానే లక్ష్మీని ఇక్కడికి రమ్మని చెప్పానని చెబుతాడు. దీంతో అందరూ అక్కడి నుంచి వెళ్లిపోతారు. మ్యాడీ లక్ష్మీని తీసుకుని ఇంటికి వెళ్లిపోతాడు. తనవల్లే లక్ష్మీ బాధపడిందని...ఆమెకు క్షమాపణలు చెప్పాలని విక్రమ్ చూస్తాడు. కానీ లక్ష్మీ కోపంగా వెళ్లిపోతుంది. దీంతో త్రిష మరో ఎత్తుగడ వేస్తుంది. లక్ష్మీ ఇంటి  అడ్రస్ తనకు తెలుసునని నువ్వు నేరుగా ఇంటికి వెళ్లి సారీ చెప్పమని చెబుతుంది.