Lakshimi Raave Maa Intiki  Serial Today Episode:సూర్యనారాయణ,మ్యాడీ నాటకంలో లీనమైపోయి ఉండగా...అప్పుడే కట్లు విప్పుకుని తప్పించుకుని వచ్చిన ప్రియంవద భర్త సూర్యనారాయణను చూసి మామయ్య అంటూ కేకవేస్తాడు. అది విని ప్రియంవదకు గుండె ఆగిపోయినంత పని అవుతుంది. సరిగ్గా అప్పుడే కరెంటుపోవడంతో...అందరూ అయోమయానికి గురవుతారు. సూర్యనారాయణ కరెంట్‌కు ఏమైందోచూడమని చెప్పగా....కొడుకు వెళ్లి పవర్ ఆన్ చేస్తాడు. దీంతో సూర్యనారాయణ సహా అందరూ ఎవరో పిలిచినట్లు అనిపించిందని వెతుకుతారు.కానీ అక్కడ ఎవరూ కనిపించరు.

Continues below advertisement

నాకు బాగా అలవాటైన గొంతులా అనిపించిందని...ఎక్కడో విన్నట్లు ఉన్న గొంతులా ఉందని సూర్యనారాయణ అంటాడు.అందరూ మాకు కూడా వినిపించిందని చెప్పడంతో వెతుకుతుంటాడు. తన భర్త ఎక్కడ కనిపిస్తాడేమోనని ప్రియంవద కంగారుపడుతుంది.నాకు ఏమీ వినిపించలేదని...మీరు నాటకంలో లీనమైపోవడం వల్ల అలా అనిపించవచ్చని అంటుంది. దీంతో సూర్యనారాయణ అందరూ వెళ్లి స్నానాలు చేసి పడుకోండని...రేపు ఇంటికి వెళ్లిపోదామని చెబుతాడు. దీంతో ప్రియంవద ఊపిరి పీల్చుకుంటుంది.వెంటనే రౌడీలకు ఫోన్ చేసి వాడు తప్పించుకున్నాడని జాగ్రత్తగా వెతకమని చెబుతుంది. అతను మా దగ్గరే ఉన్నాడని....సరిగ్గా మీ దగ్గరకు వస్తున్న సమయంలోనే మేం చూసి కరెంట్ ఆఫ్‌ చేసి ఎత్తుకొచ్చేశామని చెబుతారు.మీ జీవితంలో చేసిన మంచిపని ఇదొక్కటేనని ప్రియంవద అంటుంది.అతన్ని మీ దగ్గరే ఉంచుకోండని నేను వచ్చి కలుస్తానని చెప్పి  చెబుతుంది.

Also Read:కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: యమున కలలో కనిపించిన బిడ్డ ఎవరు? విహారికి ప్రమాదం పొంచి ఉందా! కడుపులో బిడ్డకా!

గెస్ట్‌హౌస్‌ నుంచి ఆనందంతో అందరూ ఇంటికి చేరతారు.ఇంట్లో అందరూ ఇంత ఆనందంగా ఉండి ఎన్నిరోజులు అవుతుందోనని అనుకుంటారు. అప్పుడే గుమ్మం ముందు పెద్దమనుషులతో సరోజ కూర్చుని ఉంటుంది.పక్కనే గోపాల్‌ కూడా ఉండటం చూసి సూర్యనారాయణ ఎప్పుడొచ్చారమ్మా అని అడుగుతాడు. కనీసం ఫోన్ చేసి ఉంటే మేం వచ్చేవాళ్లం కదా అని అంటాడు.

Continues below advertisement

మీరు ఇంత ఉల్లాసంగా ఉన్నారు కదా మీ ఆనందం చెడగొట్టడం ఎందుకని చెప్పలేదులేండి అని వెటకారంగా మాట్లాడుతుంది. ఆమె మాటలు అర్థంగాక ఇందిర ఎందుకమ్మా ఇలా మాట్లాడుతున్నావని ప్రశ్నిస్తుంది. వెంటనే పక్కన ఉన్న పెద్దమనుషులు అందుకుని సూర్యదేవర వంశంలో పుట్టిన అమ్మాయి ఇలాచేస్తుందని మేం అనుకోలేదని అంటారు.అయినా సూర్యనారాయణగారి పెంపకం ఇలా ఉంటుందని మేం ఊహించలేదని అంటారు. మీ అమ్మాయిని మా ఊరికి కోడలుగా పంపిస్తే మేం కూతురిలా చూసుకుంటున్నామని చెబుతారు. ఇంతకీ మా సింధూజాక్షి ఏం చేసిందని సూర్యనారాయణ అడుగుతాడు.

Also Read:బయటపడుతున్న పార్లలమ్మ పాపాల చిట్టా, ఎంక్వైరీ మొదలుపెట్టిన బాలు - గుండెనిండా గుడిగంటలు మే 13 ఎపిసోడ్

మీ ఇంటి పరువు ఏమైనా తీసిందా అని ప్రశ్నిస్తాడు.  ఇంచుమించు అలాంటిదేనని సరోజ అంటుంది. ఊరిలో వాళ్లకు సమాధానం చెప్పుకోలేక పెద్దమనుషులను తీసుకుని ఇక్కడికి వచ్చానని చెబుతుంది. ఇంతలో మ్యాడీ కల్పించుకుని మా అక్క ఎలాంటి తప్పు చేయదని అంటాడు.పెద్దయ్య కల్పించుకుని నువ్వు మధ్యలో జోక్యం చేసుకోవద్దని అంటాడు. మీ అక్క ఏం చేసి వచ్చిందో మీకు చెప్పలేదా అని అంటుంది సరోజ. మా అమ్మాయి చెప్పడం కన్నా మీరు చెప్పడమే మంచిదని సూర్యనారాయణ అడుగుతాడు.

మీ అమ్మాయి మా పరువు తీసేలా  పురుగులమందు తాగి చావబోయిందని చెబుతుంది. ఆ మాటలు విన్న అందరూ షాక్‌కు గురవుతారు. మా అక్క అంతపనిచేస్తే కనీసం మాకు చెప్పొద్దా అని మ్యాడీ అంటాడు. చెప్పాలనే పెద్దయ్యకు ఫోన్ చేశామని...ఇదిగో మీ అత్తయ్యగారు ఎత్తి మధ్యాహ్నం కల్లా అక్కడికి వచ్చిందని చెబుతుంది.

Also Read:నిండు మనసులు: మామ కుటుంబాన్ని రంజిత్‌ కలుపుతాడా! ప్రేరణని ఎత్తుకొని సిద్ధూ ముడుపు కట్టిస్తాడా!

మా అమ్మాయి మనసు ఏం బాగోలేదని...ఇంటికి తీసుకెళ్లి నాలుగురోజులు ఉంచుకుని తిరిగి పంపిస్తామని తీసుకొచ్చిందని చెబుతుంది. కానీ మళ్లీ ఏ విషయం చెప్పలేదని మండిపడుతుంది. పైగా మేం ఫోన్ చేస్తుంటే మీ మనవరాలు కట్‌ చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. మా ఇంటిపిల్ల ఇక్కడ ఉంది కదా అని శ్రీలక్ష్మీకి ఫోన్ చేసి మాట్లాడించమని చెబితే ఎప్పుడూ బిజిగా ఉందని చెబుతోందని మండిపడుతుంది. ఆ మాటలు విన్న సూర్యనారాయణ కూతురిని అడుగుతాడు. సింధూ పురుగులమందు తాగిందని చెబితే మీరు కంగారుపడతారని చెప్పలేదని చెప్పడంతో...ఆమె చెంప పగులగొడతాడు. అసలు చనిపోయేంత కష్టం నీకు ఏం వచ్చిందని సింధూని నిలదీస్తాడు.దీంతో సింధూజాక్షి భయంతో వణికిపోతుంది.

Also Read:‘మేఘసందేశం’ సీరియల్‌: శరత్ చంద్రను ఓదార్చిన భూమి – కొత్త ప్లాన్‌ వేసిన అపూర్వ