Karthika Deepam Idi Nava Vasantham Serial Episode దీప కడియానికి చెప్పి వెళ్లిపోవాలి అని ఆయనతో మాట్లాడుతుంది. తక్కువ అద్దెలో ఎవరిదైనా ఇళ్లు చూడమని చెప్తుంది. ఇక కడియం దీపని మూర్తి అనే వ్యక్తి ఇళ్లు ఖాళీగా ఉందని అక్కడికి చూపిస్తుంది. మూర్తి దీపకు ఆ ఇళ్లు ఇస్తాడు. ఇక కార్తక్ దీప ఎక్కడికి వెళ్లొందో ఏమైందో అని ఆలోచిస్తాడు. శౌర్య హర్ట్ అయిపోతుంది. నర్శింహ ఏమైందని దీపని అడుగుతాడు. ఇంతలో కార్తీక్ నర్శింహకి కాల్ చేస్తాడు. నర్శింహ కాల్ కట్ చేస్తాడు. దీప తన గురించి ఏమీ తెలీదని కార్తీక్‌కి చెప్పమని అంటుంది. 


దీప: ప్లీజ్ బాబాయ్ నా గురించి ఎవరికీ తెలీకూడదు. కార్తీక్ బాబుకి ఏం చెప్పినా నా మీద ఒట్టు.
కార్తీక్: దీప హోటల్‌కి  వచ్చిందా.. నిజం చెప్పు దీప నీ దగ్గరే ఉంది కదా. దీప రాత్రి ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోయింది. కాసేపు తర్వాత అయినా నీ దగ్గరకి దీప రావొచ్చు. అప్పుడు నాకు చెప్పు. నేను బస్‌స్టాండ్‌కి వెళ్తా.. ఎలా అయినా సరే దీపని వెతికి పట్టుకోవాలి.
కడియం: కార్తీక్ బాబు చాలా మంచోడు దీపమ్మ. ఎంత కష్టం అయినా సరే ఆయనకు చెప్తే సమస్య తీరిపోతుంది. 
దీప: వాళ్లు పెద్దోళ్లు బాబాయ్. నాకు ఎవరి సాయం వద్దు ఉండటానికి నువ్వు ఇళ్లు చూపించావ్. నాకు పని వచ్చు. నేనే సంతోషంగా ఉండాలి అనుకుంటే నువ్వు నేను ఇక్కడున్నట్లు ఎవరికీ చెప్పొద్దు. ఇక కడియం దీపకు జీతం అని డబ్బులు ఇస్తాడు. 
పారిజాతం: జ్యోత్స్న ఇప్పుడు అసలు నిజం చెప్పు.
జ్యోత్స్న: ఏం లేదు నానీ.. 
పారిజాతం: ఏం లేకపోతే నీ కళ్లలో ఇంత బాధ కనిపించదు. నీ కళ్లలో ఏదో బాధ కనిపిస్తుంది. ఏం జరిగిందో చెప్పు. చెప్పమంటే ఏడుస్తావ్ ఏంటి నిన్ను చూస్తుంటే భయం వేస్తుంది. ఏం జరిగిందో చెప్పు. ఏదో తప్పు జరిగింది. అదేంటో చెప్పు.


జ్యోత్స్న ఏడుస్తూ జరిగింది అంతా చెప్తుంది. కార్తీక్ శౌర్యని తన కన్న కూతురని చెప్పాడని ఏడుస్తూ పారిజాతానికి చెప్తుంది. పారిజాతం షాక్ అయిపోతుంది. బెడ్ మీద కుప్పకూలిపోతుంది. కార్తీక్ అలా అనడని నువ్వు సరిగ్గా చూశావా.. సరిగ్గా విన్నావా అని అంటుంది. 


పారిజాతం: మొత్తం నాశనం చేశావే. శౌర్యని నా కూతురు అన్నవాడు రేపు దీపని నా పెళ్లాం అని అంటాడు. నవ్వు ఇలా అటు ఇటూ కాక ఊగిసలాడుతుంటే దీప కార్తీక్‌ని ఎగరేసుకుపోతుంది. శత్రువుని పక్కనే పెట్టుకోవాలి. దీపని అసలు వెళ్లనివ్వకుండా ఉండాల్సింది. నీ బావని నువ్వు పెళ్లి చేసుకునే వరకు దీప ఇక్కడే ఉండాల్సంది. లేదంటే ఏమైనా జరగొచ్చు. అలా జరగకుండా ఉండాలి అంటే ముందు దీప ఎక్కడుందో మనం తెలుసుకోవాలి. మనకు తెలీకపోయిన మీ బావకి తెలుస్తుంది అడుగు. 
జ్యోత్స్న: సరే.. ఇంకెవరికీ ఈ మాట అనకు.



దీప కొత్త ఇంట్లో కార్తీక్ మాటలు తలచుకొని బాధ పడుతుంటుంది. మరోవైపు దీప గాజులు పట్టుకొని ఆలోచిస్తూ ఉంటాడు. ఇక శౌర్య ఆరు బయట నొల్చొని బయటకు చూస్తుంటే దీప పాపని పిలుస్తుంది. శౌర్య తనకు ఇక్కడికి రావడం ఇష్టం లేదని బాధపడుతుంది. కార్తీక్ గురించి అడుగుతుంది. కార్తీక్ నువ్వు గొడవ పడ్డారా. అని అంటుంది. కార్తీక్ నా గురించి రావడం నీకు ఇష్టం లేదా అని శౌర్య తల్లిని ప్రశ్నిస్తుంది. దీప పాపని బుజ్జగించి సిరప్ వేస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 


Also Read: 'త్రినయని' సీరియల్: తిలోత్తమ నడుం విరగ్గొట్టిన చింతామణి.. సర్పదీవి నుంచి ఏం దొంగతనం చేసిందో!