Jagadhatri Serial Today Episode: మీనన్ తన భర్త అని రుజువు చేస్తానంటూ డ్రాగన్ మీడియా వాళ్లందరినీ అతని ఇంటికి తీసుకుని వస్తుంది. సరేసరి తన ఇంటికే డ్రాగన్ రావడం చూసి మీనన్ ఆశ్చర్యపోతారు. తను నిజంగా నీ భార్య కాబట్టే నేరుగా వచ్చేసిందని అబి అనగా....నేను  ఇంటితాళం ఎక్కడ పెడతానో నాకు తప్ప నా వెంట పాతికేళ్లుగా తిరుగుతున్నవాళ్లకు కూడా తెలియదని అంటాడు. ఇంతలో డ్రాగన్ సెకన్‌లో తాళంచెవి తీసి చూపగా...మీనన్ ఆశ్చర్యపోతాడు. తాళం దొరకగానే సంబరం కాదని....ఆ ఇంటి తలుపు నేను తప్ప ఎవరూ తీయలేరని అంటాడు. అది తీయాలంటే తాతలు దిగిరావాలని అహం ప్రదర్శిస్తాడు. ఇలాంటి తలుపులు వందలు తెరిచిన అనుభవం ఉన్న డ్రాగన్‌....ఒక్క క్షణంలో మీనన్ ఇంటి తలుపులు తెరుస్తుంది.ఆమె పనితనం చూసి జేడీ కూడా మెచ్చుకుంటుంది. అయినా ఆ తలుపులు ఎలా తెరవగలిగావని అడగ్గా....ఇలాంటి పనులు నేను చిన్నప్పటి నుంచే నేర్చుకున్నానని...మున్ముందు మన పనితనం మీకు తెలిసిపోతుంది కదా అని అంటుంది.అలాంటి పిచ్చిపిచ్చి పనులేమీ చేయవద్దని...తాము చెప్పిన పని చేస్తే సరిపోతుందని అంటారు. ఇంతలో కానిస్టేబుల్‌ వచ్చి ఆమెకు ఓ సూటుకేసు అందజేసి వెళ్లిపోతాడు. అందులో నీకు మీనన్‌కు  పెళ్లి అయినట్లు కావాల్సిన రుజువులన్నీ ఉన్నాయని..నువ్వు బయటకు వెళ్లి నీ నటనాకౌశలం మొత్తం చూపించాలని జేడీ  చెబుతుంది. అది చూసిన ఎవరైనా నిజంగా నువ్వు మీనన్‌ భార్యవేనని నమ్మకం కలగాలని అంటుంది

Continues below advertisement

ఇంట్లోకి వెళ్లిన డ్రాగన్ బయటకు రాకపోవడంతో మీనన్ కంగారుపడుతుంటాడు. ఇప్పుడు తనే నా భార్య అని ఎలా రుజువు చేస్తుందో చూద్దామని ఎదురుచూస్తుంటాడు.  అంతే డ్రాగన్ లోపలి నుంచి సూట్‌కేసుతో సహా వచ్చి తాము ప్రేమించుకున్నప్పుడు దిగిన ఫొటోలు, పెళ్లిచేసుకున్నప్పుడు దిగిన ఫొటోలు, కొడుకు పుట్టినప్పుడు దిగిన ఫొటోలన్నీ మీడియాకు  చూపిస్తుంది. అవన్నీ ఉత్త ఫేక్ ఫొటోలని మీనన్  కొట్టిపారేస్తాడు. నిజంగా మా ఇద్దరికీ పెళ్లి జరిగితే మ్యారేజీ సర్టిఫికేట్ ఉంటుంది కదా అని మీనన్ అంటాడు.అంతలోనే డ్రాగన్ తమ పెళ్లి సర్టిఫికేట్ తీసి చూపిస్తుంది. అంతే అది చూసి మీనన్ షాక్‌ తింటాడు. మరి ఇన్నాళ్లు మీరు ఎందుకు బయటకు రాలేదని మీడియా అడగ్గా....డ్రాగన్ కంగారుపడిపోతుంది. అప్పుడు జేడీ నేను చెప్పినట్లు మీడియాకు చెప్పమమని చెప్పగా.... మాకు శత్రువుల నుంచి ఆపద ఉంటుందని తనే మమ్మల్ని కేరళలో ఉంచాడని డ్రాగన్ చెబుతుంది. ఇప్పుడు ఎందుకు వచ్చారని అడగ్గా......మా  ఆయన చేసిన పాపాలు మాకు అంటకుండా ప్రభుత్వం సీజ్‌ చేసిన ఆస్తులన్నీ అనాథలకు పంచాలని వచ్చామని చెప్పడంతో మీనన్ అదిరిపడతాడు. నా పాతికేళ్ల కష్టాన్ని పేదలకు పంచేస్తుందంటరా అని అంటాడు. కొంత ఆస్తి మేము తీసుకుని మిగిలినది అంతా అనాథ ఆశ్రమాలకు రాసి ఇచ్చేస్తామని చెప్పి డ్రాగన్ లోపలికి వెళ్లిపోతుంది.   

డ్రాగన్‌ను కలిసిన జేడీ,కేడీ...ఆమెకు గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. పారిపోవాలని పిచ్చిపిచ్చి వేషాలు వేస్తే...నీ ప్రాణాలకే ప్రమాదమని చెబుతారు. ఇక్కడ నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలని...మీనన్ మనుషులు అటాక్‌ చేసే అవకాశం ఉందని చెప్పి వెళ్లిపోతారు. ఇదంతా ఎవరు చేయిస్తున్నారో తెలియక మీనన్‌కు పిచ్చెక్కిపోతుంది. నేను లేనని నా ఫొజిషన్‌లోకి రావాలనుకుంటే దందా చేస్తారు గానీ...నా ఆస్తులు అనాథలకు పంచాలని ఎందుకు ప్రయత్నిస్తారని అనుకుంటాడు. వాళ్లు ఎవరో కనిపెట్టి  ప్రాణాలు తీస్తానని అంటాడు.ఇంతలో డ్రాగన్ మీనన్ ఇంట్లో ఉన్న బంగారం, డబ్బు దోచుకుని పరారవ్వడానికి ప్రయత్నిస్తుంటుంది.

Continues below advertisement