Jagadhatri  Serial Today Episode:  అడవాళ్లు అందరూ కలిసి పూలు గుచ్చుతూ..ఒకరి కాపురం గురించి ఇంకొకరు అడుగుతుంటారు. సురేష్‌, బూచి, కేదార్‌ ఆడవాళ్ల లాగా చీరలు  చుట్టుకుని వచ్చి వాళ్ల మాటలు వింటుంటారు. ఇంతలో భాగ్యలక్ష్మీ అక్కా నన్ను ఎప్పుడు పిన్నిని చేస్తావు అని ధాత్రిని అడగ్గానే కేదార్‌ ఇప్పుడప్పుడే పిల్లలు వద్దన్నారు అని అంటుంది. దీంతో చీరలో ఉన్న  కేదార్‌ అబద్దం అంటూ లేస్తాడు. సురేష్‌, బూచి వద్దని వారిస్తారు. మిగతా వాళ్లందరూ షాక్‌ అవుతారు. నాకు వెంటనే పిల్లలు కావాలంటే  ధాత్రే వద్దంది అంటాడు. అందరూ కలిసి పూలతో కొట్టుకుంటారు. తర్వాత అందరూ బయటకు వెళ్తారు.


భాగ్యలక్ష్మీ: జగధాత్రి అక్కా అక్కడి నుంచి ఈ చివరి వరకు అంతా మన పొలమే.. మొత్తం 20 ఎకరాలు ఉంటుంది.


వైజయంతి: అక్కా అంటావుండావు. ఆస్తుల గురించి చెప్తా ఉండావు. వాట అడిగినా అడుగుతారు. వాళ్లకు కొత్తగాదు. తీసుకోవడము కొత్తగాడు.


భాగ్యలక్ష్మీ: మీరేం అంటున్నారో నాకేం అర్థం కావడం లేదు అత్తయ్య.


నిషిక: వదినకు అర్థం అయిందిలే భాగ్య.


 అంటూ ధాత్రిని తక్కువ చేసి మాట్లాడితే కౌషికి నిషికను తిడుతుంది. ధాత్రిని వెనకేసుకొస్తుంది. తర్వాత అందరూ సంతాన లక్ష్మీ అమ్మవారి గుడికి వెళ్తారు. అక్కడ నిషిక తనకు కౌషికి వదినకు కడుపు పోయే ఐడియా వచ్చిందని వైజయంతికి చెప్తుంది. ఐడియా సూపర్‌గా ఉందంటుంది వైజయంతి.


వైజయంతి: అమ్మీ కౌషికి..


కౌషికి: ఏంటి పిన్ని..


వైజయంతి: ఏం లేదు అమ్మీ.. నువ్వు సురేష్‌ తో తెగదెంపులు చేసుకుని ఊరొదిలి పోయేటప్పుడు మళ్లీ మీరిద్దరు కలిసి కడుపు పండితే అమ్మవారికి బెల్లం సమర్పించుకుంటానని మొక్కుకున్నాను అమ్మీ


నిషిక: అంత మంది అడ్డు పడినా మీరిద్దరూ కలిసిపోయారంటే.. నాకు తెలిసి అదంతా అత్తయ్య మొక్కుకున్న మొక్కు వల్లే అనుకుంటా?


కౌషికి: అవును నిషిక. నాకోసం మొక్కుకున్నందుకు థాంక్స్‌ పిన్ని. ఏం మొక్కుకున్నారో చెప్పండి పిన్ని. ఇప్పుడే సమర్పిస్తాను.


వైజయంతి: అమ్మవారికి 25 కేజీల బెల్లాన్ని గుడి చుట్టూ 25 ప్రదిక్షణలు చేసి ఆ బెల్లాన్ని అమ్మవారికి మీతో సమర్పింపజేస్తానని మొక్కుకున్నాను అమ్మి.


 అంటూ వైజయంతి చెప్పగానే కేదార్‌ 25 కేజీలా.. అదెలా సాధ్యం అంటాడు. నిషిక, కేదార్‌ ను తిడుతుంది. నిషికను ధాత్రి తిడుతుంది. ధాత్రి, కేదార్‌ అడ్డుపడితే ఇరిటేటింగ్‌ గా వైజయంతి, నిషిక తిడతారు. ఏవేవో మాటలు చెప్పి కౌషికిని భయపెడతారు. మొక్కు తీర్చకపోతే కౌషికికి ఏమైనా అయితే ఆమె కడుపులోని బిడ్డకు ఏమైనా అయితే అంటూ బెదిరించడంతో కౌషికి మొక్కు తీరుస్తానని అంటుంది. దీంతో ధాత్రి అడ్డుపడుతుంది. కౌషికి ఒప్పుకోవడంతో నిషిక, వైజయంతి, కాచి హ్యాపీగా ఫీలవుతారు. వెళ్లి 30 కేజీల బెల్లాన్ని తీసుకొస్తారు. కౌషికి బెల్లం మోయడానికి సిద్దపడుతుంటే ధాత్రి వెళ్లి పంతులుతో మట్లాడుతుంది.


       పంతులు వచ్చి కడుపుతో ఉన్నవాళ్లు మొక్కు తీర్చుకోకూడదని చెప్పి కౌషికికి అక్కో చెల్లెలో ఉంటే వారితో మోయించమని చెప్తాడు. దీంతో ధాత్రి, కాచితో బెల్లం మోయిస్తుంది. బెల్లం మోసిన కాచి కళ్లు తిరిగి కిందపడిపోతుంది. వైజయంతి, నిషిక టెన్షన్‌ పడతారు. తర్వాత ధాత్రి, కౌషికికి ఇంట్లో వాళ్లతో ప్రమాదం ఉందేమోనని కేదార్‌కు చెప్తుంది. వదిన ప్రెగ్నెంట్‌ కావడం వైజయంతికి, నిషికకు ఇష్టం లేనట్లుందని ఆమెకు అబార్షన్‌ అయ్యేందుకు వాళ్లు చాలా ట్రై చేస్తున్నారని చెప్తుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.


ALSO READ: అల్లు అర్జున్ ఫ్యామిలీలో రాఖీ సెలబ్రేషన్స్ - అర్హ అండ్ అయాన్ క్యూట్ పిక్స్ చూశారా?