Jagadhatri  Serial Today Episode: కౌషికి జ్యువెల్లరీ, బట్టలు తీసుకొచ్చి కేదార్‌, ధాత్రికి ఇస్తుంటే నిషిక, వైజయంతి వచ్చి అడ్డుచెప్తారు. వదిన నువ్వు వాళ్లను బాగా వెనకేసుకొస్తున్నావు అంటూ నిషిక కోపంగా కౌషికిని తిడుతుంది. దీంతో కౌషికి కూడా నిషికను తిడుతుంది. వాళ్లకు బట్టలు ఇవ్వడానికి నీ పర్మిషన్‌ తీసుకోవాల్సిన అవసరం నాకు లేదు అంటుంది. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది. ఇంతలో ధాత్రి తాము ఆ ఫంక్షన్‌కు రావడం లేదని చెప్పడంతో అందరూ అక్కడి నుంచి వెళ్లిపోతారు. మరోవైపు అఖిలాండేశ్వరి ఇంట్లో ఫంక్షన్‌ మొదలవుతుంది.


అఖిల: మా ఆహ్వానాన్ని మన్నించి దేవా, పార్వతీల పెళ్లి రోజుకు, నా కొడుకులాంటి చరణ్‌ హేమల నిశ్చిర్థానికి వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. నా విజయానికి కారణం నా పెద్ద కొడుకు దేవ.


అని అఖిలాండేశ్వరి చెప్పగానే దేవ, పార్వతి వచ్చి కేక్‌ కట్ చేస్తారు. ఇంతలో ఒక వ్యక్తి వచ్చి మేడం వజ్రపాటి కౌషికి వాళ్ల ఫ్యామిలీ వస్తుంది. అని చెప్తాడు.


హేమ: అదే చెప్పాను కదా.. నిషి అని నా ఫ్రెండ్ వస్తుందని వాళ్ల ఫ్యామిలీనే


అఖిల: ఓ అయితే నిషిక వజ్రపాటి కౌషికి గారి బంధువా? కౌషికి గురించి తన బిజినెస్‌ ల గురించి చాలా విన్నాను. ఇన్ని రోజులకు కలిసే అవకాశం వచ్చింది. పెద్దబాబు నువ్వు పార్వతి వెళ్లి  ఆహ్వానించండి.


బయట కౌషికి ఫ్యామిలీ లోపలికి వస్తుంటే.. మీనన్‌ మనుషులు యువరాజ్‌కు ఫోన్‌ చేస్తారు.


యువరాజ్‌: హలో ఎక్కడరా?


రౌడీలు: భాయ్‌ మీరు చెప్పిన చోటికే వచ్చాము కానీ లోపలికి అందరిని చెక్‌ చేసే పంపిస్తున్నారు.


యువరాజ్‌: సరే అయితే నేను సైగ చేసినప్పుడు వచ్చేయండి.


అని చెప్పి యువరాజ్‌ గేటు దగ్గరకు వెళ్లి రౌడీలను పిలుస్తాడు. సెక్యూరిటీ ఆపితే వాళ్లను మేమే తీసుకొచ్చాము వంటవాళ్లు అని యువరాజ్‌ చెప్పగానే సెక్యూరిటీ సరే వెళ్లండి అని చెప్తాడు. వాళ్ల వెనకాలే మాస్కులు పెట్టుకుని కేదార్‌, ధాత్రి వంటవాళ్లమేనని చెప్పి లోపలికి వెళ్తారు. కౌషికి ఫ్యామిలీకి స్వాగతం చెప్పడానికి దేవేంద్రతో వచ్చిన పార్వతిని చూసి ధాత్రి షాక్‌ అవుతుంది.


ధాత్రి: పార్వతి ఏంటి ఇక్కడ ఉంది. ఇక్కడ జరుగుతుంది. పార్వతి వాళ్ల పంక్షనా?


కేదార్‌: ఆ అమ్మాయి నీకు ముందే తెలుసా? ధాత్రి.


ధాత్రి: తెలియడం ఏంటి కేదార్‌. అది ఊర్లో నా బెస్ట్‌ ఫ్రెండ్‌ మా అమ్మ ఉన్నప్పుడు ఇద్దరం కలిసి ఒకటే ఊర్లో ఉండేవాళ్లం.


కేదార్‌: అంటే ఇప్పుడు మీనన్‌ టార్గెట్‌ చేస్తుంది పార్వతీ వాళ్లనా? మీనన్‌ ను ఎలాగైనా ఆపాలి ధాత్రి.


అంటూ ఇద్దరూ లోపలికి వెళ్లిపోతారు. మరోవైపు రౌడీలు పార్వతిని కిడ్నాప్‌ చేయడానికి రెడీ అవుతుంటారు. మరోవైపు మీనన్‌ మనుషులను కనిపెట్టిన ధాత్రి, కేదార్‌ వాళ్లను చితక్కొడుతుంటారు. కొంత మంది రౌడీలు తప్పించుకుని లోపలికి వెళ్లిపోతారు. మరోవైపు కౌషికి, అఖిలాండేశ్వరి ఒకరి ఫ్యామిలీని ఒకరు పరిచయం చేసుకుంటారు. ఇంతలో మీనన్‌, అఖిలాండేశ్వరికి ఫోన్‌ చేసి బెదిరిస్తాడు. మీ వాళ్లందర్ని చంపేస్తాననడంతో అఖిల అరుస్తుంది. దేవ ఫోన్‌ తీసుకుని మీనన్‌కు వార్నింగ్‌ ఇస్తాడు.


కేదార్‌: స్నేహితుడి గుణాలు తెలుసుకోవడం ఎంత ముఖ్యమో.. శత్రువు బలాలు తెలుసుకోవడం అంతే ముఖ్యం. మీనన్‌ను దేవ తక్కువ అంచనా వేస్తున్నాడు.


ధాత్రి: మనం నిజం చెప్పలేము. అలాగని ఆ ఫ్యామిలీకి ఆపద కలుగుతుంటే చూస్తూ ఊరుకోలేం. మీనన్‌ మనుషులను కనిపెట్టి ఎవ్వరికీ తెలియకుండా వాళ్లను సైడ్‌ చేయాలి.


అంటూ ఇద్దరూ వెళ్లి మీనన్‌ మనుషులను వెతుకుతుంటారు. ఇంతలో ఫోన్‌ మాట్లాడుతూ బయటకు వచ్చిన నిషిక చూసి మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది అని అనుమానిస్తుంది. ఎవరు మీరు అని అడుగుతుంది. దీంతో షాక్‌ అయిన ధాత్రి, కేదార్‌ తర్వాత తేరుకుని తాము చెవిటి మూగ అని సైగ చేస్తారు. దీంతో నిషిక వెళ్లిపోతుంది. వెనక నుంచి పార్వతి చూస్తుంది. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది అంటూ అడగ్గానే లేదని సైగ చేస్తుంది ధాత్రి. ఇంతలో పార్వతిని ఎవరో పిలవడంతో లోపలికి వెళ్లిపోతుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.


ALSO READ: ఈటీవీ విన్‌లో కొత్త సిరీస్ - ధన్య బాలకృష్ణ హీరోయిన్‌గా ‘శర్మ అండ్ అంబానీ’