Jagadhatri Serial Today Episode: తాను చనిపోయానని కుటుంబ సభ్యులకు ఎందుకు చెప్పారని రాగిణి ప్రశ్నించగా...అసలు ఆ రోజు ఏం జరిగిందో జగధాత్రి చెబుతుంది.మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చిన నిన్ను మీనన్ కాల్చివేయగా....కొన ఊపిరితో ఉన్న నిన్ను మేం ఆస్పత్రిలో చేర్పించామని చెబుతుంది. అప్పుడే నాన్న దగ్గర నుంచి ఫోన్కాల్రావడంతో ఇంటికి వెళ్లామని చెబుతుంది. మీనన్ నిన్ను కాల్చడానికి ముందే ...ఇంటికి వెళ్లాడని సీఎంను చంపిన విషయంపై మామయ్య దాచిపెట్టిన ఆధారాలు నీ దగ్గర ఉన్నాయని వాటిని తనకు ఇవ్వాలని మీనన్ గొడవ చేసి నాన్నను కొట్టడమే గాక....తుపాకీతో బెదిరించాడని చెబుతుంది. ఆ సీడీ తనకు ఇవ్వకపోతే అందరినీ చంపేస్తానని చెప్పడంతో ఇంట్లో ఉన్న అందరూ హడాలిపోయారని చెబుతుంది. ఆతర్వాత నేను ఆస్పత్రికి వచ్చేసరికి నువ్వు కోమాలోకి వెళ్లిపోయామని అంటుంది.కోమాలో ఉన్న నిన్ను కాపాడుకోవడం కష్టమని అనుకున్నామంటుంది.పైగా నువ్వు బతికే ఉన్నావని తెలిస్తే మీనన్ నీకోసం వెతకడమే గాక....ఇంట్లోవాళ్లను కూడా ఇబ్బంది పెడతాడని భావించే నువ్వు చనిపోయినట్లు డాక్టర్లతో అబద్ధం చెప్పించామని చెబుతుంది. నీలాగే ఉన్న ఓ అనాథ శవానికి ప్లాస్టిక్ సర్జరీ చేయించి....నువ్వు చనిపోయినట్లు అందిరినీ నమ్మంచామని వివరిస్తుంది. నా ప్రాణాలు కాపాడుకోవడానికి నువ్వు ఇన్ని ఇబ్బందులు పడ్డావామ్మా అని రాగిణి జగధాత్రిని చూసి కన్నీరు పెట్టుకుంటుంది. చిన్నప్పటినుంచి నిన్ను అనరాని మాటలు అని దూరంగా పెట్టామని బాధపడుతుంది. 25 ఏళ్లుగా మీ అమ్మ దోషి అన్న నింద భరిస్తూ పెరిగావని చెబుతుంది. ఇక అలాంటి ఇబ్బంది నీకు ఉండకూడదని...ఇప్పుడే వెళ్లి అందరికీ నిజం చెప్పేస్తానని అంటుంది. నా భర్త చేసిన తప్పునకు మీరు శిక్ష అనుభవిస్తున్నారని బాధపడుతుంది. నేనే వెళ్లి అందిరికీ అన్ని విషయాలు చెబుతానని....మీ అమ్మ తప్పు ఏం లేదని మీ అమ్మ నిర్దోషి అని చెబుతానని అంటుంది.నువ్వు కూడా దేశం గర్వించే గొప్ప పోలీసుు ఆఫీసర్ అయిన సంగతి కూడా అందిరికీ చెప్పాలని అంటుంది. ఇప్పుడు నువ్వు చెప్పినా ఎవరూ నమ్మరని...అందుకు బలమైన సాక్ష్యాలు ఉండాలని జగధాత్రి అంటుంది. ఎలాంటి సాక్ష్యాలు లేకుండా నువ్వు చెబితే...నేనే నీకు మందుపెట్టి మార్చేశానని ఎవరూ నమ్మరని ధాత్రి అంటుంది. ఇంతలో కేదార్ కల్పించుకుని పాతికేళ్లుగా మీ అన్నయ్య ఇదే మాట చెబుతున్నా మీరే నమ్మలేదని.....ఇప్పుడు మాత్రం మీరు చెప్పగానే ఇంట్లో వాళ్లు ఎలా నమ్ముతారని ప్రశ్నిస్తాడు. పైగా మీరు బతికే ఉన్నారన్న సంగతి మీనన్కు తెలిస్తే మళ్లీ ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తాడు. కాబట్టి కొన్నాళ్లు మీరు సీక్రెట్గా ఉంటే ఆ తర్వాత మిమ్మల్ని మాతోపాటే మా ఇంటికి తీసుకెళ్లడానికి జగధాత్రి అన్ని ఏర్పాట్లు చేసిందని చెబుతాడు.దీంతో రాగిణి సరేనని అంటుంది. ఆస్పత్రి నుంచి వాళ్ల అత్తయ్యను డిశ్చార్చి చేసిన తర్వాత...జగధాత్రి ఆమెను ఓ సీక్రెట్ ప్లేస్లో ఉంచుతుంది.చుట్టూ ప్ర్రైవేట్ సెక్యూరిటీని ఉంచి ఆమెను రక్షించుకుంటుంది. ఇక్కడే కొన్నాళ్లు రెస్ట్తీసుకుంటే నేనే వచ్చి తీసుకెళ్తానని చెప్పి జగధాత్రి, కేదార్ వెళ్లిపోతారు.
