Guppedanta Manasu  Serial Today Episode: మహేంద్ర ఇంటికి దేవయాని, ధరణితో కలిసి వచ్చి సాయంత్రం ఫంక్షన్‌ కు ఇన్‌వైట్‌ చేస్తుంది.  ఫంక్షన్‌కు తప్పకుండా వస్తామని చెప్తారు మహేంద్ర, వసు, అనుపమ. తర్వాత దేవయాని, ధరణి వెళ్లిపోతారు. మహేంద్ర దేవయానిని అనుమానిస్తాడు. ధరణికి తెలియకుండా దీని వెనక ఏదైనా మర్మం ఉందేమో అంటాడు. వసు మాత్రం అదేం ఉండకపోవచ్చు అంటుంది. కానీ రాక్షసులను అంత ఈజీగా నమ్మకూడదు అంటాడు మహేంద్ర.  ఏదైనా ఉంటే ధరణి వచ్చేది కాదని వసు అంటుంది.  అయితే నేనైతే అక్కడకు వెళ్లను అంటూ మహేంద్ర అనుపమను అడిగితే తాను కూడా వెళ్లను అంటుంది. వసు మాత్రం నేను వెళ్తానని చెప్తుంది. దేవయాని ఇంట్లో పూజకు ఏర్పాట్లు జరుగుతుంటాయి.


దేవయాని: పంతులు గారు పూజకు అన్నీ ఉన్నట్లేగా


పంతులు: పూలు, పండ్లు, ఆకు, వక్కలు అన్నీ ఉన్నాయి అమ్మా..


దేవయాని: ఏదైనా అవసరం అయితే చెప్పండి వ్రతం మాత్రం నిర్విగ్నంగా జరగాలి.


శైలేంద్ర: పంతులు గారు మమ్మల్ని కూర్చోమంటారా?


అని అడగ్గానే కొద్దిసేపు ఆగండి అని పంతులు చెప్తాడు. దేవయాని వసుధార వాళ్ల కోసం ఎదురుచూస్తుంది. ఇంకా రాలేదేంటని అనుపమకు ఫోన్‌ చేస్తుంది. ఇంతలో వసుధార వస్తుంది. అనుపమ రాలేదా? అని దేవయాని అడుగుతుంది రాలేదని వసుధార చెప్పడంతో రానిదే మంచిదయ్యిందంటుంది దేవయాని. ఇంతలో పూజారి పూజ ప్రారంభించి పూర్తి చేస్తాడు. తర్వాత అందరికీ తాంబూలాలు ఇవ్వమని పంతులు చెప్పగానే ధరణి అందరికీ తాంబూలాలు ఇస్తుంది.


దేవయాని: అందరికీ ఇచ్చావా? ధరణి..


ధరణి: అందరికీ ఇచ్చాను అత్తయ్యా..


దేవయాని: మరి వసుధారకు ఇచ్చావా? ఏంటి అందరికీ ఇచ్చి నీ తొడి కోడలునే మర్చిపోతే ఎలా?


అనగానే ధరణి సారీ వసుధార అంటూ తాంబూలం వసుధారకు ఇవ్వబోతుంటే పక్కనే తన ఫ్రెండ్‌కు దేవయాని సైగ చేస్తుంది. దీంతో ఆమె ఒక్క నిమిషం అంటూ ఆపి రిషి చనిపోయాడు కదా ఆ అమ్మాయికి తాంబూలం ఎలా ఇస్తారు అని అడగ్గానే వసుధార కోపంగా రిషి చనిపోలేదని చెప్తుంది. రిషి సార్‌ బతికే ఉన్నారని క్షేమంగానే ఉన్నారని చెప్తుంది. అయితే ఎక్కడున్నాడని వాళ్లు అడగ్గానే వసు డైలమాలో పడుతుంది. దీంతో వాళ్లు మొగుడు లేని వాళ్లకు తాంబూలం ఇస్తే పూజ ఫలితం లభించదు అనగానే ధరణి కల్పించుకుని నాకు పూజ ఫలం లభించకపోయినా పర్వాలేదు.. నాకు పిల్లలు పుట్టకపోయినా పర్వాలేదు. కానీ వసుధార బాధపడటం నాకు ఇష్టం లేదని చెప్పి వసుధారకు తాంబూలం ఇస్తుంది. తాంబూలం తీసుకుని వసు బాధగా వెళ్లిపోతుంది. తర్వాత దేవయాని, శైలేంద్ర ల దగ్గరకు ధరణి వెళ్తుంది.



 


ధరణి: ఎంటత్తయ్యా షాక్‌ అయ్యారా? మీ ప్లాన్‌ ఫెయిల్‌ అయిందని బాధపడుతున్నారా?


దేవయాని: ఏయ్‌ ధరణి ప్లాన్‌ ఎంటి? షాక్‌ ఎంటి? నీకేమైనా పిచ్చి పట్టిందా?


ధరణి: ఇక చాలు అత్తయ్యా.. మీరు ఇంక ఎన్ని మాటలు మాట్లాడినా నేను నమ్మను మీరు వసుధారను నలుగురిలో బాధపెట్టాలని చూశారా?


దేవయాని: అలా మేమెందుకు అనుకంటాం. వాళ్లు అలా అంటే మేము ఎం చేస్తాం. దానికి కూడా మేమే బాధ్యత వహించాలా ఏంటి?


అనగానే మీ మాటలు బయటి వాళ్ల దగ్గర చెప్పండి.. మీ గురించి అందరికన్నా నాకు బాగా తెలుసు మామయ్యగారు లేనప్పుడు మీరు ఈ వ్రతం చేయించారంటేనే అర్తం చేసుకున్నాను అంటూ నిలదీస్తుంది ధరణి. దీంతో ఈరోజు నాకు నువ్వు వార్నింగ్‌ ఇస్తున్నావా? అంటుంది దేవయాని. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్‌ అయిపోతుంది.


ALSO READ: పెళ్లికి ముందే ఒకే రూమ్ లో ఉండేవాళ్లం, నాకు ఆ భయం అస్సలు ఉండేది కాదు: జీవిత