Guppedanta Manasu  Serial Today Episode:


రంగా కోసం వచ్చిన సరోజ ఇంట్లో హడావిడి చేస్తుంది. ఇంతలో మహేంద్ర, ఫణీంద్ర, శైలేంద్ర, రిషి వస్తారు. రిషిని చూసి ఏంటి బావా ఇక్కడే సెటిలైపోయావు. అక్కడ నీ కోసం అమ్మమ్మ బెంగ పెట్టుకుందని అడుగుతుంది. ఇంతలో మహేంద్ర వచ్చి ఎవర్ని పట్టుకుని బావ అంటున్నావు అని అడుగుతుంది. ఈయనే మా బావ అని శైలేంద్ర పదిలక్షలు ఇచ్చి మా బావను ఇక్కడకు తీసుకొచ్చాడని చెప్తుంది సరోజ. ఏంటి బావా నేను ఇంత మాట్లాడుతున్నా నువ్వేమి మాట్లాడవు అంటూ పద బావ వెళ్దాం అని చేయి పట్టుకుంటే రంగా విడిపించుకుంటాడు.


సరోజ: ఏంటీ బావ నా చేయి విదిలించుకుంటున్నావ్. అంటే నాతో రావా. ఇక్కడే ఉంటావా. నాతో రాకుంటే నేను ఇక్కడే చస్తాను.  


ఫణీంద్ర: అమ్మా నువ్ ఏం చేసుకోకు నేను మాట్లాడుతాను. నిజమేంటో నీ ముందే తేలుస్తాను. అతను నిజంగా తను రంగా అయితే నీతోనే పంపిస్తాను. శైలేంద్ర తను నువ్ డబ్బు ఇచ్చాను అంటోంది. అసలు ఏం జరిగింది. నిజం చెబితే బతుకుతావ్. లేకుంటే తండ్రి చేతిలో చనిపోయిన కొడుకుగా చరిత్రలో నిలుస్తావ్.


శైలేంద్ర: డబ్బులు ఇచ్చాను డాడ్‌.


ఫణీంద్ర: అంటే తను చెప్పేది నిజమేనా?


శైలేంద్ర: నిజమే డాడ్.. మీరంతా అనుకున్నట్లు తను రిషి కాదు.. రంగా నేనే అతనికి డబ్బులిచ్చి రిషిలా నటించమని చెప్పాను.


ఫణీంద్ర: ఎందుకురా?


శైలేంద్ర: ఎండీ సీటు కోసం. మరి ఏం చేయమంటారు. మీరంతా నాకు ఎండీ సీటు ఇవ్వట్లేదు.  ఆ మంత్రి ఏమో రిషి వచ్చి చెబితే కానీ ఇవ్వను అన్నాడు. ఇంకేం చేయమంటారు.


  అంటూ శైలేంద్ర చెప్పగానే.. సరోజ ఇప్పుడు చెప్పండి సార్. భ్రమ పడుతుంది ఎవరు మీరా నేనా అంటూ ప్రశ్నిస్తుంది. మహేంద్ర మాత్రం ఇతను నా కొడుకు రిషినే అంటాడు. అవేమీ పట్టించుకోకుండా సరోజ మనం వెళ్దాం పద బావ అనగానే రిషి నేను రాను సరోజ నేను రంగాను కాదు. నా పేరు రిషి.. రిష్యేంద్రభూషన్‌ అంటాడు. దీంతో  శైలేంద్ర, దేవయాని షాక్ అవుతారు. నేను కొన్ని రోజుల తర్వాత మీ ఊరికి వస్తాను. అప్పుడు అన్ని నిజాలు చెబుతాను. ఇక్కడ ఏ గొడవ చేయకుండా వెళ్లిపో అని రిషి అంటాడు. ఇంతలో ఫణీంద్ర ఎండీ సీటు కోసం ఇంతకు తెగిస్తావా? అంటూ శైలేంద్రను కొట్టి ఇంట్లోంచి బయటకు గెంటివేస్తాడు. శైలేంద్ర వద్దు డాడీ  అంటూ గట్టిగా అరుస్తూ నిద్ర లేస్తాడు. ఒ ఇదంతా కలా అనుకంటాడు.


  తర్వాత కింద వసుధార, మహేంద్ర మాట్లాడుకుంటుంటే శైలేంద్ర చూస్తుంటాడు. శైలేంద్రను గమనించిన వసుధార రిషి సర్‌లో ఏదో తేడా కొడుతుందని మహేంద్రతో చెప్తుంది. దీంతో కంగారుపడ్డ శైలేంద్ర వసుధార నిజం బయటకు లాగేసేలా ఉంది అని వాళ్ల ముందుకు పరుగెత్తుకొచ్చి  లేనిపోని అనుమానాలు ఎందుకు పెట్టుకుంటావ్ వసుధారను కన్వీన్స్‌ చేయాలని చూస్తాడు శైలేంద్ర. మరోవైపు రాధమ్మ  ఏం తినను, తాగను అని అంటుంది. ఇంతలో సంజీవ వచ్చి రంగ సంపాదన గురించి మాట్లాడుతాడు. మరోవైపు రిషి వసుధారను వెనుకవైపు నుంచి రొమాంటిక్‌గా చూస్తాడు. ఇన్నాళ్లు ఎందుకు దూరం పెట్టారు అని వసుధార అడుగుతుంది. కొన్నిసార్లు అవతారాలు ఎత్తాలంటే దూరం ఉండాలి. ఇక నుంచి నిన్ను దూరం చేసుకోలేను. చాలా మిస్ అయ్యాను అని రిషి అంటాడు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.