ప్రముఖ ఛానెల్ ఈటీవీలో ప్రసారమయ్యే డాన్స్ షో 'ఢీ' సిరీస్ ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే పన్నెండు సీజన్లను పూర్తి చేసుకున్న ఈ షో ఇప్పుడు పదమూడవ సీజన్ లో ఉంది. 'కింగ్స్ వర్సెస్ క్వీన్స్' అంటూ అబ్బాయిలు, అమ్మాయిలు తమ స్టెప్పులతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ప్రస్తుతం ఈ షోలో సెమీఫైనల్ పోరు నడుస్తోంది. త్వరలోనే గ్రాండ్ ఫినాలే జరగబోతుంది. అయితే ఈ గ్రాండ్ ఫినాలేకు అతిథిగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ని తీసుకొస్తున్నారు. 


'ఢీ' సీజన్ 12 గ్రాండ్ ఫినాలేకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను ముఖ్య అతిథిగా తీసుకొచ్చారు. ఇప్పుడేమో స్టైలిష్ స్టార్ ను రంగంలోకి దింపుతున్నారు. సెమీ ఫైనల్ పోరులో కింగ్స్ వర్సెస్ క్వీన్స్ నుంచి నలుగురు సభ్యులు ఎంపిక అవుతారు. వీరిలో అల్లు అర్జున్ చేతుల మీదుగా ఢీ13 టైటిల్ ఓ వ్యక్తి అందుకోబోతున్నారు. ఆ పర్సన్ ఎవరనే విషయం ముందే లీకైపోయింది.


సోషల్ మీడియాలో ఇదిగో 'ఢీ' విన్నర్ అంటూ ఓ వీడియో వైరల్ అవుతోంది. విజేతను ప్రకటించే విషయాన్ని స్పష్టంగా తెలియజేసే విషయాన్ని కొంతమంది తమ సెల్ ఫోన్ లో చిత్రీకరించారు. ఆ వీడియో బయటకు వచ్చింది. ఇద్దరు ఫైనలిస్ట్ ల చేయిని అల్లు అర్జున్ పట్టుకొని ఉండగా.. కౌంట్ డౌన్ మొదలైంది. అప్పటివరకు ఉన్న సస్పెన్స్ కి తెరదించుతూ.. ఓ అమ్మాయి చేయిని పైకి లేపుతూ.. విన్నర్ అని ప్రకటించాడు అల్లు అర్జున్. ఆమె విన్నర్ ని తెలియగానే.. ఆమె టీమ్ మొత్తం స్టేజ్ పై గంతులు వేసింది. ఇంతకీ ఆ విన్నర్ పేరేంటంటే.. 'కావ్య'. పూర్తి వివరాలు తెలియాలంటే.. ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యేవరకు ఆగాల్సిందే!