భాస్కర్ పారిపోయాడని మనీషా దేవయానితో చెప్తుంది. ఇక మనీషా పుట్టిన రోజు దగ్గరకు వెళ్తుంది. అరవింద మనీషాకి పిల్లలకు కేక్ తినిపించమని అంటుంది. దాంతో మనీషా అర్జున్‌గారు ఫస్ట్ తినిపించాలని అంటుంది. ఇంతలో లక్ష్మీ అవును అర్జున్ గారు మీరు దూరంగా నిల్చొన్నారేంటి రండి పిల్లలకు కేక్ తినిపించండని అంటుంది.  


అర్జున్: అందరిదీ అయ్యాక తినిపిద్దామని ఆగాను.
మనీషా: చివరకు తినిపించాలని ఆగారా లేదా స్పెషల్‌గా తినిపించాలని ఆగారా. 
అర్జున్: వాట్ డూ యూ మీన్.
మనీషా:  చెప్పా ముందు కేక్ తినిపించండి. 
దేవయాని: పిల్లలు మీరు ఇక ఆడుకోండి. మీరంతా రండి డిన్నర్ చేద్దురు.
మనీషా: మిత్ర నువ్వు ఆగు. జున్నుకి కేక్ తినిపించావు. లక్ష్మీతో పిల్లలతో కలిసి ఫ్యామిలీ ఫొటో కూడా దిగావు. ఇప్పుడు కేక్ కూడా తినిపించావ్ దానర్థం ఏంటి లక్ష్మీని భార్యగా ఒప్పుకొని జున్నుని కొడుకుగా ఒప్పుకున్నట్లేనా. 
అరవింద: ఇప్పుడు కొత్తగా అంగీకరించడం ఏంటి తను మిత్ర భార్యనే కదా.
మనీషా: మరి జున్ను. జున్ను మిత్ర కొడుకేనా అని అడుగుతున్నాను. 
అరవింద: జున్ను లక్ష్మీ కొడుకు అయితే మిత్రకి కొడుకే కదా.
మనీషా: కాదు అని నా అనుమానం. 
జయదేవ్: ఏం మాట్లాడుతున్నావ్ మనీషా.
మనీషా: ఎమోషనల్ అవ్వొద్దు అంకుల్ ప్రాక్టికల్‌గా ఆలోచించండి. మిత్ర, లక్ష్మీ విడిపోయి చాలా ఏళ్లు అయిపోయింది. వాళ్లిద్దరూ కలిసి ఉన్నది లేదు కలిసి కాపురం చేసింది లేదు. లక్ష్మీ ఇప్పుడు వచ్చి జున్ను మిత్ర బిడ్డ అనడం ఏంటి.
అరవింద: ఇప్పుడు నువ్వేమంటావ్ మనీషా.
మనీషా: మిత్ర, లక్ష్మీలకు జున్ను ఎప్పుడు పుట్టాడు ఆంటీ. అసలు జున్ను మిత్ర కొడుకేనా. 
జయదేవ్: మనీషా నోటికొచ్చినట్లు మాట్లాడితే మర్యాదగా ఉండదు.
దేవయాని: మనీషా అన్నదాంట్లో తప్పేముంది బావగారు. మిత్ర, లక్ష్మీలు కలిసి ఉన్నదే లేదు ఎన్నో ఏళ్లుగా దూరంగా ఉన్నారు. లక్ష్మీ ఇంటి నుంచి వెళ్లిపోయినప్పుడు కూడా మిత్రతో సఖ్యతగా లేదు.  
అరవింద: లక్ష్మీ అలా ఎందుకు చేయాల్సి వచ్చిందో నీకు తెలీదా మనీషా. మిత్రకు అన్నీ చెప్పమంటావా.
లక్ష్మీ: అత్తయ్యా.
అరవింద: లక్ష్మీ వాళ్లు నీ మీద నిందలు వేస్తున్నారు నీకు ఇంకా అర్థం కావడం లేదా. 
మనీషా: నిందలు కాదు ఆంటీ నిజం మాట్లాడుతున్నాను. జున్ను మిత్ర కొడుకు కాదు అన్నది నిజం. నీ కొడుకుగా ఒప్పుకోకు మిత్ర. 
జయదేవ్: వాళ్లు నీ భార్య మీద నిందలు వేస్తున్నారురా మీ బంధాన్ని అవమానిస్తున్నారు.
మిత్ర: అంతవరకు తెచ్చింది లక్ష్మీనే కదా. తాళిని ఎగతాళి చేసింది. నాకు అన్ని విధాలుగా నష్ట పరిచి బాధ పెట్టిన తను నాకు భార్య ఎలా అవుతుంది. తన కొడుకు నా కొడుకు ఎలా అవుతాడు. నాకు మరో వారసుడు అవసరం లేదు.
మనీషా: విన్నావు కదా లక్ష్మీ నిన్ను మిత్ర భార్యగా అంగీకరించడం లేదు. నీ కొడుకుని తను కొడుకులా అంగీకరించడం లేదు. ఇప్పుటికైనా నీ స్థానం తెలుసుకో.
అరవింద: మరి జున్ను ఎవరి కొడుకు.
మనీషా: అర్జున్ కొడుకు.  
అర్జున్: మనీషా జున్ను నా కొడుకేంటి. లక్ష్మీ నాకు మంచి ఫ్రెండ్ మాత్రమే. తన మీద నిందలేస్తే ఊరుకోను.. 
దేవయాని: ఫ్రెండో లవరో లేక తాళి కట్టని భర్తో ఎవరికి తెలుసు మీ మధ్య జరిగింది మేం చూశామా. 
మనీషా: జున్ను మీకు పుట్టలేదా జున్ను మీ కొడుకు కాదా.
లక్ష్మీ: కాదు జున్ను నా కొడుకు నాకు మిత్రకు పుట్టిన కొడుకు ఈ నందన్ వారసుడు.
మనీషా: అందుకు సాక్ష్యం ఏంటి.
లక్ష్మీ: నేనే సాక్ష్యం.
దేవయాని: నువ్వు చెప్తే నిజం అయిపోతుందా. 
మనీషా: జున్ను మిత్రకు పుట్టాడని నిరూపించు జున్నుకి డీఎన్ఏ టెస్ట్  చేయించాలి. 


లక్ష్మీ దానికి ఒప్పుకోదని అరవింద అంటుంది. కానీ లక్ష్మీ మాత్రం డీఎన్ఏ టెస్ట్‌కి ఒప్పుకుంటుంది. అర్జున్‌తో పాటు ఎవరూ వద్దని లక్ష్మీ నిప్పు అని అంటారు. రేపే DNA టెస్ట్ అని రెడీగా ఉండమని మనీషా చెప్తుంది. మరోవైపు మిత్ర మనిసా మాటలు తలచుకొని ఆలోచిస్తుంటారు. మనీషా మిత్ర దగ్గరకు వచ్చి ఎందుకు మధ్యలో వచ్చేశావ్ అంటే నేను నీ మాటలన్ని సమర్దించలేమని అంటాడు. దాంతో మనీషా నీకు జున్ను కొడుకు అని నమ్ముతున్నావా అడుగుతుంది. ఇక మనీషా మిత్రకు డీఎన్ఏ టెస్ట్ గురించి చెప్తుంది. మిత్ర షాక్ అయిపోతాడు. ఆ టెస్ట్ నువ్వు అడిగావా నీకు ఏంటి అవసరం అని మనీషా మీద సీరియస్ అవుతాడు. మనీషా ఏడుస్తూ నటిస్తుంది. దాంతో మిత్ర నీకు నచ్చింది చేసుకో అనేసి వెళ్లిపోతాడు. లక్ష్మీ అర్జున్‌ని డ్రాప్ చేస్తూ ఏం అనుకోవద్దని అంటుంది. మనీషా వాళ్లు తనని ఇంటి నుంచి పంపాలని ఇలా చేస్తున్నారని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 


Also Read: సత్యభామ సీరియల్: ఒళ్లంతా రక్తం.. తండ్రి చేతికి గన్ ఇచ్చి తనని చంపేయ్‌మన్న క్రిష్.. సత్య మీద ఫైర్!