Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today Episode భాస్కర్ తప్పించుకొని రోడ్డు మీద పరుగులు తీస్తుంటాడు. మరోవైపు రౌడీలు వెంట పడుతుంటారు. భాస్కర్ మిత్ర ఇంటికి చేరుకొని ఎలా అయినా మిత్ర, లక్ష్మీలకు నిజం చెప్పాలని అనుకుంటాడు. ఇంతలో రౌడీలు కూడా ఇంటి దగ్గరకు రావడంతో భాస్కర్ దాక్కుంటాడు. రౌడీలు భాస్కర్‌ని చూసేసి వెంట పడతారు. 


మరోవైపు జున్ను అర్జున్ ఇంకా రాలేదని లక్ష్మీని అడుగుతాడు. వచ్చేస్తాడని దారిలో ఉంటాడని లక్ష్మీ చెప్తుంది. మరోవైపు భాస్కర్ పరుగున వచ్చి అర్జున్ కారుకి గుద్దేస్తాడు. దాంతో అర్జున్‌కి తీవ్రంగా గాయాలు అవుతాయి. అర్జున్ కారులో భాస్కర్‌ని ఎక్కించుకొని హాస్పిటల్‌కి బయల్దేరుతాడు. ఇక లక్ష్మీ కాల్ చేస్తే విషయం చెప్తాడు. అతను ఎవరని లక్ష్మీ అడిగితే ఎవరో తెలీదని అంటాడు. ఇక జున్ను ఫోన్ తీసుకొని ఎవరో ఏంటో బాగా చూసుకోండి మీరు రావడం ఆలస్యం అయినా పర్లేదని అంటాడు. అతనికి ట్రీట్మెంట్‌ అయితే వస్తానని అంటాడు. 



మరోవైపు మిత్ర కాల్ మాట్లాడుతూ ఇంటి ముందు రౌడీలను గుర్తిస్తాడు. వాళ్లని కలవడానికి వెళ్తే మనీషా, అరవిందలు కూడా వెనకాలే వస్తారు. రౌడీలను చూసి మనవాళ్లే అని ఈవినింగ్ పార్టీకి బౌన్సర్‌లని కవర్ చేస్తారు. ఇక మిత్ర వెళ్లిపోయిన తర్వాత భాస్కర్ తప్పిపోయాడని మనీషాతో రౌడీలు చెప్తారు. మనీషా చాలా టెన్షన్ పడుతుంది.  


లక్ష్మీ: మిత్ర గారు మీతో కాస్త మాట్లాడాలి.
మిత్ర: చెప్పేవన్నీ అబద్ధాలే కదా ఇంకేం మాట్లాడుతావ్.
లక్ష్మీ: ఇప్పుడు నేను అడగబోయేది ఒక సాయం. 
మిత్ర: నువ్వు మోసం చేస్తావ్ నేను సాయం చేయాలా.
లక్ష్మీ: సాయంత్రం పార్టీలో పిల్లలు కేక్ కట్ చేసినప్పుడు మీరు కూడా పక్కన ఉండాలి. 
మిత్ర: నువ్వు మళ్లీ నా భార్య అని అందరికీ తెలియాలి అనా.
లక్ష్మీ: కాదండీ జున్ను మిమల్ని అందరికీ తండ్రిగా చెప్పుకోవాలి అనుకుంటున్నాడు.
మిత్ర: ఇది నీ దురాశ వాడి ఆశ. ఇలా ఇంకెన్ని సార్లు నన్ను మోసం చేస్తావ్. ఆ రోజు ప్రవీణ్ మిట్టల్‌తో చేతులు కలిపి నాకు వెన్ను పోటు పొడిచావ్. అప్పుడే నా మనసు విరిగిపోయింది. నాతో చెప్పకుండా నువ్వు వెళ్లిపోయినప్పుడు మిగిలిన కాస్త మనసు విరిగిపోయింది. నువ్వు బతికి ఉండి కూడా నా గురించి పట్టించుకోలేదు. పైగా పేర్లు మార్చుకొని మరో మనిషిలా నటించావ్. జున్ను నా కొడుకని అప్పుడెప్పుడూ నాతో చెప్పలేదు. ఇప్పుడు వాడు నా కొడుకు అంటున్నావ్ పార్టీలో నీ పక్కన ఉండమంటున్నావ్. అసలు నీకు ఆ అర్హత ఉందా. అసలు నువ్వు నా లక్ష్మీవేనా నీ గుండెల మీద చేయి వేసుకొని చెప్పు. 
మనీషా: మిత్ర భలే అడుగుతున్నాడు కదా ఆంటీ.
మిత్ర: నేను ఇష్టపడ్డ లక్ష్మీ ఎప్పుడో చనిపోయింది ఆ మిత్ర కూడా అప్పుడే పోయాడు. 
లక్ష్మీ: దయచేసి అలా అనకండి. 
మిత్ర: ఇంకా ఏదో మిగులుందని నా ఇంట్లో ఉన్నావ్ అది నువ్వు ఎప్పటికీ దొరకదు. ప్రయత్నించకు.
లక్ష్మీ: పిల్లల కోసం అడుగుతున్నాను ఈ ఒక్క సారికి ఒప్పుకోండి. అడిగితే కాదు అనరు అని అడుగుతున్నాను.
మిత్ర: ఎప్పుడూ నీ స్వార్థమే కాదా నీకు వెళ్లు నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో.
 
మరోవైపు భాస్కర్‌కి ట్రీట్మెంట్ జరుగుతుంటుంది. డాక్టర్‌ బయటకు వచ్చి యాక్సిడెంట్‌లో చిన్న గాయం అయింది కానీ ఎవరో బాగా హింసించి కొట్టారని ఫుడ్ కూడా పెట్టలేదని అంటాడు. దాంతో అర్జున్ ఎంత డబ్బులు అయినా పర్లేదు అతనికి బతికించండి అని చెప్తాడు. ఇక అర్జున్ భర్త్‌డే పార్టీకి బయల్దేరుతాడు. మరోవైపు మనీషా, దేవయానిలు టెగ టెన్షన్ పడతారు. ఇక జాను వివేక్ ఇచ్చిన డ్రస్ వేసుకొని కిందకి వస్తుంటుంది. జానుని అలా చూసి వివేక్ చూస్తూ ఉండిపోతాడు. ఆ సీన్ మనీషా దేవయానికి చూపిస్తుంది. వీడు మరీ తెగించేశాడని  కొడుకు గురించి అంటుంది. ఇక జాను వివేక్‌ దగ్గరకు వస్తుంది. డ్రస్‌లో చాలా బాగున్నావ్ అని అంటాడు. ఇక వివేక్ జానుతో ఫొటోలు తీసుకుంటాడు. జాను నడుము మీద చేయి వేసి ఫొటోలు తీసుకుంటే.. మీ వాడికి మామూలు ధైర్యం రాలేదు నడుం మీద చేయి వేసే అంత ధైర్యం వచ్చిందని అంటుంది మనీషా దేవయానితో. ఇక జాను నడుం మీద చేయి తీయమని వివేక్‌ని గిచ్చుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 


Also Read: సత్యభామ సీరియల్: ఆ చిన్నా నా కొడుకే కాదు.. కేవలం మన కాపలా కుక్క: రుద్రతో మహదేవయ్య, వినేసిన సత్య షాక్‌!