Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today September 5th Episode ఠదేవయాని మాటలకు జాను చాలా ఫీలవుతుంది. దేవయాని అలా మాట్లాడుతుంటే సైలెంట్‌గా ఎందుకు ఉన్నావని దేవయాని అంటుంది. తనని అన్నప్పుడు మౌనంగా ఉంది తన చెల్లిని అన్నప్పుడు కూడా సైలెంట్‌గా ఉంటే ఎలా అని అంటుంది. జాను హర్ట్ అయి అక్కడ నుంచి వెళ్లిపోతుంది. ఇంకోసారి ఇలా ఎవరు ఏమన్నా కామ్‌గా ఉండొద్దని అరవింద అంటుంది.  


దేవయానిని మనీషా తీసుకొని వచ్చి వాళ్లంతా ఒక టీమ్ ఏనొద్దని అంటుంది. వివేక్, జానులకు పెళ్లి అయితే ఏం చేస్తావని అడిగితే దేవయాని అంతవరకు తీసుకురానని అంటుంది. ఇక జానుని పర్మినెంట్‌గా ఇంట్లో నుంచి పంపించేసే ప్లాన్ తనకు ఉందని చెప్తుంది. 


దేవయాని: ఏ ఆడ పిల్లకు జరగని అవమానం జరిగితే తానే వెళ్లిపోతుంది. వెళ్లక చస్తుందా. అతి త్వరలోనే జానుకి అలాంటి అవమానం చేయబోతున్నా ఇక అది జీవితంలో వివేక్ ముఖం చూడదు.
మనీషా: సూపర్ ఆంటీ అక్క నాకు విలన్ చెల్లి మీకు విలన్. అక్కని నేను ఇంట్లో నుంచి తరిమేయాలి అని  చూస్తుంటే చెల్లిని మీరు ఇంట్లో నుంచి తరిమేయాలి అని చూస్తున్నారు. మనలో ముందు ఎవరు సక్సెస్ అవుతారో. 


అందరూ టిఫిన్ చేస్తుంటే మిత్ర వస్తాడు. మిత్రతో శాంతి పూజ గురించి మాట్లాడాలని అరవింద, జయదేవ్ అంటారు. మిత్రని తల్లిదండ్రులు పిలుస్తారు. మిత్రకు పూజ గురించి చెప్తారు. లక్ష్మీతో కలిసి పూజ చేయాలని వాళ్లు అంటే మిత్ర లక్ష్మీకి ఆ విషయం నువ్వు చెప్పావా అని అడుగుతాడు. దీక్షితులు గారు చెప్పారని వివేక్ అంటే మిత్ర కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోబోతాడు. జున్ను ప్రోగ్రస్ కార్డు మీద సంతకం పెట్టానని ఇంకా నాతో ఏవేవో చేయాలని చూస్తున్నారా అని అడుగుతాడు. లక్ష్మీ అనే గండం తనని వదిలి వెళ్లిపోవాలి అంటే ఏం పూజ చేయాలో చెప్పమని అంటాడు. అందరూ షాక్ అయిపోతారు. లక్ష్మీ ఓ అబద్ధం పెద్ద మోసమని తనని ఎప్పటికీ క్షమించలేనని మిత్ర అనేస్తాడు. మిత్ర వెళ్లిపోతాడు. మనీషా దేవయాని ఆ మాటలు విని హ్యాపీగా ఫీలవుతారు. మిత్ర లక్ష్మీ మీద చాలా ఫైర్ అవుతున్నాడని అనుకుంటారు. 


మిత్ర మనీషా మాటలను తలచుకుంటూ ఆలోచిస్తాడు. జున్నూ గురించి  తెలుసుకోవడం ఎలా అని  అనుకుంటాడు.  ఇంతలో జున్నూ నాన్నా మీరు నాతో ఏదో మాట్లాడాలని అనుకుంటున్నారు కదా? అని మిత్రని అడుగుతాడు.


మిత్ర: మీరు చిన్నప్పుడు ఎక్కడున్నారు.
జున్ను: మున్నార్‌లో
మిత్ర: మున్నార్‌లోనా?
జున్ను: నేను పుట్టింది, పెరిగింది అంతా అక్కడే. ఈ మధ్యే వైజాగ్‌ వచ్చాం. 
మిత్ర: మున్నార్‌లో మీ అమ్మానాన్న ఎక్కడున్నారు.
జున్ను: బాబా దగ్గర
మిత్ర: బాబానా.
లక్కీ: అదే నాన్న అర్జున్ అంకుల్ దగ్గర.
జున్ను: చిన్నప్పుడు నుంచి నన్ను బాబానే చూసుకున్నారు. మేం తనకి చాలా రుణపడి ఉన్నాం అని అమ్మనాతో చెప్తుంది. ముందు బాబానే మా నాన్న అనుకున్నా తర్వాత కాదు అని తెలిసింది. ఇన్నాళ్లు మీరు మాకు ఎందుకు దూరంగా ఉన్నారో తెలీదు నాన్న. కానీ బాబా మమల్ని జాగ్రత్తగా చూసుకున్నాడు. ఇన్నాళ్లు మీకోసం చాలా ఎదురు చూశాను కానీ మీరు ఎందుకు నన్ను దూరం పెడుతున్నారు నాన్న. నేను లక్కీని రిక్వెస్ట్ చేసి ఇలా మీ పక్కన కూర్చొన్నాను. ఇంకా చాలా కలలు కన్నాను.
లక్కీ: నీ కలలు అన్నీ నాన్న తీర్చుతారు జున్ను. నాలాగే నిన్ను చూసుకుంటారు.


జాను దేవయాని మాటలు తలచుకొని ఏడుస్తుంది. వివేక్ టిఫెన్ తీసుకొని వచ్చి తినిపిస్తాడు. వివేక్ తింగరి వేషాలు వేస్తూ జాను లిప్స్‌ని ముట్టుకుంటే జాను చేయి కొరికేస్తుంది. చెప్పకుండా పెళ్లి చేసుకుందామని అంటే వద్దంటున్నావ్ అని త్వరలోనే మా మహాతల్లికి ఫుల్‌స్టాప్ పెడతానని వివేక్ అంటాడు. ఇక అరవింద గురూజికీ కాల్ చేసి మిత్ర పూజలో కూర్చొనని చెప్తున్నాడని చెప్తుంది. ఇక లక్ష్మీ మాట్లాడుతుంది.  వేరే పరిష్కారం ఉంటే చెప్పమని అడుగుతుంది. దానికి గురువుగారు మీ భార్యభర్తలే చేయాలని ఇక మిత్ర గురించి అడిగితే పిల్లల్ని తీసుకొని స్కూల్‌కి వెళ్లారని లక్ష్మీ చెప్తుంది. దాంతో దీక్షితులు గారు మిత్రతో పిల్లల్ని పంపొద్దని చెప్పాకదా మిత్ర గండం పిల్లలకు తగులుతుందని చెప్పాకదా ఎందుకు పంపావని గండం వాళ్లకి తగల కుండా వెళ్లి ఆపు అని అంటారు. దాంతో ఏడుస్తూ పరుగులు తీస్తుంది. అరవింద వాళ్లు కూడా లక్ష్మీ వెనక వెళ్తారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.  


Also Read: కార్తీకదీపం 2 సీరియల్: కాశీని చంపేస్తానని స్వప్నని బెదిరించిన శ్రీధర్.. జ్యోత్స్న మీద చేయి ఎత్తిన దీప!