Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today Episode లక్కీ ప్రోగ్రస్ రిపోర్ట్‌లో అమ్మ స్థానంలో మనీషా సంతకం పెడతాను అంటే లక్కీ నువ్వు మా అమ్మ కాదు అని అంటుంది. మా అమ్మ లక్ష్మీనే అని లక్కీ అంటుంది. లక్ష్మీ అమ్మతోనే సంతకం పెట్టించుకుంటానని అంటుంది. దాంతో మనీషా నేను తన అమ్మని కాదు అంటా అని మిత్రతో చెప్తుంది. ఇక లక్కీ కిందకి వెళ్లి నాన్న సంతకం చేశాడు ఇప్పుడు నువ్వు సంతకం చేయమ్మా అని అడుగుతుంది. లక్ష్మీ చేస్తుంది. ఇక జున్ను కూడా మిత్ర దగ్గరకు వెళ్లి సంతకం చేయమని అంటాడు. 


మనీషా: ఆయన మీ నాన్న కాదు. 
జున్ను: ఆ మాట నువ్వు కాదు నాన్న చెప్పాలి.
మనీషా: చెప్పు మిత్ర నువ్వు తన తండ్రి కాదు అని.
జున్ను: నువ్వు మా నాన్నవే కదా నాన్న. సంతకం పెట్టు నాన్న.
మిత్ర: ఇన్నాళ్లు ఎవరు సంతకం పెట్టారో వాళ్లతోనే చేయించుకో.
జున్ను: ఇప్పటి వరకు అమ్మే చేసింది ఇప్పుడు మీరు చేయండి నాన్న.
మిత్ర: మీ అమ్మతోనే చేయించుకో.
జున్ను: మీరు ఎప్పుడూ నా కోసం సంతకం చేయలేదు నాన్న.
మనీషా: ఎప్పటికీ చేయడు ఎందుకంటే ఇతను మీ నాన్న కాదు ఒకసారి చెప్తే అర్థం కాదా నీకు ఎందుకు బెగ్గర్ లా నిల్చొన్నావ్ అవుట్.


మిత్ర ఫీలవుతాడు కానీ బయట పడడు. జున్ను బాధ పడతాడు. జున్ను డల్‌గా కిందకి వెళ్లే లక్ష్మీ చూస్తుంది. లక్ష్మీ కూడా విషయం తెలుసుకొని బాధ పడుతుంది. మనీషా వచ్చి లక్ష్మీతో నువ్వు తన భార్యవి కానప్పుడు నీ కొడుకు జున్ను మిత్ర కొడుకు ఎలా అవుతాడు అంటుంది. దాంతో జున్ను ఫీలై బయటకు వెళ్లిపోతాడు. లక్ష్మీకి లిమిట్స్ ఉండమని వార్నింగ్ ఇచ్చి మనీషా వెళ్లిపోతుంది. జున్ను గదిలో జరిగిందంతా తలచుకొని ఏడుస్తాడు. లక్ష్మీ జున్నుని ఓదార్చుతుంది. కానీ జున్ను చాలా ఏడుస్తాడు. నేను ఎప్పుడు నాన్న కొడుకుని అవుతాను అని ఏడుస్తాడు. జున్ను మాటలకు అరవింద, జయదేవ్ కూడా ఫీలవుతారు. నాన్న సంతకం లేకుండా స్కూల్‌కి వెళ్తే అందరూ ఎగతాళి చేస్తారని నాన్న లేని వాడిని అయిపోతానని ఏడుస్తాడు. ఎప్పటికీ నాన్న లేని వాడిలా ఉండిపోవాలా అని నాన్నకి నేను కొడుకు అవ్వలేనా అని జున్ను ప్రశ్నలకు లక్ష్మీ కూడా ఏడుస్తుంది. 


రేపే జున్ను మిత్ర కొడుకు కాదని నిరూపిస్తానని మనీషా అంటుంది. కాస్త టైం తీసుకో అని దేవయాని అంటుంది. లేట్ చేస్తే జున్నుకి మిత్ర దగ్గరైపోతాడని లక్ష్మీ కూడా దగ్గరైపోతుందని మనీషా అంటుంది. ఇక దేవయాని ఇలా చేయడం వల్ల లక్ష్మీ అయినా నువ్వు అయినా ఎవరో ఒకరు మిత్రకు దూరం అయిపోతారని అంటుంది. ఏది ఏమైనా తాను అనుకున్నది తాను చేస్తానని మనీషా అంటుంది. అందరూ లక్ష్మీ వైపే ఉన్నారు కాబట్టి కాస్త తొందర పడాలని మనీషా అంటుంది. పిల్లల వల్లే మిత్ర, లక్ష్మీలు కలిసిపోయేలా ఉన్నారని రేపే దీనికి చెక్ పెట్టాలని ఇద్దరూ అనుకుంటారు. ఇక ఉదయం లక్ష్మీ, జాను, అరవింద, జయదేవ్ అందరూ హడావుడిగా కంగారు పడుతుంటారు. ఏమైందా అని మిత్ర, మనీషా, దేవయాని అనుకుంటారు.


లక్కీ కనిపిస్తే ఏమైందని మిత్ర అడిగితే జున్నుకి జ్వరం వచ్చిందని అంటుంది. సంతకం చేయకపోవడం వల్ల అంతా మీ వల్లే ఇలా అయిందని అందరూ అనుకుంటారు. లక్కీ కూడా తండ్రికి సంతకం చేసుంటే బాగుండేదని అంటుంది. జున్ను ఏడ్చి ఏడ్చి జ్వరం తెచ్చుకున్నాడని లక్కీ చెప్తుంది. ఇక జున్ను నాన్న అని కలవరిస్తాడు. మిత్ర ఆలోచనలో పడతాడు. తప్పు చేశావ్ నాన్న అని లక్కీ తండ్రిని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.  


Also Read: 'త్రినయని' సీరియల్: ఇంట్లో ఇద్దరు విశాల్‌లు అందరి ఫ్యూజులు అవుట్.. గాయత్రీ నువ్ సూపర్ తల్లీ!