chiranjeevi lakshmi sowbhagyavathi serial today episode: వివేక్, జానులు లక్ష్మిని కలవడానికి గుడికి బయల్దేరుతారు. దీక్షితులు గారు లక్ష్మీతో మిత్ర నీతో అడుగడుగునా చేయి కలిపి దీక్షని పరిపూర్ణం చేశాడని మాట్లాడుతూ ఉంటారు. ఇంతలో జాను వచ్చి అక్కా అని పిలుస్తుంది. లక్ష్మీ వెనక్కి తిరిగి చూస్తుంది. లక్ష్మీని జాను హగ్ చేసుకొని ఏడుస్తుంది. లక్ష్మీ కూడా ఎమోషనల్ అయిపోతుంది.


జాను: నువ్వు చనిపోయావు అనుకొని నేను ఇన్నాళ్లు ఎంత విలవిల్లాడిపోయానో తెలుసా అక్క.
లక్ష్మీ: నాకు తెలుసు జాను. నేను వెళ్లిపోయాక నువ్వు ఎంత విలవిల్లాడిపోయావో నాకు తెలుసు. ఎందుకంటే ప్రతీక్షణం నేను గమనిస్తూనే ఉన్నాను. నీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసుకుంటూనే ఉన్నాను జాను. 
జాను: నువ్వు ఏమంటున్నావో నాకు అర్థం కాలేదు అక్క.
లక్ష్మీ: నేను ఇంటికి వచ్చాను జాను అంటూ గతంలో జరిగింది చెప్తుంది. 
వివేక్: వదిన నువ్వు ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్లిపోయావ్. ఏమైపోయావ్. అసలు నువ్వు ఎందుకు మమల్ని వదిలి వెళ్లిపోయావ్.
లక్ష్మీ: దానికి ఓ కారణం ఉంది. 
జాను: ఏంటి అక్క అది.
లక్ష్మీ: మనీషా. అంటూ మనీషా గతంలో చేసిన కుట్ర చెప్తుంది. అత్తయ్యని రక్షించడానికి నాకు మరోదారి లేక మనీషా మాట వినాల్సి వచ్చింది. అందరికీ దూరం అవ్వాల్సి వచ్చింది.
జాను: ఆ మనీషా ఇంత చేసిందా. 
వివేక్: అవును జాను మనీషా కుట్ర ప్రవీణ్ మిట్టల్ ద్వారా పెద్దమ్మకు తెలిస్తే పెద్దమ్మ నాకు చెప్పింది. ప్రత్యక్షంగానో పరోక్షంగానో మనీషా వాళ్ల అమ్మ చనిపోయిందని పెద్దమ్మ నమ్ముతుంది. అదీ కాక మనీషా, మిత్రలు గతంలో ప్రేమించుకున్నారు. కదా అందుకే మిత్ర మనీషాని పెళ్లి చేసుకుంటాను అంటే ఆ పెళ్లి చేసి పెద్దమ్మ కాస్త ప్రయశ్చిత్తం చేయాలని చూస్తుంది. 
లక్ష్మీ: మిత్ర జున్ను గారి రక్తం పంచుకొని పుట్టిన బిడ్డ. 
జాను: ఇప్పుడు నువ్వు బతికున్నావ్ అని కానీ జున్ను నీ బిడ్డ అని కానీ తెలిస్తే చాలా సంతోషిస్తారు. వెంటనే వెళ్దాం పద అక్క.
లక్ష్మీ: వద్దు జాను. మీ అందరికీ నేను ఎదురు పడాలి అంతే ఇంత కాలం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. నేను బతికున్నాను అని తెలిస్తే మనీషా కుట్ర చేస్తుంది. అత్తయ్య గారి వల్లే మనీషా అమ్మ చనిపోయిందని పోలీస్‌లకు చెప్పి అరెస్ట్ చేయిస్తుంది. అప్పుడు నేను చేసింది వృథా అయిపోతుంది. నా గురించి ఎవరికీ తెలీకూడదు. మీరు ఈ విషయం ఎవరికైనా చెప్తే నా మీద ఒట్టే. 
దీక్షితులు: అమ్మా లక్ష్మీ.. ఈ హోమంలోని విబూది నువ్వు మిత్ర నుదిటిన బొట్టు పెట్టాలి. కంకణం కట్టాలి. అప్పుడే దీక్ష పరిపూర్ణం అవుతుంది. 


మనీషా దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది. దేవయాని వచ్చి ఏమైందని అడుగుతుంది. మిత్ర ఎవరో అమ్మాయి గురించి ఆలోచిస్తున్నాడు కానీ తన గురించి ఆలోచించడం లేదని బాధ పడుతుంది. తాను ఓ నిర్ణయానికి వచ్చానని దేవయానికి చెప్తుంది. ఏంటని అడిగితే అర్జెంట్‌గా వివేక్ పెళ్లి ఏర్పాట్లు చేయమని అంటుంది. మిత్రకు వివేక్‌కి పెళ్లి జరిగే టైంలోనే మిత్ర కూడా తనని తాళి కట్టేలా చేస్తానని అంటుంది. అందుకు దేవయాని మనీషాకు సపోర్ట్ చేస్తానని అంటుంది. లక్ష్మీని తీసుకొని జాను, వివేక్‌లు మిత్ర ఇంటికి వస్తారు. అందరూ పడుకొని ఉంటారు కాబట్టి మిత్రకు బొట్టు పెట్టి కంకణం కట్టాలని అనుకుంటుంది. దొంగ చాటుగా వెళ్లాలని అనుకుంటుంది. ఇక జాను ఈ టైంలో ఇక్కడుంటడం మంచిది కాదు అని జానుని పంపేయ్‌ మని చెప్తుంది. ఇక వివేక్ లక్ష్మీని బయటే ఉండమని ఎవరూ లేకపోతే చెప్తానని అంటాడు. ఎవరూ లేరని వివేక్ అనుకుంటే దేవయాని వచ్చేస్తుంది.  వివేక్‌కి తిట్టి భోజనం తెస్తానని అంటుంది. ఇంతలో వివేక్ పవర్ కట్ చేస్తానని ఈలోపు తన పని పూర్తి చేయమని లక్ష్మీతో వివేక్ చెప్తాడు. లక్ష్మీ పరుగులు తీస్తుంది. అది దేవయాని చూస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.   


Also Read: సత్యభామ సీరియల్: సత్య చేసిన తింగరి పనికి కడుపు పట్టుకొని పరుగులు తీసిన క్రిష్.. భార్య అనుకొని పనిమనిషితో..!