chiranjeevi lakshmi sowbhagyavathi serial today episode: తన తల్లి ఎవర్ని చూపిస్తే తనని పెళ్లి చేసుకుంటానని తన కోసం ఎదురు చూసి టైం వెస్ట్ చేసుకోవద్దని వివేక్ జానుకి దేవయాని, మనీషాల ఎదురుగా చెప్పి వెళ్లిపోతాడు. ఇక దేవయాని కూడా తన కొడుకుని తన మాట వినేలా పెంచానని జానుని అవమానిస్తుంది. మనీషా మాత్రం మనసులో.. అందరూ వింతగా ప్రవర్తిస్తున్నారని ఏదో తేడా కొడుతుందని అనుకుంటుంది.


సంయుక్తగా లక్ష్మీ మిత్ర ఇంటికి వస్తుంది. జాను మిత్ర అందరూ బయటకు వెళ్తారు. సంయుక్తని తీసుకొస్తారు. అరవింద గుమ్మం దగ్గర సంయుక్తని ఆపి హారతి ఇచ్చాక లోపలికి రమ్మని చెప్తుంది. ఇక తన కోడలు కూడా అచ్చం నీలాగే  ఉంటుందని అరవింద సంయుక్తతో చెప్తుంది. లక్ష్మీని పొడుగుతుంది. మిత్ర కోపంతో ఉన్నా, లక్ష్మీ సంతోషపడుతుంది. మనీషా, దేవయానిలు ముఖం మాడ్చుకుంటారు. ఇక సంయుక్త మీ కోడలిని చూడొచ్చా అని  అంటుంది. దాంతో అరవింద ఇప్పుడు తన కోడలిని చూపించే అవకాశం లేదని అంటుంది. దేవయాని మాత్రం లక్ష్మీ చనిపోయిందని నిట్టూర్పుగా మాట్లాడుతుంది. నిన్ను చూస్తుంటే మా కోడలు గుర్తొస్తుందని అరవింద అంటే.. దానికి సంయుక్త ఇప్పుడు నన్ను మీ కోడలు అనుకోండి అంటుంది. అందరూ షాక్ అయిపోతారు. సంయుక్త కవర్ చేస్తుంది. ఇక మనీషా మాట్లాడగా తను ఎవరు అని సంయుక్త అంటుంది. దాంతో మిత్ర మనీషా నీకు తెలీదా తను నీ క్లాస్ మేట్ కదా తెలీకపోవడం ఏంటి అని అడుగుతుంది. మనీషా కవర్ చేస్తుంది. సంయుక్త  కూడా మనీషా తెలిసినట్లు మాట్లాడి ఇరికిస్తుంది. ఇక హరతి తనకు దేవయాని ఇవ్వాలని సంయుక్త అంటుంది. ఈ హారతి ఇవ్వడం వల్ల మన ఇద్దరి మధ్య క్లోజ్ నెస్ పెరుగుతుందని అంటుంది. ఇక సంయుక్త తన పక్కకు మిత్రని పిలుస్తుంది. ఇద్దరికీ కలిపి హారతి ఇవ్వమని అంటుంది. కొడుకు కోడలు కలిసి ఇంట్లో అడుగుపెట్టే ఎక్స్‌పీరియన్స్ కోసం ఇలా చేస్తున్నాను అని అంటుంది. సంయుక్త మాత్రం మిత్రను చూస్తూ హ్యాపీగా ఫీలవుతుంది. తర్వాత మిత్ర చేయి పట్టుకొని కుడి కాలు లోపల పెట్టి ఇంట్లోకి వెళ్తుంది.


సంయుక్త ప్రవర్తనకు మనీషా రగిలిపోతుంది. ఇక ఆ ఇంట్లో లక్కీని చూసి సంయుక్త అలా చూస్తూ ఉండిపోతుంది. సంయుక్త టెన్షన్ పడటం మనీషా గమనిస్తుంది. లక్కీ సంయుక్త దగ్గరకు వచ్చి నిల్చొంటుంది. సంయుక్తని జున్ను తల్లి అని అందరికీ చెప్పేస్తుందేమో అని వివేక్ కంగారు పడతాడు. మిత్ర పాప దగ్గరకు వెళ్లి తను తన కూతురు అని పరిచయం చేస్తాడు. దాంతో లక్కీ మీరు నన్ను ఎప్పుడూ చూడలేదా అని అడుగుతుంది.  చూడలేదు అని సంయుక్త చెప్తుంది.


మనీషా: ఏంటి లక్కీ నువ్వు తినని ఎప్పుడైనా చూశావా.
జాను: దేవుడా ఇప్పుడు లక్కీ చూశాను అని చెప్తే నిజం అంతా బయట పడిపోతుంది.
లక్కీ: ఈవిడ నన్ను ఎప్పుడూ చూడలేదు అంటోంది కదా నేను కూడా చూడలేదు.
సంయుక్త: షాక్‌లో ఉన్న తన అక్క చేతిని జాను తట్టడంతో  తేరుకొని.. మీ అందరూ నాకు తెలుసా కానీ తిను ఎవరు.
మిత్ర: తను మా బంధువు. తనకి చెల్లి.
సంయుక్త: ఎవరికి చెల్లి.
మిత్ర: లక్ష్మీకి..
సంయుక్త: లక్ష్మీ ఎవరు.
మిత్ర: లక్ష్మీ నా భార్య.
సంయుక్త: లక్ష్మీకి చెల్లివా నువ్వు నువ్వు ఇక్కడే ఉంటావా.
జాను: లేదు అండీ మా బావని కలవడానికి వచ్చాను.
వివేక్: ఇక్కడి వరకు వచ్చి మొహమాటం ఎందుకు. తనకి జాబు లేదండి అందుకు అన్నయ్యకి చెప్పడానికి వచ్చింది.
సంయుక్త: అవునా మీరు ఎలాంటి జాబు చేస్తారు.
జాను: ఏదైనా ఓకే అండీ.
సంయుక్త: నాకు ఓ లేడీ పీఏ కావాలి. నువ్వు నాకు పీఏగా చేస్తావా.
మనీషా: అసలు ఇదంతా అనుకోకుండా జరుగుతుందా.. నాకు ఎందుకో ఇదంతా ప్లాన్ ప్రకారం జరుగుతున్నట్లుంది.
జాను: మీలాంటి వారు జాబ్ ఇస్తా అంటే అంత కంటే ఏం కావాలి అండీ.
సంయుక్త: ఇంకా అండీ ఎందుకు నన్ను అక్క అని పిలువు
జాను: అలాగే అక్క.
సంయుక్త: మీ అక్క నాలాగే ఉంటుంది కదా అందుకే అక్క అనమన్నా ఏం మనీషా నీకు ఏమైనా ప్రాబ్లమా


మనీషా సంయుక్తతో పెట్టుకోకూడదు అనుకుంటుంది. ఇక సంయుక్తని పైకి తీసుకెళ్లి చూపిస్తారు. మనీషా మాత్రం అనుమాన పడుతుంది. ఇక అర్జున్ వర్క్ చేసుకుంటుంటే జున్ను వచ్చి లక్కీ వాళ్ల ఇంటికి వెళ్తాను అంటాడు. అర్జున్ వద్దు అంటాడు. వసుంధర మాత్రం జున్నుని డ్రాప్‌ చేయమంటుంది. లక్ష్మీ చూసుకుంటుందని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.


Also Read: కార్తీకదీపం 2 సీరియల్: ముఖ్యమైన విషయం అందరితో చెప్తానన్న కార్తీక్.. దీప, జ్యోత్స్న, పారులు టెన్షన్‌తో పోయేలా ఉన్నారుగా!