Brahmamudi Serial Today Episode:   బోర్డు మీటింగ్‌ ఎందుకు ఏర్పాటు చేశారన్న రాజ్‌ మాటలకు కంపెనీ టర్నోవర్‌ తగ్గిపోయిందని అందుకోసం ఎండీని మార్చాలని డిసైడ్‌ అయ్యామని సిద్దార్థ్‌ చెప్తాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను ఎండీని కావాలని చెప్తాడు.

రాజ్: అదంతా నేను రాకముందు సిద్దార్థ్‌ ఇక నేను వచ్చేశాను కదా..? ఇక్కడ ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదు. మన స్వరాజ్‌ కంపెనీ ఇకపై లాభాలు చూస్తుంది. అందులో మీకు ఎటువంటి అనుమానాలు అవసరం లేదు

సిద్దార్థ్‌: కానీ నాకు ఉంది రాజ్‌ ఇక్కడ మనం నడుపుతుంది చారిటీ కాదు బిజినెస్‌.. ఇక్కడ అందరికీ టార్గెట్‌ ఒక్కటే అది నువ్వు తీసుకొస్తావన్న నమ్మకం లేదు.

రాజ్‌:  ఎందుకో తెలుసుకోవచ్చా..?

సిద్దార్థ్‌: చాలా రోజులుగా నువ్వు ఆఫీసుకు రావడం లేదు. నీకు హెల్త్‌ కండీషన్‌ కూడా బాగా లేదని నాకు ఇంటర్నల్‌ గా తెలిసింది. ఇలాంటి సమయంలో నువ్వు ఆ పదవిలో ఉండటం కరెక్టు కాదని ఇది అందరి అభిప్రాయం

రాజ్‌: ఇది అందరి అభిప్రాయమా..? లేక నీ ఒక్కడిదా

సిద్దార్థ్‌: ఎవరిదైతే ఏముంది. నువ్వు ముందులా సక్సెస్‌ఫుల్‌గా కంపెనీని నడిపించగలవని నమ్మకం ఏంటి..? నిన్ను నమ్మి మేము అందరం మీ వెంట ఎందుకు నడవాలి. నువ్వు ముందులాగా తిరిగి లాభాలు తీసుకొస్తావన్న గ్యారంటీ ఏంటి..? సరే అవన్నీ పక్కనపెట్టు. గతంలో జరిగిన డీల్స్‌ గురించి నీకేమైనా తెలుసా..? ఇప్పటి వరకు మనం ఎంత టర్నోవర్‌ చేశామో ఐడియా ఉందా..? కనీసం మన క్లయింట్స్‌ ఎవరో నీకు గుర్తు ఉందా..?

 స్వరాజ్‌ కంపెనీ హిస్టరీ చెప్తాడు రాజ్‌.

సిద్దార్థ్‌: ఇదంతా రెండో తరగతి పిల్లాడికి నేర్పించినా చెప్పేస్తాడు.. అందులో ఏముంది

రాజ్‌: నేను ఎండీగా చార్జ్‌ తీసుకున్న తర్వాత ఇప్పటి వరకు 128 డీల్స్‌ చేశాను. అందులో అమెరికా నుంచి పందొమిది,  ఇంగ్లాండ్‌ నుంచి 32, మలేషియా నుంచి 28, ఇంకా శ్రీలంక లాంటి దేశాల నుంచి చిన్న చిన్న డీల్స్‌ చేసి 25శాతం ఉన్న లాభాలను 42 శాతానికి తీసుకొచ్చాను. ఇది కూడా నేర్పిస్తే రెండో క్లాస్‌ పిల్లాడు కూడా చెప్పగలడు. కానీ కంపెనీ ఎండీ మాత్రమే చెప్పగలిగే విషయం నీకు చెప్పనా..?  

సిద్దార్థ్‌:  ఏంటది.. చెప్పు..

రాజ్‌: 2018 అంటే మీ నాన్న గారు బోర్డు మెంబర్‌గా ఉన్నప్పుడు జింబాబ్వే నుంచి ఇల్లీగల్‌గా గోల్డ్‌ తీసుకొచ్చి మన కంపెనీలో పెట్టడానికి ట్రై చేశారు. ఆ విషయం తెలిసి నేను తనను బోర్డు మెంబర్‌గా తీసేయాలంటే మీ నాన్న వెళ్లి మా తాతయ్య కాళ్లు పట్టుకుంటే తిరిగి బోర్డు మెంబర్‌గా తీసుకున్నాము.. అదే ప్లేస్‌లో ఇప్పుడు నువ్వు కంటిన్యూ అవుతున్నావు.. ఇప్పటి వరకు ఈ విషయం నలుగురికి మాత్రమే తెలుసు నీకు మీ నాన్న గారికి నాకు మా తాత గారికి. మరి ఈ విషయాన్ని రెండో క్లాస్‌ పిల్లాడు చెప్పగలడా..?

అందరూ షాకింగ్‌ గా చూస్తుంటారు.

శృతి: మన సార్‌ వాడి గాలి మొత్తం తీసేశాడు

కావ్య: ఈ విషయం నాకు కూడా తెలియదు మరి ఈయనకు ఎలా తెలిసింది

రాజ్‌: ఇక నీ సంగతికి వస్తే.. నువ్వు కూడా మీ నాన్న గారి దారిలోనే నడుస్తున్నావు. నువ్వు తీసుకొచ్చిన 500 కోట్ల ప్రాజెక్ట్‌ ఫైల్‌ మొత్తం చదివాను. నువ్వు చెప్తున్న కంపెనీ అసలు లేనే లేదు. అది ఒక బోగస్‌ కంపెనీ కేవలం పేపర్స్‌ మీద మాత్రమే ఉంది. ఫేక్‌ లెక్కలు చూపించి కంపెనీ లాభాల్లో నడుస్తుందని వీళ్లందరినీ నమ్మించి మోసం చేస్తున్నావు

బోర్డు మెంబర్‌: ఎంటి సిద్దార్థ్‌ గారు మమ్మల్ని మోసం చేయాలనుకుంటున్నారా..?

రాజ్‌: మిమ్మల్ని కాదు కళావతి గారిని మాత్రమే మోసం చేయాలనుకున్నారు. తనను బాధ్యతల నుంచి తప్పించాలని ఇదంతా ప్లాన్‌ చేశాడు. కరెక్టేనా సిద్దార్థ్‌

బోర్డు మెంబర్‌: రాజు గారు అడుగుతుంటే మాట్లాడరేంటి..? నిజం చెప్పండి.. మేడం గారిని తప్పించి మీరు ఎండీ అవ్వాలనుకున్నారా..?

సిద్దార్థ్‌:  నేను తీసుకొచ్చిన ప్రాజెక్టు ఒక మీడియేటర్‌ ద్వారా వచ్చింది. అంతేకానీ ఆ కంపెనీ గురించి నాకు ఎటువంటి డీటెయిల్స్‌ తెలియవు

అంటూ సిద్దార్థ్‌ తప్పించుకుంటాడు. రాజ్‌నే ఎండీ ఉండమని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆఫీసులో జరిగిన విషయం బోర్డు మెంబర్‌ ద్వారా తెలుసుకున్న సుభాష్‌ ఇంట్లో వాళ్లకు చెప్పి హ్యాపీగా ఫీలవుతాడు. రుద్రాణి, రాహుల్ మాత్రం బాధపడతారు. తర్వాత యామిని కావ్యకు ఫోన్‌ చేసి అప్పు అరెస్ట్‌ అయిన విషయం చెప్తుంది. తానే ప్లాన్‌ ప్రకారం చేశానని బెదిరిస్తుంది. దీంతో కావ్య డైలమాలో పడిపోతుంది. ఎమోషనల్ ఆపుకోలేక రాజ్ ను హగ్‌ చేసుకుంటుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!