ఓటీటీలో 'మంచి రోజులు వచ్చాయి': 


యంగ్ హీరో సంతోష్ శోభన్, మెహ్రీన్ జంటగా నటించిన సినిమా 'మంచి రోజులు వచ్చాయి'. దర్శకుడు మారుతి ఈ సినిమాను రూపొందించారు. ఇటీవల థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకి మంచి టాక్ వచ్చింది. కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా త్వరలోనే ఓటీటీలో విడుదల కానుంది. ప్రముఖ డిజిటల్ ఫ్లాట్ ఫామ్ 'ఆహా'లో డిసెంబర్ 3 నుంచి స్ట్రీమింగ్ కానుంది. యూవీ కాన్సెప్ట్స్, మాస్ మూవీ మేకర్స్ సంస్థలు నిర్మించిన ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. 







వరద బాధితులకు గీతాఆర్ట్స్ సాయం..   


కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ ని వరదలు ముంచెత్తుతున్నాయి. నెల్లూరు, తిరుపతి ప్రాంతాల్లో వరద ఉధృతికి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో వరద బాధితులను ఆదుకోవడం కోసం చాలా మంది ముందుకొస్తున్నారు. తాజాగా టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ గీతాఆర్ట్స్ తిరుపతి వరద బాధితులకు తమ వంతు సహాయం అందించింది. రూ.10 లక్షలను ఆంధ్రప్రదేశ్ సీఎం రిలీఫ్ ఫండ్ కి డొనేట్ చేసింది. ఈ విషయాన్ని గీతాఆర్ట్స్ ట్విట్టర్ వేదికగా ప్రకటించింది.