Actor Sasikumar About His Financial Problems: తమిళ నటుడు శశి కుమార్ తొలిసారి తన ఆర్థిక ఇబ్బందుల గురించి కీలక విషయాలు వెల్లడించారు. కోలీవుడ్ లో నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన, ఆర్థికంగా ఇప్పటికే కష్టాల్లోనే ఉన్నట్లు చెప్పారు. గత ఏడాది వరకు అప్పులు తీర్చేందుకే సినిమాల్లో హీరోగా నటించినట్లు వెల్లడించారు. ప్రస్తుతం అప్పుల బాధల్లో నుంచి కోలుకుంటున్నానని చెప్పారు.  


ఇకపై దర్శకత్వం మీద కాన్సంట్రేట్ చేస్తా- శశి కుమార్


శశి కుమార్ హీరోగా తాజాగా ‘నందన్‌’ అనే సినిమా తెరకెక్కింది. ఎరా శరవణన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా శశి ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగానే ఆయన తన ఆర్థిక ఇబ్బందుల గురించి చెప్పుకొచ్చారు. "నాకు చాలా అప్పులు ఉన్నాయి. గత సంవత్సరం వరకు నేను ఆ అప్పులు తీర్చడం కోసమే సినిమాల్లో నటించాను. ఇప్పుడిప్పుడే అప్పుల బాధల నుంచి బయటపడుతున్నాను. ఇకపై దర్శకత్వం మీద దృష్టిపెట్టాలి అనుకుంటున్నాను” అని చెప్పుకొచ్చారు.    






తెలుగు సినిమాలతోనూ అనుబంధం


శశి కుమార్ తమిళ సినిమా పరిశ్రమలో నటుడుగా, దర్శకుడిగా, నిర్మాతగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తమిళంలో ఆయన పలు సూపర్ హిట్ సినిమాలు చేశారు. కలర్స్ స్వాతి నటించిన ‘సుబ్రహ్మణ్యపురం’ సినిమాలో ఆయనే ఓ హీరో. దర్శక నిర్మాత కూడా ఆయనే. ఈ సినిమా తెలుగులో  తెలుగులో ‘అనంతపురం’ పేరుతో విడుదల అయింది. ఇక తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ‘శంభో శివ శంభో’ తమిళ ఒరిజినల్ వెర్షన్ లో ఆయనే హీరోగా నటించారు. తమిళంలో ‘నాడోడిగల్’ పేరుతో తెరకెక్కిన ఈ సినిమాలో ఆయన చేసిన క్యారెక్టర్ ను తెలుగులో రవితేజ చేశారు. అంతేకాదు, ‘శంభో శివ శంభో’ సినిమాలో స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చి ఆకట్టుకున్నారు. 2009లో విడుదలైన ‘నాడోడిగల్’కు సముద్రఖని దర్శకత్వం వహించగా మైఖేల్ రాయప్పన్ నిర్మించారు. తెలుగులోనూ ఈ సినిమాకు సముద్రఖనే దర్శకత్వం వహించారు. 


త్వరలో ప్రేక్షకుల ముందుకురానున్న ‘నందన్‌’


ఇక శశి కుమార్ హీరోగా, ఎరా శరవణన్ దర్శకత్వంలో తాజాగా ‘నందన్’ అనే సినిమా తెరకెక్కింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఆడియో రిలీజ్ వేడుకను చెన్నైలో అట్టహాసంగా నిర్వహించారు. ఈ వేడుకలో హీరో శశి కుమార్ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తొలుత ఈ సినిమాను తానే నిర్మించాలనుకున్నట్లు చెప్పారు. ఆ తర్వాత అథితి పాత్రలో కనిపించాలినుకున్నానన్నారు. కానీ, చివరకు ఈ సినిమాలో పూర్తి స్థాయిలో హీరోగా నటించాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. ఈ మూవీ కథ అద్భుతంగా ఉందన్న ఆయన, సినిమా ఇంకా బాగా వచ్చిందన్నారు. షూటింగ్ సమయంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నా, ఎక్కడా తలవంచుకుండా తెరకెక్కించినట్లు చెప్పారు. ఇక ఈ సినిమాలో శృతి పెరియస్వామి, మాధేష్‌, మిథున్‌, బాలాజీ శక్తివేల్‌, కొట్ట ఎరుంబు స్టాలిన్‌, సముద్రఖని, వి.ఙ్ఞానవేల్‌, జీఎం కుమార్‌ ఇతర పాత్రలో కనిపించారు. ట్రైడెంట్‌ ఆర్ట్స్‌ పతాకం, ఎరా ఎంటర్‌టైన్మెంట్స్‌ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకురానుంది. 


Also Read: ఫ్యాన్స్‌కి కిక్‌ ఇచ్చే అప్‌డేట్‌ ఇచ్చిన రామ్‌ చరణ్‌ - బీస్ట్‌ మోడ్‌లో గ్లోబల్‌ స్టార్‌, ఆర్‌సీ 16 లోడింగ్‌...