అజిత్ కుమార్ తమిళనాడులో అభిమానులెక్కువ. తెలుగులో కూడా ఆయనకు ఫ్యాన్ బేస్ ఉంది. ఆయన ఓపక్క సినిమా షూటింగ్ లలో పాల్గొంటూనే మరో పక్క పతకాల వేట మొదలుపెట్టారు. పిస్టల్ షూటింగ్ పోటీలలో పాల్గొంటున్నారు. ప్రస్తుతం తిరుచ్చిలో జరుగుతున్న రాష్ట్ర స్టాయి షూటింగ్ ఛాంపియన్ షిష్ లో పాల్గొన్నారు. అజిత్ తో పాటూ అతటి టీమ్ ఈ పోటీలలో పాల్గొంది. ఈ పోటీలో అజిత్ అండ్ కో నాలుగు పతకాలు సొంతం చేసుకుంది. 50 ఏళ్ల వయసులోనూ అతనిలోని ఉత్సాహం, గెలవాలన్న తపన, షూటింగ్లో రాణించడం అతని అభిమానులకు ఆనందాన్ని కలిగిస్తుంది. అజిత్ చాలా సినిమాల్లో పోలీస్ ఆఫీసర్ పాత్రల్లో కనిపించారు. అందులో తుపాకీ షూట్ చేస్తూ కనిపించారు. నిజజీవితంలో కూడా ఆయన షూటింగ్లో తను తోపనే నిరూపించుకున్నారు. 


47వ తమిళనాడు రాష్ట్ర షూటింగ్ ఛాంపియన్ పోటీలు జూలై 24 నుంచి 31 వరకు జరిగాయి. అజిత్ తన టీమ్‌తో కలిసి నాలుగు విభాగాల్లో పోటీ చేసి నాలుగు పతకాలు గెలిచారు. ఇప్పుడిదే వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆయన పిస్టల్ షూట్ చేస్తున్న ఫోటోలు కూడా చక్కర్లు కొడుతున్నాయి. 50m FP పురుషుల జట్టు, స్టాండర్డ్ పిస్టల్ పురుషుల జట్టు విభాగాల్లోనూ, CFP మాస్టర్ పురుషుల జట్టు విభాగంలో అజిత్ పోటీ చేశారు. 


అజిత్ చివరగా వాలిమై సినిమాలో కనిపించారు. అందులో ఆయన పవర్ ఫుల్ ఆఫీసర్ గా కనిపించారు. ఇక టాలీవుడ్ మీరో కార్తికేయ విలన్ గా నటించారు. ప్రస్తుతం పిస్టల్ షూటింగ్ పోటీల్లో బిజీగా ఉన్నాడు అజిత్.