టాలీవుడ్ దిగ్గజ దర్శుకుడు రాజమౌళి మరో అరుదైన ఘనత సాధించారు. ‘బాహుబలి’ లాంటి సినిమాతో తెలుగు సినిమా సత్తాను దేశవ్యాప్తంగా చాటిచెప్పారు. ఇక ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో ఇండియన్ సినిమాను అంతర్జాతీయ వేదికపై నిలబెట్టారు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు రావడమే కాదు ఎన్నో ఇంటర్నేషనల్ అవార్డులను అందుకుందీ మూవీ. అంతే కాదు ఈ సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ అవార్డు రావడంతో ఈ సినిమా పేరు కొన్ని నెలలు పాటు ప్రపంచ వ్యాప్తంగా మారుమోగిపోయింది. దర్శకుడు రాజమౌళికి అంతర్జాతీయంగా ప్రశంసలు దక్కాయి. అయితే ఇప్పుడు రాజమౌళి మరో ఘనత సాధించారు. టైమ్స్ మ్యాగిజైన్ ప్రకటించిన ‘టాప్‌-100 వరల్డ్‌ ఇన్ల్ఫూయెన్షిల్‌ పీపుల్‌’ జాబితాలో రాజమౌళికి చోటు దక్కింది. ఇది తెలుగు వారంతా హర్షించదగ్గ విషయం. రాజమౌళికి ఇలాంటి ఘనత దక్కడంతో మరోసారి ప్రపంచం చూపు టాలీవుడ్ పై పడింది. 


ప్రస్తుతం రాజమౌళికి మరోసారి ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు అందుతున్నాయి. రాజమౌళితో పాటు ఇండియాకు సంబంధించిన పలువురు సెలబ్రెటీలు కూడా ఈ టాప్ 100 లిస్ట్ లో చోటుదక్కించుకున్నారు. అందులో ప్రముఖ బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ కూడా ఉన్నారు. అలాగే ప్రముఖ రచయిత సల్మాన్‌ రష్దీ, న్యాయనిర్ణేత పద్మలక్ష్మీ భారత్‌ నుంచి ఈ జాబితాలో ఉన్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, కింగ్‌ చార్లెస్‌, ఎలాన్‌ మస్క్‌, సాకర్‌ దిగ్గజం లియోనెల్‌ మెస్సీ తదితర ప్రముఖులు కూడా ఈ లిస్ట్ లో ఉన్నారు. రాజమౌళికి ఇలాంటి ఘనత దక్కడంతో బాలీవుడ్ నటి అలియా భట్ రాజమౌళి గురించి చెప్పుకొచ్చింది. భిన్న సంస్కృతులు ఉన్న ఈ సువిశాల భారతదేశాన్ని ఒక్క సనిమాతో ఒక్కటి చేసి చూపించారని రాజమౌళి గురించి వివరించింది అలియా. అటు షారుఖ్ ఖాన్ కు కూడా బాలీవుడ్ నుంచి ప్రశంసలు అందుతున్నాయి. ఆయనతో కలసి ఇటీలవ ‘పఠాన్’ సినిమాలో నటించిన దీపికా పదుకోణ్ షారుఖ్ ను ప్రశంసలతో ముంచెత్తింది. పలువురు సినీ ప్రముఖులు కూడా వీరికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 


2023 ఏడాదికి గానూ టైమ్స్ నిర్వహించిన ఈ పోలో లో ఓ తెలుగు దర్శకుడు చోటు దక్కించకోవడం ఇదే మొదటిసారి కావడం విశేషం. దీంతో రాజమౌళి పేరు మరోసారి ప్రపంచ వ్యాప్తంగా మారుమోగిపోతుంది. ఆయనకు ప్రశంసల వర్షం కురుస్తోంది. ‘బాహుబలి’ సినిమాతోనే రాజమౌళి కెపాసిటీ ఎంటో ప్రపంచానికి అర్దమైంది. ఇక ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో దాన్ని ప్రపంచ వ్యాప్తంగా నిరూపించుకున్నారు రాజమౌళి. ఈ సినిమాతో ఆయనకు అంతర్జాతీయంగా అభిమానులు ఏర్పడ్డారు. ఇక నుంచి ఆయన తీసే సినిమాలు కూడా అదే రేంజ్ లో ఉంటాయని టాక్ నడుస్తోంది. ‘ఆర్ఆర్ఆర్’ లాంటి ఇంటర్నేషనల్ హిట్ తర్వాత రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమాను చేస్తున్నారు. మొదట ఈ సినిమాను ఒక భాగంలోనే తీయాలని అనుకున్నారు. అయితే ‘ఆర్ఆర్ఆర్’ తో రాజమౌళి క్రేజ్ పెరిగిపోవడంతో అందులో మార్పులు చేసి భారీ స్థాయిలో సినిమాను తెరకెక్కించాలని నిర్ణయించారు. దీంతో ఈ మూవీను మూడు పార్ట్ లుగా తెరకెక్కించనున్నారని తెలుస్తోంది. మరి ఈసారి రాజమౌళి ఎలాంటి రికార్డులు సృష్టిస్తారో చూడాలి.