అల్లు శిరీష్(Allu Sirish) హీరోగా నటించిన 'ఎబిసిడి' సినిమా మే, 2019లో విడుదలైంది. ఆ తర్వాత థియేటర్లలోకి మరో సినిమాతో రాలేదు. కరోనా కారణంగా ప్రతి సినిమా విడుదల వాయిదా పడిన సంగతి తెలిసిందే. అలా శిరీష్ జర్నీకి కొవిడ్ బ్రేకులు వేసింది. 'ఎబిసిడి' సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. అయితే, అల్లు శిరీష్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఆ సినిమా విడుదలైన మూడేళ్లకు మరో సినిమాతో ఎంటర్టైన్ చేయడానికి రెడీ అవుతున్నారు. 


Sirish and Anu’s film titled Urvasivo Rakshasivo: అల్లు శిరీష్, అనూ ఇమ్మాన్యుయేల్ జంటగా జీఏ 2 పిక్చర్స్ సంస్థ ఒక సినిమాను రూపొందించింది. ఆ మధ్య ఫస్ట్ లుక్ ని కూడా విడుదల చేశారు. 'ప్రేమ కాదంట' (Prema Kadanta Movie) టైటిల్‌తో వచ్చిన ఆ సినిమాకు రాకేశ్ శశి దర్శకుడు. అయితే ఇప్పుడు ఈ సినిమా టైటిల్ మార్చినట్లు తెలుస్తోంది. కొత్త టైటిల్ ఏంటంటే.. 'ఊర్వశివో రాక్షసివో'. 


కొత్త టైటిల్ తో రిలీజ్ చేసిన పోస్టర్ యూత్ ను ఆకర్షించేలా ఉంది. శిరీష్, అను ఇమ్మాన్యూల్ కెమిస్ట్రీ పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయిన ఫీల్ ను క్రియేట్ చేస్తుంది. పోస్టర్ చూస్తుంటే ఈ సినిమా యూత్‌పుల్ ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్ అని అర్ధమవుతుంది. ఈ సినిమా టీజర్ ను సెప్టెంబర్ 29న రిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది చిత్ర బృందం. అచ్చు రాజమణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. 


నవంబర్ 4న (Allu Sirish New Movie Release Date) ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు రానుంది. దానికి తగ్గట్లుగా ప్రమోషన్స్ షురూ చేస్తున్నారు. ఈ సినిమాతో పాటు సమంత 'శాకుంతలం' కూడా అదే రోజున రాబోతుంది. అయితే ఈ రెండు సినిమాలు డిఫరెంట్ జోనర్స్ కి చెందినవి. అల్లు శిరీష్ కి ఇప్పుడు సక్సెస్ చాలా ముఖ్యం. మరి తను ఆశిస్తున్నట్లుగా ఈ సినిమా హిట్ అవుతుందేమో చూడాలి. 


ఇక శిరీష్ కెరీర్ చూస్తే... 'గౌరవం' సినిమాతో తెలుగు చలన చిత్ర పరిశ్రమకు ఆయన కథానాయకుడిగా పరిచయం అయ్యారు. ఆ సినిమా తమిళంలో కూడా విడుదల అయ్యింది. 'కొత్త జంట', 'శ్రీరస్తు శుభమస్తు', 'ఒక్క క్షణం' వంటి విభిన్నమైన కథలను ఎంపిక చేసుకుని సినిమాలు చేస్తున్నారు. తన కంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నారు. మలయాళంలో మోహన్ లాల్‌తో '1971 : బియాండ్ బోర్డర్స్' సినిమా చేశారు.






Also read: రేవంత్ వల్లే ఎలిమినేట్ అయ్యాను, దమ్మున్న కంటెస్టెంట్స్ వాళ్లే - నేహా కామెంట్స్!


Also read: ఇంట్లో ఎవరు గాడిద? ఎవరు పాము? ఎవరు ఊసరవెల్లి? ఇదిగో మీరే చూడండి