Shobhita Dhulipalla : గత కొంతకాలం నుంచి టాలీవుడ్ హీరో నాగచైతన్య, హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల డేటింగ్ లో ఉన్నారంటూ సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరిగింది. స్టార్ హీరోయిన్ సమంతతో విడాకుల తర్వాత శోభిత, నాగ చైతన్యకు దగ్గరైందంటూ, వారిద్దరూ రిలేషన్ షిప్ లో ఉన్నారంటూ పలు కథనాలు కూడా వచ్చాయి. ఈ ప్రచారంపై తాజాగా శోభిత ధూళిపాళ్ల స్పందించారు. ఎవరో ఏదో అంటున్నారని దాన్ని పట్టించుకుని ఫీలైపోవాల్సిన అవసరం లేదని, ఆ రూమర్స్ తో తనకెలాంటి సంబంధం లేనప్పుడు, తాను ఏ తప్పూ చేయనప్పుడు క్లారిటీ ఇవ్వాల్సిన పనికూడా లేదని ఆమె తేల్చి చెప్పేశారు. ఈ ఆసక్తికరమైన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట్లో సందడి చేస్తున్నాయి.


వరుస సినిమాలతో బిజీ అయిన టాలీవుడ్ నాగచైతన్య, ఇప్పుడిప్పుడే సినీ ఇండస్ట్రీలో తన టాలెంట్ ను నిరూపించుకుంటున్న శోభిత ధూళిపాళ్ల కొద్ది కాలంగా డేటింగ్ ఉన్నారంటూ వార్తలు వచ్చాయి. ఓ సారి లండన్‌ వెకేషన్‌లో, మరోసారి రెస్టారెంట్‌లో వీరిద్దరూ జంటగా కనిపించడంతో ఆ రూమర్స్‌కు మరింత బలం చేకూరినట్టయింది. సమంతతో విడిపోయిన తర్వాత చైకి శోభిత దగ్గరైందని, అందుకే వీరిద్దరూ జంటగా షికార్లు చేస్తున్నారని పుకార్లు షికారు చేశాయి. ఈ నేపథ్యంలో తాజాగా శోభిత ఇచ్చిన క్లారిటీతో ఈ రూమర్స్ కి చెక్ పడినట్టయింది.


తనకు మంచి సినిమాల్లో నటించే అవకాశాలు వస్తున్నాయని శోభిత తెలిపారు. తనకు చిన్నప్పట్నుంచి డ్యాన్స్ అంటే ఇష్టమని, తాను క్లాసికల్ డ్యాన్సర్ అని చెప్పుకొచ్చారు. ఇటీవలే మణిరత్నం దర్శకత్వం వహించిన 'పొన్నియన్ సెల్వన్ 2'లో, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ తో 3,4 సాంగ్స్ చేయడం.. ఓ మర్చిపోలేని అద్భుత అనుభవమని ఆమె చెప్పారు. ఇన్ని స్పెషల్ మూమెంట్స్ ఉన్నపుడు, ఒకళ్లో, ఇద్దరో ఏదో తెలియకుండా మాట్లాడినంత మాత్రాన, అది పట్టించుకుని ఫీలైపోవాల్సినదేం లేదన్నారు. తనకేం సంబంధం లేనప్పుడు, తానేం తప్పు చేయనప్పుడు.. ఇలాంటి రూమర్స్ పై క్లారిటీ ఇవ్వాల్సి పని కూడా లేదని శోభిత వెల్లడించారు. ఏ తప్పూ చేయనప్పుడు కామ్ గా,ప్రశాంతంగా తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోతానని ఆమె స్పష్టం చేశారు. దీంతో వారిద్దరి మధ్య డేటింగ్ లాంటి ఎలాంటి సంబంధం లేదని తాజా వ్యాఖ్యలతో స్పష్టమైంది.


ఇక వెంకట్ ప్రభు డైరెక్షన్ లో హీరో నాగచైతన్య నటించిన లేటెస్ట్ చిత్రం 'కస్టడీ' మే 12న ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో రిలీజ్ కానుంది. కృతి శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు ఇళయరాజా, యువన్ శంకర్ రాజా స్వరాలు సమకుర్చారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా మూవీ డైరెక్టర్ వెంకట్ ప్రభు చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. ఆయన 'కస్టడీ’ మూవీకి సీక్వెల్ ఉంటుందని దర్శకుడు పరోక్షంగా చెప్పడంతో అక్కినేని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఇది ‘కస్టడీ’ ఫలితంపై ఆధారపడి ఉంటుంది.


Also Read: సమంత హార్డ్ వర్కర్ - ఫోన్ పగలగొట్టాలనిపిస్తాది: నాగ చైతన్య