విజయ్ సేతుపతి, నయన తార, సమంతా.. ఈ ముగ్గురికి దక్షిణాదిలో ఎంత క్రేజ్ ఉందో తెలిసిందే. మరి, ఈ ముగ్గురు ఒక చోటే కలిస్తే.. అభిమానులకు కనువిందే కదూ. అయితే, ఈ ముగ్గురు ఇటీవల పబ్లిక్ ప్లేస్‌లో ఒకే బస్సులో ఫుట్‌బోర్డ్ ప్రయాణం చేస్తూ కనిపించారు. పద్ధతిగా చీర కట్టుకున్న నయన్, సమంతలతో సేతుపతి సైతం ఫుట్ బోర్డు‌పై నిలబడ్డాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 


ఇదంతా వారు ఓ సినిమా కోసం పడుతున్న పాట్లు. లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రియుడు విశ్నేష్ శివన్ తెరకెక్కిస్తున్న ‘కాతు వాక్కులా రెండు కాదల్’ (Kaathu Vaakula Rendu Kaadhal) అనే సినిమాను తీస్తున్నారు. ఇది ఒక ‘అన్యోన్యమైన’ ట్రయాంగిల్ లవ్ స్టోరీ అని టైటిల్‌ను బట్టి తెలుస్తోంది. అయితే, ఈ చిత్రంలో ఒకప్పుడు అమల, కమలహాసన్ ఫుట్‌బోర్డుపై ప్రయాణిస్తూ పాడే ‘‘పరువాలు కనివిని ఎరుగని.. చెరగని తరగని కవితలు పలికే మూగ కళ్లలో’’ పాటను రిక్రేయేట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, అందులో కమల హాసన్.. అమలతో మాత్రమే కనిపిస్తారు. ఇందులో విజయ్ సేతుపతి నయనతార, సమంతలతో డ్యూయెట్ పాడతారని తెలిసింది. దీన్ని గ్రీన్ మ్యాట్‌లోనే కానిద్దమని భావించినా.. సహజత్వం కోసం పబ్లిక్ ప్లేసులో షూటింగ్ చేయక తప్పలేదట. దీంతో.. ఇన్ని రోజులు గోప్యంగా ఉంచిన పాత్రల లుక్స్ లీకవ్వడంతో ఇప్పుడు విఘ్నేష్ లబోదిబో అంటున్నాడు. ఏది ఏమైనా.. చీరకట్టులో ఇద్దరూ భలే బాగున్నారంటూ అభిమానులు ఈ వీడియో చూసి మురిసిపోతున్నారు. 


వీడియో:


ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ షూటింగ్ దాదాపు ముగింపుకు వచ్చింది. సమంతా కూడా మిగిలిన షెడ్యూల్‌ను పూర్తి చేసుకొనేందుకు తమిళనాడు వెళ్లింది. ఈ సినిమా చిత్రీకరణ మొత్తం పుదుచ్చేరీ పరిసరాల్లోనే జరుగుతోంది. తాజాగా సమంతా షూటింగ్ సెట్‌లో ఓ ఫోటోను షేర్ చేసింది. ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్‌లో ‘ఫ్యామిలీ మ్యాన్-2’ వెబ్‌సీరిస్‌కు గాను ఉత్తమ నటిగా అవార్డు పొందిన నేపథ్యంలో.. సెట్‌లో కేక్ కోసి సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ వేడుకలో నయన్, విజయ్ సేతుపతి కూడా ఉన్నారు.


Also Read: ‘నాని.. నిజజీవితంలో హీరో కాదు, పిరికోడు’.. లైఫ్‌టైమ్ బ్యాన్ తప్పదు, ఎగ్జిబిటర్స్ షాకింగ్ నిర్ణయం!


Also Read: ఆర్జీవీ అదేం పని.. నటితో రొమాంటిక్ డ్యాన్స్, వైరల్ వీడియోలో ఉన్న ఆమె ఎవరు?


Also Read: శృంగారం లేకుండా ఉండగలవా? అభిమాని ప్రశ్నకు.. దిమ్మతిరిగే జవాబిచ్చిన శృతి హాసన్‌