Samantha React on Her Long Break From Acting: స్టార్‌ హీరోయిన్‌ సమంత ప్రస్తుతం రీఎంట్రీ రెడీ అయ్యింది. సినిమాలకు ఏడాది పాటు లాంగ్‌ బ్రేక్‌ తీసుకున్న సమంత ఇప్పుడు మళ్లీ నటించేందుకు రెడీ అయ్యింది. మయోసైటిస్‌ చికిత్స కోసమే ఈ నిర్ణయం తీసుకున్న సామ్‌ సిటాడెల్‌ ఇండియా వెబ్‌ సిరీస్‌ షూటింగ్ పూర్తి కాగానే రెస్ట్‌ మోడ్‌లోకి వెళ్లిపోయింది. ఏడాది పాటు ఎలాంటి ప్రాజెక్ట్‌ చేయనని చెప్పింది. మయోసైటిస్‌ చికిత్స కోసం విదేశాలకు వెళ్లిన సామ్‌ అక్కడ ఫిజకల్‌ ఎక్సర్‌సైజ్‌తో పాటు మెడిటేషన్‌, యోగా చేస్తూ ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకుంది. రెండేళ్లపాటు మయోసైటిస్‌తో బాధపడిన సామ్‌ ఇప్పుడు మెంటల్‌గా ఫిజికల్‌గా స్ట్రాంగ్‌ అయ్యానంటుంది. రీఎంట్రీకి అన్ని విధాలుగా సిద్ధమైన సమంత తాజాగా ఫేమినా ఇండియా మ్యాగజైన్‌తో ముచ్చటించింది. ఈ సందర్భంగా మ్యాగజైన్‌ కోసం బోల్డ్‌ అండ్‌ స్టైలిష్‌లో లుక్‌లో ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ఈ మ్యాగజైన్‌కు ఇచ్చిన సమంత యాక్టింగ్‌కు తీసుకున్న ఈ విరామంపై స్పందించింది. 


నేను తీసుకున్న కఠిన నిర్ణయం అదే


తన జీవితంలో తీసుకున్న అత్యంత కఠిమైన ఉత్తమైన నిర్ణయం ఇదేనంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ మేరకు సమంత మాట్లాడుతూ.. తాను ఈ నిర్ణయం మయోసైటిస్‌ నుంచి కోలువడానికి మాత్రమే తీసుకోలేదని, తన మానసిక, శారీరక ఒత్తిడి నుంచి ఉపశమనం కోసమే నటనకు లాంగ్‌ బ్రేక్‌ తీసుకున్నాను. ఇది నేను తీసుకున్న అత్యంథ కఠినమైన నిర్ణయం. అలాగే ఉత్తమమైన నిర్ణయం కూడా. అయితే కోలుకునేందుకు నాకు నేను తీసుకున్న ఈ నిర్ణయం పట్ల నిజంగా ఆనందంగా ఉన్నాను. ఎందుకంటే అనారోగ్య పరిస్థితుల రీత్యా వ్రత్తిని కంటిన్యూ చేయడం సాధ్యం కాదు. పనిపరంగా వచ్చే ఒత్తిడిని, ఇతరు విషయాలను ఆ సమయంలో బ్యాలెన్స్‌ చేయడం కష్టం. దాదాపు 13 ఏళ్లుగా నటిస్తూనే ఉన్నాను.


ఈ విరామం వల్ల నేను శారీరకంగా బలపడటమే కాదు ఆత్మన్యూనతకు లోనైన సందర్భాలను కూడా తట్టుకునే శక్తిని పొందాను. ఈ చిన్న విరామం నాకు చాలా ఉపయోగపడింది. ఎందుకంటే నేనేప్పుడు అభద్రతా భావం, అవిశ్వాసంతో ఉండేదాన్ని. అయినా నాకంటూ ఒక గుర్తింపు కోసం, వ్యక్తిగా ఎదగడం కోసం ప్రయత్నింఆచను. ఈ క్రమంలోనే నాలోని అభద్రతా భావాలు, ఆత్మనూన్యతలు తెలిసోచ్చాయి. ఎదుటి వ్యక్తులతో నాలో ప్లస్‌,మైనస్‌లో ఏంటో మాట్లాడి తెలుసుకున్నాను. ఇప్పుడు నాపై నాకు లోతైన అవగాహన వచ్చింది. ఈ విరామంలో నన్ను నేను మెరుగుపరుచుకున్నాను" అంటూ చెప్పుకొచ్చింది. 


ట్రోల్స్, విమర్శల వ్యత్యాసం తెలుస్తోంది


అదే విధంగా ఈ గ్యాప్‌ వల్ల ట్రోల్స్‌, నిర్మాణత్మకమైన విమర్శలు మధ్య వ్యత్యాసాన్ని గ్రహించగలుగుతున్నానని చెప్పింది. కొన్నిసార్లు నటీనటుల ప్రపంచం చాలా చిన్నదైపోతుంది. ఒకదగ్గరే వారి ప్రపంచం ఆగిపోతుంది. ఆ టైంలో మన మధ్య కూడా  సెలక్టివ్‌ పర్సన్స్‌ మాత్రమే ఉంటారు. వారు మనగురించి ఏమనుకుంటున్నారనే విషయాన్ని చెప్పలేకపోతారు. చెప్పరు కూడా. దానివల్ల మనం ఏంటన్నది మనకు తెలియదు. కానీ ఇప్పుడు నేను నా గురించి నేను పూర్తిగా తెలుసుకున్నారు. ట్రోల్స్‌, విమర్శల మధ్య వ్యత్యాసాన్ని గ్రహించగలుగుతున్నా. ఇప్పుడు వివరణాత్మక విమర్శలను స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నా. కష్టసుఖాల్లో అభిమానులు అండగా నిలిచారు. వారు చూపిస్తున్న ప్రేమ, అభిమానానికి ఎప్పుడూ క్రతజ్ఞురాలిని.