యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన 'ఆర్ఆర్ఆర్' సినిమా ఇటీవల విడుదలై భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తరువాత కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు ఎన్టీఆర్. రీసెంట్ గా ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన చిన్న వీడియోను వదిలారు. అదొక రేంజ్ లో ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. నిజానికి ఈపాటికే సినిమా సెట్స్ పైకి వెళ్లాల్సింది కానీ ఆలస్యమవుతుంది. 


ఆగస్టు నుంచి రెగ్యులర్ షూటింగ్ ఉంటుందంటున్నారు కానీ ఈ విషయంపై క్లారిటీ లేదు. ప్రస్తుతం దర్శకుడు కొరటాల శివ ఫైనల్ స్క్రిప్ట్ ను లాక్ చేసే పనిలో పడ్డారు. ఇదిలా ఉండగా.. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. ఈ సినిమాలో ఓ మెగాహీరో గెస్ట్ రోల్ లో కనిపిస్తాడట. 'ఆర్ఆర్ఆర్'లో రామ్ చరణ్ తో స్క్రీన్ షేర్ చేసుకున్న ఎన్టీఆర్ ఇప్పుడు మరో మెగాహీరోతో కలిసి నటించబోతున్నారట. 


కథ ప్రకారం.. సినిమాలో ఎన్టీఆర్ బావమరిది క్యారెక్టర్ ఒకటి ఉంటుందట. దాని నిడివి తక్కువే అయినప్పటికీ.. ఆ రోల్ లో పేరున్న నటుడిని తీసుకోవాలనుకుంటున్నారు. దీనికోసం సాయి తేజ్ ని సంప్రదించినట్లు సమాచారం. మరి ఇందులో ఎంతవరకు నిజముందో దర్శకుడు కొరటాల క్లారిటీ ఇస్తారేమో చూడాలి. 


ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా ముందు అలియాభట్ ను అనుకున్నారు కానీ ఆమె కొన్ని కారణాల వలన నో చెప్పింది. అప్పటినుంచి హీరోయిన్స్ కోసం చాలా ఆప్షన్స్ చూస్తున్నారు కానీ ఏదీ వర్కవుట్ కావడం లేదు. ఎన్టీఆర్ తో కలిసి పని చేసిన హీరోయిన్స్ ను మళ్లీ రిపీట్ చేయడం కొరటాలకు ఇష్టం లేదు. టాప్ రేంజ్ లో ఉన్న హీరోయిన్ ను రంగంలోకి దింపాలనుకుంటున్నారు. బాలీవుడ్ అమ్మాయిని తీసుకుంటే పాన్ ఇండియా లెవెల్ లో ప్రమోషన్ కి పనికొస్తుందని ఆలోచిస్తున్నారు.


Also Read :అంచనాలు ఆకాశాన్ని అందుకునేలా చేసిన పూరి - విజయ్ దేవరకొండ 'లైగర్' ట్రైలర్ వచ్చేసింది


Also Read : 'పరంపర 2' రివ్యూ: ఫస్ట్ సీజన్ కంటే లెంగ్త్ తక్కువ - జగపతి బాబు, నవీన్ చంద్ర, శరత్ కుమార్ నటించిన ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందంటే?