దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి డైరెక్ట్ చేసిన 'ఆర్ఆర్ఆర్'(RRR) సినిమా మార్చి 25న విడుదలకు సిద్ధమవుతోంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో దానికి తగ్గట్లుగానే ప్రమోషన్స్ మొదలుపెట్టారు. ఇప్పటికే సినిమా ట్రైలర్, పాటలు విడుదల చేశారు. మార్చి 14న ఈ సినిమా నుంచి 'ఎత్తరా జెండా' అనే మరో పాటను విడుదల చేశారు. దీనికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇదిలా ఉండగా.. తాజాగా ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ను ప్లాన్ చేస్తున్నారు. 


మార్చి 19న కర్ణాటకలో చిక్కబళ్లాపుర అనే ప్రాంతంలో ఈవెంట్ ను నిర్వహించనున్నారు. ఈ ఈవెంట్ కోసం రెండు తెలుగు రాష్ట్రాల్లో అభిమానులు కర్ణాటకకు వెళ్లనున్నారు. భారీ రేంజ్ లో ఈ ఈవెంట్ ను ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాతో ఆడియన్స్ కు బెస్ట్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వడం కోసం 'డాల్బీ సినిమా' టెక్నాలజీను వాడబోతున్నారు. డాల్బీ సినిమాలో విడుదలవుతున్న మొట్ట మొదటి ఇండియన్ సినిమాగా 'ఆర్ఆర్ఆర్' నిలవబోతుంది. ఓవర్సీస్ లో ఐమాక్స్ లాంటి పెద్ద ఫార్మేట్స్ లో సినిమాను ప్రీమియర్ షోగా ప్రదర్శించడానికి ఈ డాల్బీ సినిమా టెక్నాలజీను వాడతారు. 


డీవీవీ దానయ్య నిర్మించిన సినిమా ఈ సినిమాకి ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించారు. కె.కె. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందించారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన విదేశీ భామ ఒలీవియా మోరిస్, రామ్ చరణ్‌కు జోడీగా ఆలియా భట్ కనిపించనున్నారు. శ్రియా శరన్, అజయ్‌దేవ్‌గణ్‌, రాహుల్ రామకృష్ణ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.