Renu Desai Emotional Post About Akira: చాలా కాలంగా లో ప్రొఫైల్ మెయింటెయిన్ చేసిన పవన్ కల్యాణ్-రేణూ దేశాయ్ ముద్దుల కొడుకు అకిరా నందన్, ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో మహా కూటమి విజయం సాధించిన తర్వాత బయటకు వచ్చాడు. తన తండ్రి వెంటే ఉంటున్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత పవన్ కల్యాణ్ తో కలిసి ఇంటికి వెళ్లాడు. ఆ తర్వాత పార్టీ కార్యాలయానికి వెళ్లాడు. జనసేన ఆఫీస్ కు వచ్చిన చంద్రబాబును కలిసి కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నాడు. అటు నుంచి తండ్రితో పాటు ఢిల్లీకి వెళ్లాడు. పవన్ కల్యాణ్ తన కొడుకును ప్రధాని మోదీకి పరిచయం చేశారు. అందరూ కలిసి ఫోటో తీసుకున్నారు.


నా హృదయం నిండిపోయింది- రేణూ దేశాయ్


అటు అకిరా నందన్ ప్రధాని మోదీని కలవడం పట్ల ఎమోషనల్ అయ్యింది తల్లి రేణూ దేశాయ్. కొడుకు ప్రధానితో కలిసి దిగిన ఫోటోను షేర్ చేస్తూ తన సంతోషాన్ని వ్యక్తం చేసింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్టు పెట్టింది. అకిరా ప్రధాని మోదీని కలవడం తనకు ఒక తల్లిగా ఎనలేని సంతోషాన్ని ఇచ్చిందని చెప్పింది. “ఒక తల్లిగా నాకు ఎనలేని సంతోషాన్ని ఇచ్చిన సందర్భం, కల్యాణ్ గారితో వెళ్లి అకిరా నరేంద్ర మోదీ గారికి కలిసి వారితో ఫోటో దిగడం. వ్యక్తిగతంగా నాకు బీజేపీ, మోడీ గారు అంటే నాకు చాలా అభిమానం. అలాంటిది ఈ రోజు ఈ ఫోటో చూస్తుంటే నా మనసు ఉద్వేగానికి గురైంది. నా కళ్లు ఆనందంతో  మెరిసిపోతున్నాయి. నా హృదయం నిండిపోయింది. అకిరాను ఆశీర్వదించిన మోదీ గారికి ధన్యవాదాలు. అలాగే, అకిరా మీద ఇంత ప్రేమ కురిపిస్తున్న మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు” అని రాసుకొచ్చింది.  






అకిరా ఫోన్ చేసి ఏం చెప్పాడంటే? - రేణూ దేశాయ్


ఇప్పటికే రేణూ దేశాయ్ తన కొడుకు ప్రధాని మోదీ కలవడంపై సంతోషం వ్యక్తం చేసింది. మోదీతో అకిరా ఫోటో చూస్తే ఆనందంగా, ఎమోషనల్ గా ఉందని వెల్లడించింది. ఈ సంతోష సమయంలో ఏం రాయాలో తెలియడం లేదని చెప్పింది.    ప్రధాని మోదీని కలిశాక అకిరా తనకు ఫోన్ చేసి ఎన్నో విషయాలు చెప్పినట్లు వివరించింది. మోదీతో ఉన్నంత సేపు తను ఎలా ఫీలయ్యాడో చెప్పుకొచ్చింది. “ప్రధాని మోదీ గారిని కలిసిన తర్వాత అకిరా నాకు ఫోన్ చేశాడు. ప్రధాని చుట్టూ ఓ తెలియని శక్తి ఉన్నట్లు చెప్పాడు. ఆ రూమ్ లో ఉన్నంత సేపు చాలా గొప్పగా, స్ట్రాంగ్ గా ఫీలయ్యాను అన్నాడు. ప్రధాని మోదీ దగ్గర ఏదో తెలియని పవర్ ఉన్నట్లు చెప్పాడు” అని రేణూ దేశాయ్ వివరించింది.


Read Also: ‘క‌ల్కి‘ అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ - 24 గంటల్లో అన్ని టిక్కెట్లు అమ్ముడయ్యాయా?