Ranveer singh In Brahmastra 2: ఆయాన్ ముఖర్జీ తెరకెక్కించిన ప్రతిష్టాత్మక చిత్రం ‘బ్రహ్మాస్త్ర’. కరణ్ జోహార్ నిర్మించిన ఈ సినిమాలో రణబీర్ కపూర్‌, ఆలియా భట్ జంటగా నటించారు. ఈ సినిమా పార్ట్ 2 కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. ‘బ్రహ్మాస్త్ర’కు కొనసాగింపుగా రానున్న ‘బ్రహ్మాస్త2’లో రణవీర్ సింగ్ కీలక పాత్ర పోషించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం దేవ్‌ అనే పాత్ర కోసం రణ్‌వీర్‌ను ఎంపిక చేసినట్లు సమాచారం. శివకి తండ్రిగా రణవీర్‌ కనిపించబోతున్నారట. ఇప్పటికే ఈ సినిమాలో నటించేందుకు తను కూడా ఓకే చెప్పినట్లు టాక్ నడుస్తోంది. స్క్రిప్ట్‌ దశలో ఉన్న ఈ సినిమా 2025లో సెట్స్‌ మీదకు వెళ్లనున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

  


‘బ్రహ్మాస్త్ర’కు మిశ్రమ స్పందన


ఇక ‘బ్రహ్మాస్త్ర’ సినిమా గత ఏడాది సెప్టెంబర్ 9న విడుదలైంది. తొలి షో నుంచే మిశ్రమ స్పందన లభించింది. అనుకున్న స్థాయిలో కలెక్షన్లు కూడా రాలేదు. తెలుగులోనూ డీసెంట్ వసూళ్లను సాధించింది. ఈ సినిమా కంటెంట్ చాలా పూర్ గా ఉందనే టాక్ వచ్చింది. గ్రాఫిక్స్ మాత్రం ఫర్వాలేదు అనిపించాయి. ఈ సినిమాలో స్టార్ యాక్టర్లు షారుక్ ఖాన్, అమితాబ్ బచ్చన్,  అక్కినేని నాగార్జున, మౌనీ రాయ్ నటించారు. వీరి కారణంగా ఆమాత్రం వసూళ్లు అయినా వచ్చాయని చెప్పుకోవచ్చు. నాగార్జున నటించడం, రాజమౌళి సమర్ఫకుడిగా ఉండటంతో తెలుగులో బాగానే ఆడింది. వసూళ్ల పరంగానూ ఓకే అనిపించింది.   


స్క్రిప్ట్ వర్క్ లో  ‘బ్రహ్మస్త్ర పార్ట్ 2’


‘బ్రహ్మస్త్ర’ సినిమాకు పార్ట్ 2 ఉంటుందని సినిమా క్లైమాక్స్ లో చూపించారు.  రీసెంట్ గా ఈ మూవీ సీక్వెల్ గురించి రణబీర్ కపూర్ కీలక విషయాన్ని వెల్లడించాడు. సినిమా ప్రారంభంలోనే ‘బ్రహ్మాస్త’ను రెండు భాగాలుగా విడుదల చేయాలని మేకర్స్ ప్రకటించారని చెప్పారు. అయితే, తొలి భాగం విడుదలై ఏడాది గడుస్తున్న ఎలాంటి కదలిక లేకపోవడంతో అసలు రెండో భాగం ఉంటుందా? లేదా? అనే అనుమానాలు రేకెత్తాయి. ఈ నేపథ్యంలో రణబీర్ ‘బ్రహ్మాస్త్ర 2’ గురించి క్లారిటీ ఇచ్చారు. దర్శకుడు అయాన్ రెండు భాగానికి సంబంధించి తనకు కథ చెప్పినట్లు వెల్లడించారు. ‘బ్రహ్మాస్త్ర 2’ కి ఇంకా రైటింగ్ వర్క్ ఇంకా చాలా చేయాలన్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందని వివరించారు. పార్ట్ 1 కంటే పార్ట్ 2 చాలా అద్భుతంగా ఉండబోతుందని ఆయన వివరించారు. ప్రస్తుతం అయాన్ ముఖర్జీ 'వార్‌ 2' సినిమా తో బిజీగా ఉన్నాడు. హృతిక్‌ రోషన్‌,  జూనియర్ ఎన్టీఆర్‌ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.


ఇక రణవీర్ సింగ్ ఈ ఏడాది ‘రాకీ ఔర్‌ రాణీ కీ ప్రేమ్‌ కహానీ’తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ సినిమా ప్రేక్షకులను బాగానే అలరించింది. ప్రస్తుతం రోహిత్‌ శెట్టి దర్శకత్వంలో రూపొందుతున్న ‘సింగమ్‌ అగైన్‌’లో నటిస్తున్నారు. ఇందులో ఆయన సంగ్రామ్‌ భలేరావ్‌గా కనిపించనున్నారు. అటు ఓ పాన్‌ ఇండియా మూవీలోనూ ఆయన కీలక పాత్ర పోషించనున్నట్లు సమాచారం.


Read Also: అతడితో ముద్దు సీన్లు.. చాలా ఇబ్బందిపడ్డాను - కిస్సింగ్ కింగ్‌పై తనుశ్రీ షాకింగ్ కామెంట్స్