Ramabanam : 'లక్ష్యం', 'లౌక్యం' వంటి హ్యాట్రిక్ చిత్రాలతో  భారీ హిట్ కొట్టిన సినీ హీరో 'గోపిచంద్'.. మరో సారి హీరో జగపతిబాబుతో కలిసి నటించనున్నారు. శ్రీవాస్ గోపీచంద్ కాంబోలో రాబోతున్న ఈ సినిమాలో డింపుల్ హయతి హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ క్రమంలోనే మార్చి 30న శ్రీరామనవమిని పురస్కరించుకుని మేకర్స్ ఈ చిత్రానికి సంబంధించిన ఓ క్రేజీ అప్ డేట్ ను విడుదల చేశారు. 'రామబాణం' టైటిల్ తో ఉన్న ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా హీరో గోపీచంద్ ఇన్ స్టాగ్రామ్ వేదికగా ఈ విషయాన్ని పంచుకున్నారు. దీంతో ఈ లేటెస్ట్ పోస్టర్ ప్రస్తుతం వైరల్ గా మారింది.


కెరీర్ బిగెనింగ్ లో వరుస హిట్లతో జోరు చూపించిన హీరో గోపిచంద్.. ఈ మధ్య కాలంలో కాస్త స్లో అయినట్టు కనిపిస్తోంది. గత కొంత కాలంగా సినిమాలు చేసినా.. అవి బాక్సాఫీస్ వద్ద అంత అలరించకపోవడం ఆయన అభిమానుల్ని నిరాశలోకి నెట్టింది. తాజాగా ప్రకటించిన 'రామబాణం' సినిమాతో మళ్లీ ఫ్యాన్స్ లో ఉత్తేజం వచ్చినట్టు కనిపిస్తోంది. ఈ మూవీలో గోపిచంద్ తో పాటు ఇంతకుముందు 'లక్ష్యం', 'లౌక్యం' సినిమాల్లో తనతో పాటు నటించిన మరో హీరో జగపతిబాబు కూడా ఈ సినిమాలో నటించనుండడం అందర్నీ ఆకర్షిస్తోంది. లేటెస్ట్ గా విడుదలైన ఈ మూవీ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. శ్రీవాస్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఈ పోస్టర్ లో గోపీచంద్, జగపతిబాబు తెల్లటి సంప్రదాయ దుస్తులు ధరించి, ఒకరి చేతులు ఒకరు పట్టుకొని నడుచుకుంటూ వస్తు్న్నారు. ఈ సందర్భంగా హీరో గోపీచంద్ ఇన్స్ స్టాగ్రామ్ లో ఈ ఫొటోను షేర్ చేశారు. దాంతో పాటు "రామనామమే జయం.. రామ బాణమే విజయం.. శ్రీరామనవమి శుభాకాంక్షలు" అనే క్యాప్షన్ ను రాసుకొచ్చారు. 


మరొక ముఖ్య విషయమేమిటంటే.. ఈ సినిమా గోపిచంద్ కి 30వ సినిమా. కాగా ఈ మూవీలో డింపుల్ హయతి హీరోయిన్ గా నటిస్తుండగా..  సచిన్ ఖేడ్కర్, నాజర్, అలీ రాజా, రవీంద్ర, వెన్నెల కిషోర్, సప్తగిరి, కాశీ విశ్వనాథ్ సత్య తదితరులు నటిస్తున్నట్టు సమాచారం. అంతే కాకుండా ఈ సినిమాను వేసవి కానుకగా మే 5న రిలీజ్ చేయనున్నారు. అలాగే ఈ రామబాణానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తుండగా... భూపతి రాజా కథను అందించారు. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్‌, వివేక్‌ కూచిభొట్ల ఈ సినిమాను నిర్మిస్తున్నారు.


గోపిచంద్ నటించిన 'లక్ష్యం', 'లౌక్యం' తరహాలో ఈ సినిమా కూడా భారీ విజయం సాధించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. లౌక్యం తర్వాత అంటే దాదాపు 9 ఏళ్ల తర్వాత మళ్లీ అదే ఉత్సాహంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న గోపిచంద్ కు ఈ మూవీ ప్రెస్టేజియస్ గా మారింది. ఇక డైరెక్టర్ కూడా లౌక్యం తర్వాత డిక్టేటర్‌, సాక్ష్యం లాంటి సినిమాలు చేసిన అవి బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ లానే నిలిచాయి. దీంతో వీరిద్దరీ ఈ మూవీ హిట్ కావడం ఎంతో ముఖ్యమైందిగా తోస్తోంది.