బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంకా చోప్రా చాలా రోజుల తర్వాత ఇండియాకు వచ్చింది. నిక్ జోనస్ తో పెళ్లి తర్వాత ఆమె ఇండియా రాలేదు. దాదాపు మూడేళ్ళ తర్వాత ఆమె ఇండియా కు రావడంతో ఆమెను చూసేందుకు ఫ్యాన్స్ పెద్ద ఎత్తున ముంబై ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. మంగళవారం ఉదయం ఆమె ముంబై ఎయిర్ పోర్ట్ లో తళుక్కుమంది. ఇందుకు సంబంధించిన వీడియో ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ఈ బాలీవుడ్ బ్యూటీ. ఎయిర్ పోర్ట్ లో ఫ్యాన్స్ కు అభివాదం చేస్తూ నవ్వుతూ కనిపించింది ప్రియాంక.


ఆమె ఎయిర్ పోర్ట్ నుంచి బయటకు వస్తూ ఫ్యాన్స్ కు అభివాదం చేస్తూ కనిపించింది. బ్లూ డ్రెస్ లో వైట్ స్నికార్స్ తో మెరుస్తూ కనిపించింది ప్రియాంకా. ఆమెను చూసిన ఫ్యాన్స్ సందడి చేశారు. ఆమె ఎయిర్ పోర్ట్ నుంచి బయటకు వచ్చి కార్ ఎక్కే వరకూ ఫోటో గ్రాఫర్ వరుస ఫోటోలు తీస్తూనే ఉన్నాడు. ప్రియాంకా కార్ ఎక్కుతుండగా ఫోటోగ్రాఫర్ "అలియా భట్ తల్లి కాబోతోందా" అని అడిగిన ప్రశ్నకు ఆమె ఒక నవ్వు నవ్వి ఫ్యాన్స్ కు చేయి ఊపుతూ కార్ ఎక్కి వెళ్ళిపోయింది.


ఆమె ఇండియా కు వచ్చిన తర్వాత తన ప్రయాణంలో దిగిన ఫోటోలు, వీడియోలను ఆమె తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. విమానం కిటికీ నుంచి తీసిన ముంబై సముద్రం ఫోటోను షేర్ చేసింది. నిర్మానుష్యంగా ఉన్న ముంబై వీధులను వీడియో తీస్తూ 'ముంబై మేరీ జాన్' అంటూ రాసుకొచ్చింది ప్రియాంకా. అలాగే ఆమె ఇంటి దగ్గర కరణ్ జోహార్ షోను చూస్తున్న టీవీ స్క్రీన్ చిత్రాన్ని కూడా షేర్ చేసింది. "ముంబై వచ్చి మీరు కరణ్ జోహార్ షో చూడకపోతే.. అది ముంబై ఎలా అవుతుంది?" అంటూ సరదాగా రాసుకొచ్చింది. వాటితో పాటు స్నాక్స్ ఫోటోలను కూడా షేర్ చేసింది. 


Also Read : ఈ వారం చిన్న సినిమాలదే హవా - థియేట్రికల్, ఓటీటీ రిలీజెస్ ఇవే!


అంతకుముందు ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రియాంక తాను భారతదేశానికి తిరిగి వస్తున్నట్లు ఫోటోను షేర్ చేసింది. "చివరిగా ఇంటికి వెళ్తున్నా.. దాదాపు 3 సంవత్సరాల తర్వాత" అంటూ తన బోర్డింగ్ పాస్ ఫోటోను ట్యాగ్ చేసి రాసింది.  ప్రియాంక, ఆమె భర్త నిక్ జోనాస్ ఈ ఏడాది జనవరిలో తాము సరోగసీ ద్వారా తల్లిదండ్రులు అయ్యామని ప్రకటించారు. కూతురుతో పాటు ఇండియాకు వస్తున్నాం అని చెప్పినా ఎయిర్ పోర్ట్ లో ఆమె కుమార్తె కనిపించలేదు. ఇక ప్రియాంకా తాజాగా అమెజాన్ స్టూడియోస్ తెరకెక్కించిన రొమాంటిక్ డ్రామా 'ఆల్ కమింగ్ బ్యాక్ టూ మీ" లో  నటుడు హ్యూజన్, రిచర్డ్ మాడెన్ సరసన స్పై సిరీస్ లో ప్రియాంక కనిపించనుంది. దీని తర్వాత ఆమె హిందీ చిత్రం నటుడు, చిత్ర నిర్మాత ఫర్హాన్ అక్తర్ దర్శకత్వం వహించిన జీ లే జరాలో కనిపించనుంది. ఈ సినిమాలో కత్రినా కైఫ్, అలియా భట్‌లతో కలిసి ప్రియాంక నటిస్తుంది.