వైపు ఎన్నికలకు రెడీ అవుతున్న జనసేననాని పవన్ కల్యాణ్.. మరోవైపు వరుస సినిమాలతోనూ దూసుకుపోతున్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా సినిమాల్లో ఫుల్ బిజీ అయ్యారు పవర్ స్టార్. ఎన్నికల వేడి మొదలయ్యే సరికి అన్ని సినిమాలను కంప్లీట్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం ‘హరిహర వీరమల్లు’ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్న ఆయన..  సుజిత్ తో ఓ సినిమా చేయనున్నట్లు ప్రకటించారు.  తాజాగా హరీష్ శంకర్, పవన్ కల్యాణ్ కాంబోలో వస్తున్న తాజా సినిమాకు సంబంధించిన అదిరిపోయే అప్ డేట్ వచ్చింది.


‘గబ్బర్ సింగ్’తో బ్లాక్ బస్టర్ హిట్


ఇప్పటికే పవన్ కల్యాణ్ – హరీష్ శంకర్ కాంబోలో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ సినిమా బాక్సాఫీస్ దగ్గర రికార్డులు మోత మోగించింది. పవన్ కల్యాణ్ ను మళ్లీ ఫుల్ స్వింగ్ లో నిలిపింది. అంతకు ముందు సరైన హిట్ లేక ఇబ్బంది పడిన పవన్ కు తన కెరీర్ లోనే దుమ్మురేపే హిట్ ఇచ్చింది. ‘గబ్బర్ సింగ్’ హిట్ తో పవన్ కల్యాణ్ ఫ్యాన్స్  మళ్లీ జోష్ లోకి వెళ్లారు. ఈ నేపథ్యంలో వీరిద్దరు కలిసి మరో సినిమా చేయాలని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో గతేడాది వీరి కాంబోలో సినిమా రాబోతున్నట్లు ప్రకటన వచ్చింది. దీంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. ఈ సినిమా పేరు ‘ భవదీయుడు భగత్‌ సింగ్‌’ అనే ప్రచారం కూడా కొనసాగింది.


ఏడాది కిందట పవన్-హరీష్ కాంబోలో మూవీ ప్రకటన


ఏడాది కిందట వచ్చిన ప్రకటన తర్వాత అప్పుడుప్పుడు చిన్న చిన్న అప్ డేట్స్ వచ్చాయి.. తప్ప మేజర్ అనౌన్స్ మెంట్ రాలేదు. ఎప్పుడెప్పుడు ఈ సినిమా  సెట్స్ మీదకు వస్తుందా? అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఒకానొక సమయంలో ఈ సినిమా క్యాన్సిల్ అయినట్లు కూడా వార్తలు వచ్చాయి. కానీ, తాజాగా ఈ సినిమా గురించి బ్రహ్మాండమైన ప్రకటన వచ్చింది.  త్వరలో ఈ సినిమా షూటింగ్ మొదలు కాబోతున్నట్లు నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ వెల్లడించింది. ఈ మేరకు టైటిల్ పోస్టర్ విడుదల చేసింది.   


భవదీయుడు భగత్‌ సింగ్‌’ కాదు ‘ఉస్తాద్ భగత్ సింగ్’!


లేటెస్టుగా విడుదలైన టైటిల్ పోస్టర్ లో కీలక మార్పులు చేశారు. ఇంతకాలం‘ భవదీయుడు భగత్‌ సింగ్‌’ అనే పేరు ప్రచారం జరిగినా,  ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’గా అనౌన్స్ చేశారు. ఈ టైటిల్ కు తోడుగా ‘మనల్ని ఎవడ్రా ఆపేది’ అంటూ ట్యాగ్ లైన్ యాడ్ చేశారు. ఇక ఈ పోస్టర్ లో పవన్ కల్యాణ్ ఒక చేతిలో హార్లీ డేవిడ్సన్‌ బైక్‌, మరో చేతిలో ఛాయ్ గ్లాస్ పట్టుకుని అదిరిపోయే లుక్ లో కనిపిస్తున్నారు. బ్యాక్‌ గ్రౌండ్‌ లో కరెంట్‌ వైర్లు సహా కరెంట్ తయారీ ఫ్యాక్టరీ కనిపిస్తోంది. ఇక ఈ సినిమాకు టైటిల్ పోస్టర్ ను చూసి ఫ్యాన్స్ ఖుషీ ఖుషీ అవుతున్నారు. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్‌ మ్యూజిక్ ఇస్తున్నారు.