తెలుగు బుల్లితెర కమెడియన్ యాదమ్మరాజు త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్నాడు. పటాస్ షో ద్వారా బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చిన యాదమ్మరాజు తన కామెడి టైమింగ్, యాటిట్యూడ్ తో కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. రాజు గత కొంత కాలంగా స్టెల్లా అనే యువతితో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. చాలా సందర్భాల్లో వీరిద్దరూ కామెడీ ప్రోగ్రాంలలో కనిపించారు కూడా. అయితే త్వరలోనే ఈ బుల్లితెర జంట పెళ్లి పీటలెక్కనుంది. ఇటీవల వీరిద్దరికీ ఎంగేజ్మెంట్ జరిగింది. అందుకు సంబంధించిన ఫోటోలను యాదమ్మరాజు సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నాడు. 


యాదమ్మరాజు అనుకోకుండా బుల్లితెర వైపు వచ్చాడు. జబర్ధస్త్, ఎక్స్ట్రా జబర్ధస్త్ షో లు ఎంత పాపులర్ అయ్యాయో అప్పట్లో పటాస్ కామెడీ షో కూడా అంతే క్రేజ్ తెచ్చుకుంది. ఓసారి పటాస్ కార్యక్రమంలో స్టూడెంట్ గా షోలో అడుగుపెట్టిన రాజు ఓ జోక్ వేసి బాగా హైలెట్ అయిపోయాడు. రాజు బాడీ లాంగ్వేజ్, కామెడీ టైమింగ్ బాగుండటంతో పటాస్ షోలో కామెడీ చేసే అవకాశం లభించింది. ప్రస్తుతం కమెడియన్స్ గా పేరుతెచ్చుకున్న సద్దాం, నూకరాజు, ఫైమా, ఇమ్మాన్యూయల్.. ఇలాంటి వారంతా పటాస్ షో నుంచి వచ్చిన వారే. 


గతేడాది ‘అదిరింది’ షో తో మరింత క్రేజ్ తెచ్చుకున్నాడు యాదమ్మ రాజు. ముఖ్యంగా స్టేజీ మీద యాదమ్మ రాజు, సద్దాం కాంబినేషన్ లో చేసిన కామెడీ స్కిట్ లు మంచి హిట్ అయ్యాయి. వీరిద్దరూ స్టేజీపైన ఉంటే కామెడీ వేరే లెవల్ లో ఉంటుంది. ప్రస్తుతం కామెడీ షోలలో చేస్తోన్న చాలామందికి సినిమాల్లో కూడా అవకాశాలు వస్తున్నాయి. యాదమ్మరాజు కూడా ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తున్నాడు. ఇక తన ప్రియురాలు స్టెల్లా గురించి కూడా చాలా మందికి తెలిసే ఉంటుంది. స్టెల్లాతో ప్రేమలో ఉన్నట్టు యాదమ్మరాజు ఓసారి ప్రోగ్రాం మధ్యలో ఆమెను స్టేజీ పైకి తీసుకొచ్చి అందరికీ పరిచయం చేశాడు. అంతేకాకుండా వీరిద్దరూ కలసి యూట్యూబ్ వీడియోలు కూడా చేస్తున్నారు. 


Read Also: రష్మికపై బ్యాన్, ఇక ఆమె సినిమాలు కూడా విడుదలకావట!