కొన్నాళ్ల క్రితం డిస్నీప్లస్ హాట్‌స్టార్ లో 'పరంపర' అనే వెబ్ సిరీస్ ను స్ట్రీమింగ్ చేశారు. ఇందులో జగపతి బాబు, శరత్‌కుమార్, నవీన్ చంద్ర కీలక పాత్రల్లో నటించారు. ఎల్.కృష్ణ విజయ్, అరిగెల విశ్వనాథ్‌ల దర్శకత్వంలో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కింది. శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని ఈ సిరీస్‌ను నిర్మించారు. పొలిటికల్, రివెంజ్, యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సిరీస్ ను రూపొందించారు. దీనికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. 


ఇప్పుడు ఈ సిరీస్ కి కొనసాగింపుగా సీజన్ 2 వస్తోంది. 'రివెంజ్, పాలిటిక్స్, డ్రామా.. పరంపర ఎగైన్ కోసం రెడీగా ఉండండి. త్వరలోనే రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేస్తామని' నటుడు నవీన్ చంద్ర సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. 'పరంపర' అనేది వారసత్వానికి, అర్హతకి మధ్య జరిగే ఘర్షణ. యాక్షన్, డ్రామా, లవ్, ఫ్యామిలీ ఎమోషన్స్ ఇలా అన్ని ఎలిమెంట్స్ ఈ సిరీస్ లో ఉంటాయి. 


ఫస్ట్ సీజన్ లో ఈ ఎలిమెంట్స్ అన్నీ చూపించారు. ఇప్పుడు సెకండ్ సీజన్ లో అవే ఎమోషన్స్ ను కంటిన్యూ చేయనున్నారు. ఈ స్టోరీ మూడు జెనరేషన్స్ కి సంబంధించిందని. పెర్సనల్ ఎక్స్ పీరియన్స్ తో రాశానని రైటర్ హరి ఏలేటి  గతంలో వెల్లడించారు. మరి సెకండ్ సీజన్ కి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి!


Also Read: వెనక్కి వెళ్ళిన అరుణ్ విజయ్ 'ఏనుగు' - ఎప్పుడు విడుదల అవుతుందంటే?


Also Read: విష్ణు మంచు ఇచ్చిన లేటెస్ట్ అప్‌డేట్‌ ఏంటంటే? ఉదయం ఆరు గంటలకు వర్క్ స్టార్ట్