టాలీవుడ్ హీరో నిఖిల్ (Nikhil Siddharth), దర్శకుడు చందు మొండేటి (Chandoo Mondeti) కాంబినేషన్ లో వచ్చిన 'కార్తికేయ' సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఆ సినిమా సీక్వెల్‌ ప్రేక్షకుల ను ఎంటర్టైన్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఈ సినిమాలో అనుపమా పరమేశ్వరన్ (Anupama Parameswaran) హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలో శ్రీకృష్ణునికి సంబంధించిన చరిత్ర, ద్వారకా నగరం మీద అన్వేషణ చేసే వైద్యుడిగా నిఖిల్ కనిపించనున్నారు.


ముందుగా ఈ సినిమాను జూలై 22న రిలీజ్ చేయాలనుకున్నారు. ఫైనల్ గా ఈ సినిమాను ఆగస్టు 12న సినిమాను విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. దానికి తగ్గట్లు ప్రమోషన్స్ షురూ చేసింది చిత్రబృందం. ఇందులో భాగంగా బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చారు. జీ తెలుగులో వచ్చే సీరియల్ లో స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చారు నిఖిల్. 'రాధమ్మ కూతురు' అనే సీరియల్ లో ఓ సందర్భంలో మహిళను కాపాడి ఆమెను పెళ్లి మండపానికి తీసుకెళ్లే సన్నివేశంలో కనిపించారు. నిఖిల్ కి ఒక యాక్షన్ సీన్ కూడా పెట్టారు. 


మొత్తానికి బుల్లితెర ఆడియన్స్ ని ఆకట్టుకోవడానికి నిఖిల్ ఇలా కూడా ప్రయత్నిస్తున్నాడన్నమాట. ఇదివరకు ఒకరిద్దరు హీరోలు ఈ ఫార్మాట్ ను ఫాలో అయ్యారు. మళ్లీ ఇన్నాళ్లకు నిఖిల్ లాంటి హీరో బుల్లితెరపై కనిపించి సర్ప్రైజ్ చేశారు. జీ ఛానెల్ లోనే కనిపించారంటే బహుశా.. 'కార్తికేయ2' శాటిలైట్ రైట్స్ ను ఈ ఛానెలే దక్కించుకొని ఉందనిపిస్తుంది. 


ఇక 'కార్తికేయ 2' సినిమా విషయానికొస్తే.. పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రి, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై టీజీ విశ్వ‌ప్ర‌సాద్, అభిషేక్ అగ‌ర్వాల్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కీలక పాత్రలో నటిస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు.