నాగ చైతన్య, సమంత గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేదు. ఇద్దరు కలిసి నటించిన తొలి సినిమాతోనే మంచి స్నేహితులుగా మారారు. కొంత కాలం తర్వాత స్నేహం ప్రేమగా మారింది. కుటుంబ సభ్యుల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. కొన్ని కారణాలతో ఇద్దరూ విడిపోయారు. ప్రస్తుతం ఎవరికి వారు వేర్వేరుగా కెరీర్ కొనసాగిస్తున్నారు. అయితే, విడాకులు తర్వాత చై తొలిసారి సమంత ఫోటోను షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ పోస్టు నెట్టింట్లో వైరల్ గా మారింది. ఇంతకీ తను సామ్ ఫోటో చై ఎందుకు షేర్ చేశాడో ఇప్పడు తెలుసుకుందాం..
సామ్, చై తొలి సినిమా ‘ఏమాయ చేశావే’
సమంత-నాగచైతన్య కలిసి నటించిన తొలి సినిమా ‘ఏమాయ చేశావే’. గౌతమ్ మీనన్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాతోనే సమంత టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. ఈ సినిమాలో జెస్సీ అనే అమ్మాయి పాత్రలో నటించి సమంతా తెలుగు ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది. ఈ సినిమా మంచి హిట్ అందుకోవడంతో ఆమెకు వరుస అవకాశాలు వచ్చాయి. టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా ఎదిగింది. నాగ చైతన్య ‘ఏమాయ చేశావే’ సినిమా కంటే ముందు ‘జోష్’ అనే సినిమాలో నటించాడు. అయితే, ఆ సినిమా పెద్దగా ఆకట్టుకోలేదు. ‘ఏమాయ చేశావే’ మూవీతోనే మంచి హిట్ అందుకున్నాడు.
ప్రేమ, పెళ్లి, విడాకులు
తెర మీద సామ్, చై జోడీ ప్రేక్షకులకు బాగా నచ్చేసింది. సినిమాతో పాటు బయటకు కూడా ఈ జంట అందరికీ తెగ నచ్చింది. సినిమా సెట్ నుంచే వీరి స్నేహం మొదలయ్యింది. నెమ్మదిగా ప్రేమగా మారింది. 2017లో పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. కానీ, కొన్ని వ్యక్తిగత కారణాలతో అక్టోబర్ 2, 2021న విడిపోతున్నట్లు ప్రకటించారు. ఈ వార్త అప్పట్లో సంచలనం అయ్యింది. అయితే, వీడి విడాకులకు అసలు కారణం ఏంటనేది ఇప్పటి వరకు బయటకు రాలేదు. టాలీవుడ్ లో మోస్ట్ క్యూట్ కపుల్ గా పేరు తెచ్చుకున్న వీరిద్దరు విడిపోవడం పట్ల చాలా మంది సినీ అభిమానులు బాధపడ్డారు.
చైతన్య అలా.. సమంత ఇలా..
Read Also: శంకర్ అదిరిపోయే ప్లాన్ - పండుగలే టార్గెట్గా చరణ్, కమల్ మూవీస్ రిలీజ్