ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో ముత్తంశెట్టి మీడియాతో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న సినిమా 'పుష్ప: ద రైజ్'. ఇందులో రష్మికా మందన్నా కథానాయిక. ఆల్రెడీ విడుదలైన స్టిల్స్, టీజర్స్, మేకింగ్ వీడియోస్ సినిమా ఎలా ఉండబోతుంది? ఎంత రఫ్ అండ్ రగ్గడ్ లుక్‌లో ఉంటుంది? అనే క్లారిటీ ఇచ్చాయి. దాంతో ట్రైలర్ కోసం అందరూ ఎంతో ఆసక్తితో ఎదురు చూశారు.
సోమవారం సాయంత్రం ట్రైలర్ వస్తుందని ఆసక్తిగా యూట్యూబ్, సోషల్ మీడియా అకౌంట్స్ వైపు చూశారు. అయితే... వాళ్లందరికీ మైత్రీ మూవీ మేకర్స్ పెద్ద షాక్ ఇచ్చింది. అనివార్య కారణాల వల్ల చెప్పిన సమయానికి విడుదల చేయలేకపోతున్నామని పేర్కొంది. ఆలస్యానికి క్షమించమని కోరింది. దాంతో అల్లు అర్జున్ అభిమానులు నిర్మాణ సంస్థను నిందించడం మొదలుపెట్టారు. 




'ఆర్య', 'ఆర్య 2' సినిమాల తర్వాత అల్లు అర్జున్, సుకుమార్ కలయికలో రూపొందుతున్న హ్యాట్రిక్ చిత్రమిది. ఆ సినిమాలకు భిన్నమైన కథతో, ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్‌డ్రాప్‌లో 'పుష్ప' తెరకెక్కుతోంది. అల్లు అర్జున్ ఇంత రఫ్ అండ్ రుగ్గడ్ క్యారెక్టర్ చేయడం ఇదే తొలిసారి. ఈ సినిమా కోసం ఆయన మేకోవ‌ర్ అయ్యారు. కంప్లీట్‌గా లుక్ ఛేంజ్ చేశారు. ఈ సినిమాతో అల్లు అర్జున్ హిందీ సినిమా ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ అవుతున్న సంగతి తెలిసిందే. డిసెంబర్ 17న తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సినిమా విడుదల కానుంది.








Also Read: ఐదు భాషల్లో... 'యశోద'గా సమంత... సైలెంట్‌గా సెట్స్ మీదకు సినిమా!
Also Read: కన్నీళ్లు పెట్టుకున్న పూజా హెగ్డే... ఆలోచనలో పడ్డ ప్రభాస్!
Also Read: వెన్నుపోటు అంటేనే కళ్లల్లో నీళ్లొస్తున్నాయి... బాలకృష్ణ 'అన్ స్టాపబుల్' టాక్ 
Also Read: విల‌న్‌గా నటించడానికి బాలకృష్ణ రెడీ! అయితే... ఓ కండీషన్!
Also Read: నేను పెడుతున్న స్టోరీస్ చూసి 'ఎన్నారైలు అందర్నీ జనరలైజ్ చేయకే ల....' అని వాగక్కర్లేదు - చిన్మయి
Also Read: అమ్మాయిలను ఎప్పుడూ అలా చూడలేదా? ఇతర మహిళలకు లేనిది ఏమైనా నాకుందా? - పాయల్ బోల్డ్ రియాక్షన్
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి