కొంతకాలంగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించి టికెట్ రేట్ల కొనసాగుతూనే ఉంది. ఏపీలో అతి తక్కువ రేట్లకు సినిమా టికెట్లను అమ్మలేక కొన్ని థియేటర్లు మూతపడ్డాయి. ఈ క్రమంలో సినీ పెద్దలు స్వయంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను కలిసి తమ సమస్యలను వినిపించారు. దీంతో ఆయన టికెట్ రేట్లకు సంబంధించి జారీ చేసిన జీవోను సరిచేసి సరికొత్త జీవోను ఇష్యూ చేశారు. దీంతో మెగాస్టార్ చిరంజీవి.. జగన్ కి, సంబంధిత మంత్రులకు ధన్యవాదాలు చెబుతూ ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు. 

''తెలుగు సినిమా పరిశ్రమకు మేలు కలిగే విధంగా, అటు థియేటర్ల మనుగడను, ప్రజలకి వినోద అందుబాటులో ఉండాలనే సంకల్పాన్ని దృష్టిలో పెట్టుకుని, సినిమా టికెట్ రేట్స్ సవరిస్తూ సరికొత్త GO జారీ చేసిన ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వై ఎస్ జగన్ గారికి పరిశ్రమ తరుపున కృతజ్ఞతలు చిన్న సినిమాకు ఐదవ షో అవకాశం కల్పించటం ఎందరో నిర్మాతలకు ఉపయోగపడే అంశం. సంబంధిత మంత్రివర్యులు పేర్ని నాని గారికి, అధికారులకి, కమిటీకి ధన్యవాదాలు'' అంటూ చిరంజీవి రాసుకొచ్చారు. 






కొత్త జీవో ప్రకారం.. ఏ కేటగిరీ థియేటర్లలో ఎంత రేట్లకు టికెట్లను అమ్మాలంటే.. 

 

నాన్ ఏసీ థియేటర్స్: 

 

1. మున్సిపల్ కార్పొరేషన్లు
ప్రీమియం - రూ.60
నాన్ ప్రీమియం -  రూ.40
2. మున్సిపాలిటీ
ప్రీమియం - రూ.50
నాన్ ప్రీమియం -  రూ.30
3. నగర పంచాయతీలు/గ్రామ పంచాయతీలు
ప్రీమియం - రూ.40
నాన్ ప్రీమియం -  రూ.20

ఏసీ థియేటర్లు:

 

1. మున్సిపల్ కార్పొరేషన్లు
ప్రీమియం - రూ.100
నాన్ ప్రీమియం -  రూ.70
2. మున్సిపాలిటీ
ప్రీమియం - రూ.80
నాన్ ప్రీమియం -  రూ.60
3. నగర పంచాయతీలు/గ్రామ పంచాయతీలు
ప్రీమియం - రూ.70
నాన్ ప్రీమియం -  రూ.50

ప్రత్యేక థియేటర్లు (స్పెషల్ కేటగిరీ):

 

1. మున్సిపల్ కార్పొరేషన్లు
ప్రీమియం - రూ.125
నాన్ ప్రీమియం -  రూ.100
2. మున్సిపాలిటీ
ప్రీమియం - రూ.100
నాన్ ప్రీమియం -  రూ.80
3. నగర పంచాయతీలు/గ్రామ పంచాయతీలు
ప్రీమియం - రూ.90
నాన్ ప్రీమియం -  రూ.70

మల్టీప్లెక్స్:

 

1. మున్సిపల్ కార్పొరేషన్లు
రెగ్యులర్ సీట్లు - రూ.150
రిక్లెయినర్ - రూ.250
2. మున్సిపాలిటీ
రెగ్యులర్ సీట్లు - రూ.125
రిక్లెయినర్ - రూ.250
3. నగర పంచాయతీలు/గ్రామ పంచాయతీలు
రెగ్యులర్ సీట్లు - రూ.100
రిక్లెయినర్ - రూ.250