‘ఉప్పెన’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న వైష్ణవ్ తేజ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో రూపొందిన సినిమా 'కొండపొలం'. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఈ రోజు థియేటర్లలోకి వచ్చేసింది. నవల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్, ఇప్పటికే విడుదలైన పాటలు మంచి టాక్ సంపాదించుకున్నాయి. ఈ సినిమా ప్రీమియర్ చూసిన మెగాస్టార్ చిరంజీవి ట్వీట్స్ చేశారు..






ఈ సినిమా పై ఏమన్నారంటే.."కొండపొలం సినిమా ఇప్పుడే చూశాను, పవర్‌ఫుల్ సందేశంతో కూడుకున్న అందమైన గ్రామీణ ప్రేమ కథ ఇది. ఎప్పుడూ విభిన్న కథలు ఎంచుకుని, నటీనటుల నుంచి చక్కని నటన రాబట్టగల సత్తా క్రిష్‌కి ఉందని, ఈ చిత్రం ఎంతో మంది ప్రశంసలు, ఎన్నో అవార్డులను గెలుస్తుందని ఆశిస్తున్నాను" అని చిరంజీవి ట్వీట్ చేశారు.






వాస్తవానికి తాను కొండపొలంకు సంబంధించిన ఎలాంటి బుక్ చదవలేదని.. ఓ రోజు వైష్ణవ్ వచ్చి క్రిష్ దర్శకత్వంలో కొండపొలం అనే సినిమా చేస్తున్నాననని చెప్పగానే సరే అన్నానన్నారు. ఎందుకంటే క్రిష్ దర్శకత్వంలో విభిన్న పాత్రల్లో నటించే అవకాశం వస్తుందనే ఉద్దేశంతో సరే అని చెప్పా. అయితే తాను ఏదనకున్నానో అంతకుమించి ఉందని అభినందించారు.  వైష్ణ‌వ్ తేజ్ పెర్ఫామెన్స్, క్యారెక్ట‌రైజేష‌న్  అన్నీ డిఫ‌రెంట్‌గా ఉన్నాయన్నారు. క్రిష్ సినిమాలు ఒకదానితో మరొకటి సంబంధం ఉండదన్న చిరంజీవి.. గత చిత్రాల కన్నా పూర్తి భిన్నంగా ఉందన్నారు. ఇలాంటి సినిమాల‌ను ప్రేక్ష‌కులు ఆహ్వానించాలన్నారు మెగాస్టార్.






కొండపొలం సినిమాకు చిరంజీవి నుంచి దక్కిన అభినందలకు కృతజ్ఞతలు తెలిపారు దర్శకుడు క్రిష్.






 స‌న్న‌పురెడ్డి వెంక‌ట‌రామిరెడ్డి రాసిన ‘కొండ‌పొలం’ న‌వ‌ల‌ ఆధారంగా  ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాకు క్రిష్ దర్శకుడు. రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మాతలు. 


so Read: సన్నీ రాజ్యానికి బిగ్ బాస్ ఝలక్.. షణ్ముఖ్ టీమ్‌కు షాక్.. కెప్టెన్‌గా ప్రియా!
Also Read: టార్గెట్ హమీదా.. మళ్లీ కెప్టెన్ అవుతానంటున్న శ్రీరామ్.. ఎవరూ తగ్గట్లేదు!
Also Read:అమ్మకు ప్రేమతో.. జాన్వీ చేతిపై ఈ టాటూ ప్రత్యేకత తెలుసా?
Also Read:శరన్నవరాత్రుల సందర్భంగా మీ బంధుమిత్రులకు ఈ కోట్స్ తో శుభాకాంక్షలు తెలియజేయండి..
Also Read:ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి