యంగ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ, పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న సినిమా 'లైగర్'. అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది. రీసెంట్ గానే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో విడుదల చేయనున్నారు. సినిమా బిజినెస్ కూడా అదే రేంజ్ లో జరుగుతోంది. థియేట్రికల్ రైట్స్ కోసం బయ్యర్లు ఎగబడుతున్నారు. ఓ పక్క ఈ సినిమా పనులతో బిజీగా ఉంటూనే.. మరోపక్క పార్టీ మూడ్ ని ఎంజాయ్ చేస్తుంది 'లైగర్' టీమ్. 


గురువారం నాడు ప్రముఖ నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్ సీఈవో అపూర్వ మెహతా పుట్టినరోజు సందర్భంగా ముంబైలో గ్రాండ్ పార్టీ నిర్వహించారు. ఈ వేడుకకు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. అయితే ఈ పార్టీలో 'లైగర్' బ్యాచ్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. బ్లాక్ కలర్ కాస్ట్యూమ్స్ లో అందరూ ఆకట్టుకున్నారు. విజయ్ అయితే తన స్టైలిష్ లుక్ తో మరోసారి యూత్ ని ఫిదా చేశాడు. 


అయితే పార్టీలో విజయ్ తన కోస్టార్ అనన్య పాండేతో ముచ్చట్లు పెట్టాడు. ఇద్దరూ మాట్లాడుకుంటున్న సమయంలో ఛార్మి వెనక నుంచి వీడియో తీసింది. ఈ వీడియోను తన సోషల్ మీడియా అకౌంట్ లో షేర్ చేసింది. అలానే ఈ ఈవెంట్ కి సంబంధించిన కొన్ని ఫొటోలను షేర్ చేసుకుంది. ఈ ఫొటోలు, వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. 


ఇక ఈ సినిమాను ఈ ఏడాది ఆగస్ట్ 25న సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ప్రముఖ బాలీవుడ్ దర్శక నిర్మాత ప్రొడక్షన్ కంపెనీ ధర్మ ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్ బ్యానర్లపై తెరకెక్కుతోన్న ఈ సినిమాలో రమ్యకృష్ణ, రోనిత్ రాయ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.